Political News

వైసీపీ విష‌యంలో బాబు వ్యూహం ఇదేనా..!

చంద్రబాబు వ్యూహంతో వైసిపి ఖాళీ అయిపోతుందా? ఇదీ ఇప్పుడు జరుగుతున్న ప్రధాన చర్చ. రాజకీయాల్లో ప్రత్యర్థులను దెబ్బతీయ‌డం, పార్టీలను ఖాళీ చేయటం అనేది ఆది నుంచి ఉన్న సమస్య కాదు. ఒకప్పుడు ప్రతిపక్షాలను గౌరవించే పద్ధతి, పరిస్థితి ఉండేది. అంతేకాదు అసలు ప్రతిపక్షాల నుంచి నాయకులు తీసుకునే సంస్కృతి కూడా ఒకప్పుడు ఉండేది కాదు. కానీ గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో పరిస్థితి మారిపోయింది. ఒక్క‌ రాష్ట్రంలోనే కాదు. దేశవ్యాప్తంగా కూడా 2000 సంవత్సరం నుంచి మార్పులు చేర్పులు అత్యంత దారుణంగా మారాయి.

త‌మకు కావాలి అనుకున్న నేతల విషయంలో కేసులు పెట్టడం, వారిని ఏదో ఒక విధంగా లొంగదీసుకో వడం లేదా ప్రలోభాలకు గురి చేయటం అనే సంస్కృతి జాతీయ రాజకీయాల్లోనే మొదలైంది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు వచ్చేసరికి మరింత ఎక్కువగా మారింది. చెప్పింది వినటమా? లేదా భయపెట్టి తీసుకోవడమా అనే ఈ రెండు సూత్రాలు ఎప్పుడు పని చేస్తున్నాయి. తెలంగాణ‌లోనూ ఇదే జ‌రుగుతోంది. ఈ క్రమంలో ఏపీలోను జగన్ హయాంలోనూ ఇలాగే జరిగింది. చంద్రబాబు హయాంలోనూ ఇలాగే జరిగింది.

అవకాశం – అవసరం అనే ఈ రెండు పట్టాలపైనే రాజకీయ నాయకులు పార్టీలు కూడా ప్రయాణం చేస్తున్నాయి. ఇలా చూసుకుంటే వైసీపీ ఖాళీ అవుతుందనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. అయితే చంద్రబాబు వ్యూహం వేరుగా ఉన్నట్టు తెలుస్తోంది. తమకు అవసరమున్నంత మేరకు నాయకులను తీసుకుని మిగిలిన వారి విషయంలో మౌనంగా ఉండటమే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలకు చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యంగా కనిపిస్తోంది. లెక్కకు మిక్కిలి నాయకులను తీసుకున్నా కూడా వారిని సర్దుబాటు చేయాల్సి ఉంటుంది.

పార్టీల్లోనూ అంతర్గత కుమ్ములాట‌లు పెరుగుతాయి. నాయకుల మధ్య ఆధిపత్యం పెరుగుతుంది. ప్రస్తుతం మైలవరంలో అయితే జరుగుతుంది. ఈ ఒక్క చోటే కాదు నూజివీడులోనూ ఇలాంటి పరిణామం కనిపిస్తోంది. దీనిని అంచనా వేసిన‌ చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వైసిపిని పూర్తిస్థాయిలో ఖాళీ చేయకపోయినా వైసీపీకి బలమైన గ‌ళాన్ని లేకుండా చేయాలనేది మాత్రం బాబు వ్యూహం. మరి ఏ మేరకు ఈ విషయంలో ఆయన సక్సెస్ అవుతారో చూడాలి.

This post was last modified on August 31, 2024 9:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

1 hour ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

జనసైనికుల మనసు దోచుకున్న నారా లోకేష్

“మనకు అన్నీ బాగున్నప్పుడు అందరూ తోడుంటారు. కానీ కష్టకాలంలో అండగా నిలిచినవారే మనవారు. అలాంటి వారిని జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు”…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

3 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

4 hours ago