Political News

10 నుంచి ప్ర‌జ‌ల్లోకి కేసీఆర్‌!

బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్‌.. ఈ నెల 10వ తేదీ నుంచి ప్ర‌జ‌ల్లోకి రానున్నారు. వినాయ‌క చ‌వితి ప‌ర్వ‌దినం ముగిసిన త‌ర్వాత ఆయ‌న ప్ర‌జ‌ల‌ను నేరుగా క‌లుసుకునేందుకు.. ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు బీఆర్ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను కేసీఆర్ ఎండ‌గ‌డ‌తార‌ని.. ప్ర‌జ‌ల‌తో క‌లిసి ఉద్య‌మానికి రెడీ అవుతార‌ని బీఆర్ఎస్ నాయ‌కులు తెలిపారు. తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. ప్రజా సమస్యలపై పోరాడేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

ప్ర‌జ‌ల నుంచి నిరంత‌రం.. లేఖ‌లు, ఫోన్లు, సందేశాల రూపంలో కేసీఆర్‌కు అనేక విన్న‌పాలు వ‌స్తున్నాయని బీఆర్ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. వీటిలో ప్ర‌స్తుత రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పైనే ఎక్కువ‌గా ఫిర్యాదులు వ‌స్తున్న‌ట్టు తెలిపారు. ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డం మానేసిన‌.. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం.. ఈ విష‌యాన్ని దారి మ‌ళ్లించేందుకు.. రాజ‌కీయ నేత‌ల నోరు నొక్కేందుకు హైడ్రా సంస్థ‌ను తీసుకువ‌చ్చింద‌నేది కేసీఆర్ అభిప్రాయంగా చెబుతున్నారు.

కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న నిర్మాణాలు.. రేవంత్‌రెడ్డికి ఇప్పుడే గుర్తుకు వ‌చ్చాయా? అనేది కేసీఆర్ ప్ర‌శ్న‌గా ఉంద‌న్నారు. దీనికితోడు రైతు రుణ మాఫీలోనూ అక్ర‌మాలు చోటు చేసుకున్న‌ట్టు ఫిర్యాదులు అందాయని.. ఇక‌, ఇత‌ర ప‌థ‌కాల అమ‌లుపై కూడా ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నార‌ని.. అందుకే వారి త‌ర‌ఫున పోరాటం చేసేందుకు కేసీఆర్‌.. ఈ నెల 10 త‌ర్వాత‌.. నేరుగా ప్ర‌జాక్షేత్రంలోకి దిగ‌నున్న‌ట్టు బీఆర్ఎస్ వ‌ర్గాలు వివ‌రించాయి. ఈ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి ప్ర‌ణాళిక‌లు సిద్ధం అవుతున్నాయ‌ని తెలిపాయి.

ఆరు గ్యారంటీల అమలు, అదుపుతప్పిన పాలనపై ‘సమరశంఖం’ పేరుతో ఉద్య‌మాన్ని నిర్వ‌హించే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నాయి. కాగా, అనారోగ్య కార‌ణాల‌తో కేసీఆర్‌.. గ‌త కొన్నాళ్లుగా ఇంటికే ప‌రిమితం అయ్యారు. అసెంబ్లీ బ‌డ్జెట్‌ స‌మావేశాల‌కు కూడా.. ఒక్క‌రోజు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. ఆ త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఇంటికే ప‌రిమితం అయ్యారు. ఇప్పుడు ప్ర‌జ‌ల నుంచివ‌స్తున్న అభ్య‌ర్థ‌న‌ల నేప‌థ్యంలో ఆయ‌న ప్ర‌జాక్షేత్రంలోకి రావాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.

This post was last modified on August 31, 2024 2:30 pm

Share

Recent Posts

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

3 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

3 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

4 hours ago

టార్గెట్ గ‌జ్వేల్‌.. కాంగ్రెస్ వ్యూహం ఇదీ!

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట‌. అయితే.. ఇక్క‌డే పాగా వేయాల‌ని.. వ‌చ్చే…

5 hours ago

మొహమాట పడితే ఎలాగయ్యా సట్టపులి

తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…

5 hours ago

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

11 hours ago