వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న 11 మందిలో నలుగురు నుంచి ఐదుగురు వరకు పార్టీలు మారతారని.. కొన్నాళ్లుగా వినిపిస్తున్నదే. అయితే.. అనుకున్నట్టుగా కాకుండా.. ఊహించని విధంగా కొందరు పార్టీ మారుతుండడం ఇప్పుడు చర్చకు వస్తోంది. వీరిలోనూ బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ,గొల్ల బాబూరావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నిజానికి వీరిలో బీద మస్తాన్రావు, మోపిదేవి కన్ఫర్మ్ చేశారు. గొల్ల బాబూరావు మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది.
అయితే.. మోసిదేవితో పాటు.. గొల్ల బాబూరావు కూడా.. ఢిల్లీకి వెళ్తారని.. తన రాజీనామా పత్రం సమర్పిస్తార ని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇదిలావుంటే.. వీరు ఏ పార్టీలోకిజంప్ చేస్తారనే విషయం చూస్తే.. మోపిదేవి ఇప్పటికే.. టీడీపీకి జైకొట్టారు. ఇక, బీద ఎలానూ టీడీపీకి పాతకాపే కాబట్టి.. ఇటు వస్తారు. ఇక, గొల్ల పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అన్నట్టుగానేఉంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే.. వీరి వ్యవహార శైలి ఏంటో.. కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అధిష్టానం ఎంత ప్రేమగా చూసినా.. వారు అక్కడ ఉండలేదు.
మరి ఇలాంటివారిని తీసుకుని చంద్రబాబు సాధించేది ఏంటి? మోపిదేవిని జగన్ చూసుకున్నట్టుగా ఇంకెవరూ చూడలేదు. మంత్రి పదవి ఇచ్చారు. ఓడిపోయినా.. ఎమ్మెల్సీని చేశారు. తర్వాత.. రాజ్యసభకు పంపించారు. కేబినెట్ హోదా కల్పించారు. అయినా.. ఆయన పార్టీకి రాంరాం చెప్పేశారు. ఇక, బీద కూడా.. టీడీపీ నుంచి వచ్చాక 2019లో ఆయనకు కూడా రాజ్యసభ సీటును ఆఫర్ చేశారు. వ్యాపారాలకు కూడా అనుమతులు ఇచ్చారు. ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు.
గొల్ల బాబూరావు అయితే.. మరీ విడ్డూరం. ఈ ఏడాది ఎన్నికలకు ముందు రాజ్యసభ సీటు తెచ్చుకుని తృటిలో బతికిపోయారు. లేకపోయి ఉంటే.. ఆయన కూడా పాయకరావు పేట నుంచి పోటీ చేసి ఉంటే ఓడిపోయేవారు. ఇంత చేసినా..జగన్పై వారికి ఏమాత్రం అభిమానం లేదు. మరి ఇలాంటి నాయకులను తీసుకుంటే..చంద్రబాబు అవమానం కాదా? రేపు అవసరం తీరాక..చంద్రబాబును మాత్రం వారు ఉపేక్షిస్తారా? అనేది ప్రశ్న. ఏదేమైనా.. ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేయకపోతే.. చంద్రబాబుకే బ్యాడ్ నేమ్ అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 29, 2024 3:12 pm
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…