ఒకవైపు హైడ్రాపై చర్చలు జరుగుతున్న సమయంలో.. ఆ సంస్థ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. పొద్దు పొద్దున్నే వాలిపోతోంది. రాత్రి నిద్ర పోయిన వారుతెల్లవారి కళ్లు తెరిచేలోగానే హైడ్రా కూల్చివేతలు పూర్తి చేసేస్తోంది. నిజానికి ఈ కూల్చివేతల సమయంలో అడ్డుకునేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. న్యాయ స్థానం మెట్లు ఎక్కేందుకు చూస్తున్నారు. కానీ.. కోర్టుల్లో పిటిషన్ వేసే లోగానే హైడ్రా పని చేసేస్తోంది. దీంతో వారికి ఊరట లభించడం లేదన్న వాదన వినిపిస్తోంది.
అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ విషయంలోనూ ఇదే జరిగింది. తెల్లవారు జామున 5 గంటలకే రంగం లోకి దిగిన హైడ్రా ఎన్ కన్వెన్షన్ను నేల మట్టం చేసింది. ఈ వ్యవహారం బయటి ప్రపంచానికి తెలిసే సరికే.. పావు వంతు కూల్చివేతలు అయిపోయాయి. ఇక, నాగార్జున మేల్కొని హైకోర్టుకు వెళ్లి.. స్టే తెచ్చుకు నే సరికి కాగల కార్యాన్ని హైడ్రా పూర్తి చేసేసింది. నాలాలు, చెరువులు, సరస్సులు(లేక్స్) ఆక్రమించుకుని కట్టుకున్నవారికి తగిన శాస్తి జరిగిందని కొందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కానీ, ఇదే సమయంలో గత అధికారులు ఇచ్చిన అనుమతుల మేరకే తాము నిర్మించామని.. తప్పు తమది కాదని వాదించేవారు.. తమకు కనీసం సమయం ఇవ్వకుండా ఇంత దూకుడు అవసరమా? అని వాపోతున్నారు. పైగా న్యాయ పోరాటానికి కూడా సమయం ఇవ్వకుండా చేయడాన్ని నిరసిస్తున్నారు. ఇక, తాజాగా హైడ్రా అధికారులు సికింద్రాబాద్ నడిబొడ్డున ఉన్న రాంనగర్ పై పడ్డారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలోని అడిక్మెట్లో నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేశారంటూ.. వాటిని శుక్రవారం తెల్లవారు జాము నుంచే కూల్చివేయడం ప్రారంభించారు.
వాస్తవానికి ఈ నిర్మాణాలను రెండు రోజుల కిందట హైడ్రా కమిషనర్ రంగనాథ్ చూసి వెళ్లారు. దీనిపై నివేదిక తెప్పించుకున్నారు. అయితే.. ఈ పరిణామాలతో సదరు నిర్మాణాల యజమానులు.. నోటీసులు ఇస్తారు లే.. అప్పుడు చూసుకుందాం.. అని భావించారు. కానీ.. ఉరుములు లేని వర్షంలా.. హైడ్రా శుక్రవారమే విరుచుకుపడింది. ఉదయం ఈ వార్త బయటకు వచ్చే సరికే.. నిర్మాణాల కూల్చి వేతలు పూర్తయ్యాయి. అయితే.. ఈ వ్యవహారంపైనా మిశ్రమ స్పందన వస్తుండడం గమనార్హం. తమకు అవకాశం ఇవ్వకుండానే ఇలా చేయడం ఏంటని యజమానులు చెబుతున్నారు.
This post was last modified on August 30, 2024 10:30 am
ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న…
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…