వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న 11 మందిలో నలుగురు నుంచి ఐదుగురు వరకు పార్టీలు మారతారని.. కొన్నాళ్లుగా వినిపిస్తున్నదే. అయితే.. అనుకున్నట్టుగా కాకుండా.. ఊహించని విధంగా కొందరు పార్టీ మారుతుండడం ఇప్పుడు చర్చకు వస్తోంది. వీరిలోనూ బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ,గొల్ల బాబూరావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నిజానికి వీరిలో బీద మస్తాన్రావు, మోపిదేవి కన్ఫర్మ్ చేశారు. గొల్ల బాబూరావు మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది.
అయితే.. మోసిదేవితో పాటు.. గొల్ల బాబూరావు కూడా.. ఢిల్లీకి వెళ్తారని.. తన రాజీనామా పత్రం సమర్పిస్తార ని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇదిలావుంటే.. వీరు ఏ పార్టీలోకిజంప్ చేస్తారనే విషయం చూస్తే.. మోపిదేవి ఇప్పటికే.. టీడీపీకి జైకొట్టారు. ఇక, బీద ఎలానూ టీడీపీకి పాతకాపే కాబట్టి.. ఇటు వస్తారు. ఇక, గొల్ల పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అన్నట్టుగానేఉంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే.. వీరి వ్యవహార శైలి ఏంటో.. కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అధిష్టానం ఎంత ప్రేమగా చూసినా.. వారు అక్కడ ఉండలేదు.
మరి ఇలాంటివారిని తీసుకుని చంద్రబాబు సాధించేది ఏంటి? మోపిదేవిని జగన్ చూసుకున్నట్టుగా ఇంకెవరూ చూడలేదు. మంత్రి పదవి ఇచ్చారు. ఓడిపోయినా.. ఎమ్మెల్సీని చేశారు. తర్వాత.. రాజ్యసభకు పంపించారు. కేబినెట్ హోదా కల్పించారు. అయినా.. ఆయన పార్టీకి రాంరాం చెప్పేశారు. ఇక, బీద కూడా.. టీడీపీ నుంచి వచ్చాక 2019లో ఆయనకు కూడా రాజ్యసభ సీటును ఆఫర్ చేశారు. వ్యాపారాలకు కూడా అనుమతులు ఇచ్చారు. ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు.
గొల్ల బాబూరావు అయితే.. మరీ విడ్డూరం. ఈ ఏడాది ఎన్నికలకు ముందు రాజ్యసభ సీటు తెచ్చుకుని తృటిలో బతికిపోయారు. లేకపోయి ఉంటే.. ఆయన కూడా పాయకరావు పేట నుంచి పోటీ చేసి ఉంటే ఓడిపోయేవారు. ఇంత చేసినా..జగన్పై వారికి ఏమాత్రం అభిమానం లేదు. మరి ఇలాంటి నాయకులను తీసుకుంటే..చంద్రబాబు అవమానం కాదా? రేపు అవసరం తీరాక..చంద్రబాబును మాత్రం వారు ఉపేక్షిస్తారా? అనేది ప్రశ్న. ఏదేమైనా.. ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేయకపోతే.. చంద్రబాబుకే బ్యాడ్ నేమ్ అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 29, 2024 3:12 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…