Political News

టీడీపీ … బ్యాక్ టు బీసీ !

లోక్ సభ నియోజకవర్గాలకు తెలుగుదేశంపార్టీ నియమించిన అధ్యక్షుల్లో పదిమంది బిసీలే ఉన్నారు. పార్టీని పటిష్టంచేసే క్రమంలో ఇపుడున్న జిల్లాల అధ్యక్షుల స్ధానంలో ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా చేయాలని డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగానే 13 జిల్లాల అధ్యక్షుల స్ధానంలో చంద్రబాబునాయుడు 25 మంది అధ్యక్షలను నియమించారు. వీరిలో 10 చోట్ల బీసీలనే నియమించారు. ఇందులో కూడా ప్రధానంగా యాదవులకే ప్రాధన్యత ఇవ్వటం గమనార్హం. ఇంతమంది బీసీలకు ప్రాధాన్యత ఎందుకు ఇచ్చినట్లు ? ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో పార్టీకి దూరమైన బీసీలను మళ్ళీ దగ్గర చేసుకునే వ్యూహమే కనిపిస్తోంది.

అధ్యక్షులుగా నియమితులైన వారిలో 10 మంది బీసీలతో పాటు ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీ, ఒక ముస్లిం మైనారిటి నేత ఉన్నారు. మిగిలిన 11 మంది అధ్యక్షులను అగ్రవర్ణాల వారితో భర్తీ చేశారు. అంటే 25 అధ్యక్ష పదవుల్లో సగానికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటిలకు ప్రాధాన్యత ఇచ్చినట్లయ్యింది. టిడిపి ఏర్పాటు చేసినప్పటి నుండి పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న బీసీలు ఒక్కసారిగా దూరమైపోయారు. అంటే నూటికి నూరుశాతం దూరమైనట్లు కాదు కానీ బలమైన సెక్షన్ దూరమైన మాట మాత్రం వాస్తవమే.

పార్టీకి మద్దతుగా నిలుస్తున్న బీసీలు దూరమైపోవటంలో చంద్రబాబు స్వయంకృతమే ఎక్కువుంది. అధికారంలో ఉన్న ఐదేళ్ళల్లో చేతులారా సామాజికవర్గాన్ని దూరం చేసుకున్నారు. వివిధ అవసరాల కోసం తన దగ్గరకు వచ్చిన వాళ్ళని కసిరికొట్టడం, అందరిముందు అవమానిస్తు మాట్లాడటం, అక్కడక్కడ ఒకరిద్దరు నేతలపై చేయి చేసుకోవటం లాంటి సంఘటనలు జరిగాయి. అవి చిన్నవే కావచ్చు కానీ అలాంటి అవకాశాల కోసం కాచుకుని కూర్చున్న ప్రతిపక్ష వైకాపా వాటిని బలంగా వాడుకుంది. దీంతో అలాంటి సంఘటనలకు విస్తృత ప్రచారం లభించింది. దీంతో పాటు కమ్మ నాన్ కమ్మ విబజనకు వైకాపా బలమైన బీజాలు నాటింది. ఈ కారణాల వల్ల 10-20 శాతం బీసీలు పార్టీకి దూరమయ్యారు. ఫలితంగా గంప గుత్తగా టిడిపికి పడుతున్న బీసీల ఓట్లలో గణనీయమైన చీలిక వచ్చి కొన్ని ఓట్లు వైసిపికి పడ్డాయి. దాని ఫలితమే టిడిపికి ఘోర ఓటమి.

ఇక కార్యవర్గంలో చూస్తే ఈ పదిమంది బీసీల్లో విశాఖపట్నం, ఒంగోలు, తిరుపతి అధ్యక్షులుగా యాదవులను నియమించారు. శ్రీకాకుళంలో కళింగ, విజయనగరంలో తూర్పుకాపు, అనకాపల్లిలో గవర, అమలాపురంలో శెట్టిబలిజ, మచిలీపట్నంలో గౌడ, అనంతపురం బోయ, హిందుపురంలో కురబ ఉప సామాజికవర్గాల నేతలు అధ్యక్షులుగా నియమితులయ్యారు. బీసీలకు ఒక్కసారిగా ఎందుకింత ప్రాధాన్యతంటే దూరమైన సామాజికవర్గాలను మళ్ళీ దగ్గరకు తీసుకునే వ్యూహంగానే కనబడుతోంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డేమో బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇదే సమయంలో బీసీల్లోని అనేక సామాజికవర్గాల కోసం పథకాలు అమలు చేస్తున్నారు. మరి చంద్రబాబు అనుసరిస్తున్న బీసీల వ్యూహం ఫలిస్తుందా ?

This post was last modified on September 28, 2020 11:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

2 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

5 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

5 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

7 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

9 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

10 hours ago