ఒకవైపు హైడ్రాపై చర్చలు జరుగుతున్న సమయంలో.. ఆ సంస్థ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. పొద్దు పొద్దున్నే వాలిపోతోంది. రాత్రి నిద్ర పోయిన వారుతెల్లవారి కళ్లు తెరిచేలోగానే హైడ్రా కూల్చివేతలు పూర్తి చేసేస్తోంది. నిజానికి ఈ కూల్చివేతల సమయంలో అడ్డుకునేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. న్యాయ స్థానం మెట్లు ఎక్కేందుకు చూస్తున్నారు. కానీ.. కోర్టుల్లో పిటిషన్ వేసే లోగానే హైడ్రా పని చేసేస్తోంది. దీంతో వారికి ఊరట లభించడం లేదన్న వాదన వినిపిస్తోంది.
అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ విషయంలోనూ ఇదే జరిగింది. తెల్లవారు జామున 5 గంటలకే రంగం లోకి దిగిన హైడ్రా ఎన్ కన్వెన్షన్ను నేల మట్టం చేసింది. ఈ వ్యవహారం బయటి ప్రపంచానికి తెలిసే సరికే.. పావు వంతు కూల్చివేతలు అయిపోయాయి. ఇక, నాగార్జున మేల్కొని హైకోర్టుకు వెళ్లి.. స్టే తెచ్చుకు నే సరికి కాగల కార్యాన్ని హైడ్రా పూర్తి చేసేసింది. నాలాలు, చెరువులు, సరస్సులు(లేక్స్) ఆక్రమించుకుని కట్టుకున్నవారికి తగిన శాస్తి జరిగిందని కొందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కానీ, ఇదే సమయంలో గత అధికారులు ఇచ్చిన అనుమతుల మేరకే తాము నిర్మించామని.. తప్పు తమది కాదని వాదించేవారు.. తమకు కనీసం సమయం ఇవ్వకుండా ఇంత దూకుడు అవసరమా? అని వాపోతున్నారు. పైగా న్యాయ పోరాటానికి కూడా సమయం ఇవ్వకుండా చేయడాన్ని నిరసిస్తున్నారు. ఇక, తాజాగా హైడ్రా అధికారులు సికింద్రాబాద్ నడిబొడ్డున ఉన్న రాంనగర్ పై పడ్డారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలోని అడిక్మెట్లో నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేశారంటూ.. వాటిని శుక్రవారం తెల్లవారు జాము నుంచే కూల్చివేయడం ప్రారంభించారు.
వాస్తవానికి ఈ నిర్మాణాలను రెండు రోజుల కిందట హైడ్రా కమిషనర్ రంగనాథ్ చూసి వెళ్లారు. దీనిపై నివేదిక తెప్పించుకున్నారు. అయితే.. ఈ పరిణామాలతో సదరు నిర్మాణాల యజమానులు.. నోటీసులు ఇస్తారు లే.. అప్పుడు చూసుకుందాం.. అని భావించారు. కానీ.. ఉరుములు లేని వర్షంలా.. హైడ్రా శుక్రవారమే విరుచుకుపడింది. ఉదయం ఈ వార్త బయటకు వచ్చే సరికే.. నిర్మాణాల కూల్చి వేతలు పూర్తయ్యాయి. అయితే.. ఈ వ్యవహారంపైనా మిశ్రమ స్పందన వస్తుండడం గమనార్హం. తమకు అవకాశం ఇవ్వకుండానే ఇలా చేయడం ఏంటని యజమానులు చెబుతున్నారు.
This post was last modified on August 30, 2024 10:30 am
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…
గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో…