వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న 11 మందిలో నలుగురు నుంచి ఐదుగురు వరకు పార్టీలు మారతారని.. కొన్నాళ్లుగా వినిపిస్తున్నదే. అయితే.. అనుకున్నట్టుగా కాకుండా.. ఊహించని విధంగా కొందరు పార్టీ మారుతుండడం ఇప్పుడు చర్చకు వస్తోంది. వీరిలోనూ బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ,గొల్ల బాబూరావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నిజానికి వీరిలో బీద మస్తాన్రావు, మోపిదేవి కన్ఫర్మ్ చేశారు. గొల్ల బాబూరావు మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది.
అయితే.. మోసిదేవితో పాటు.. గొల్ల బాబూరావు కూడా.. ఢిల్లీకి వెళ్తారని.. తన రాజీనామా పత్రం సమర్పిస్తార ని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇదిలావుంటే.. వీరు ఏ పార్టీలోకిజంప్ చేస్తారనే విషయం చూస్తే.. మోపిదేవి ఇప్పటికే.. టీడీపీకి జైకొట్టారు. ఇక, బీద ఎలానూ టీడీపీకి పాతకాపే కాబట్టి.. ఇటు వస్తారు. ఇక, గొల్ల పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అన్నట్టుగానేఉంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే.. వీరి వ్యవహార శైలి ఏంటో.. కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అధిష్టానం ఎంత ప్రేమగా చూసినా.. వారు అక్కడ ఉండలేదు.
మరి ఇలాంటివారిని తీసుకుని చంద్రబాబు సాధించేది ఏంటి? మోపిదేవిని జగన్ చూసుకున్నట్టుగా ఇంకెవరూ చూడలేదు. మంత్రి పదవి ఇచ్చారు. ఓడిపోయినా.. ఎమ్మెల్సీని చేశారు. తర్వాత.. రాజ్యసభకు పంపించారు. కేబినెట్ హోదా కల్పించారు. అయినా.. ఆయన పార్టీకి రాంరాం చెప్పేశారు. ఇక, బీద కూడా.. టీడీపీ నుంచి వచ్చాక 2019లో ఆయనకు కూడా రాజ్యసభ సీటును ఆఫర్ చేశారు. వ్యాపారాలకు కూడా అనుమతులు ఇచ్చారు. ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు.
గొల్ల బాబూరావు అయితే.. మరీ విడ్డూరం. ఈ ఏడాది ఎన్నికలకు ముందు రాజ్యసభ సీటు తెచ్చుకుని తృటిలో బతికిపోయారు. లేకపోయి ఉంటే.. ఆయన కూడా పాయకరావు పేట నుంచి పోటీ చేసి ఉంటే ఓడిపోయేవారు. ఇంత చేసినా..జగన్పై వారికి ఏమాత్రం అభిమానం లేదు. మరి ఇలాంటి నాయకులను తీసుకుంటే..చంద్రబాబు అవమానం కాదా? రేపు అవసరం తీరాక..చంద్రబాబును మాత్రం వారు ఉపేక్షిస్తారా? అనేది ప్రశ్న. ఏదేమైనా.. ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేయకపోతే.. చంద్రబాబుకే బ్యాడ్ నేమ్ అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 29, 2024 3:12 pm
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎంకేలకు టీవీకే పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే.…
తమిళనాడు ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్స్లో 105 స్థానాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ముందంజలో ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అందుక్కారణం నటుడు విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్ మార్కు దిశగా…
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ ముందంజలో ఉండటం చూస్తుంటే, అందరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రయాణం…
కాంగ్రెస్ పార్టీ..దేశంలోనే అతి పురాతన రాజకీయ పార్టీ… అదే ఆ పార్టీకి పెద్ద మైనస్. పాత పార్టీ… పాత పాట……
సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ ఏక్ దిన్ ఈ ఏడాది అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది.…