వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న 11 మందిలో నలుగురు నుంచి ఐదుగురు వరకు పార్టీలు మారతారని.. కొన్నాళ్లుగా వినిపిస్తున్నదే. అయితే.. అనుకున్నట్టుగా కాకుండా.. ఊహించని విధంగా కొందరు పార్టీ మారుతుండడం ఇప్పుడు చర్చకు వస్తోంది. వీరిలోనూ బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ,గొల్ల బాబూరావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నిజానికి వీరిలో బీద మస్తాన్రావు, మోపిదేవి కన్ఫర్మ్ చేశారు. గొల్ల బాబూరావు మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది.
అయితే.. మోసిదేవితో పాటు.. గొల్ల బాబూరావు కూడా.. ఢిల్లీకి వెళ్తారని.. తన రాజీనామా పత్రం సమర్పిస్తార ని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇదిలావుంటే.. వీరు ఏ పార్టీలోకిజంప్ చేస్తారనే విషయం చూస్తే.. మోపిదేవి ఇప్పటికే.. టీడీపీకి జైకొట్టారు. ఇక, బీద ఎలానూ టీడీపీకి పాతకాపే కాబట్టి.. ఇటు వస్తారు. ఇక, గొల్ల పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అన్నట్టుగానేఉంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే.. వీరి వ్యవహార శైలి ఏంటో.. కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అధిష్టానం ఎంత ప్రేమగా చూసినా.. వారు అక్కడ ఉండలేదు.
మరి ఇలాంటివారిని తీసుకుని చంద్రబాబు సాధించేది ఏంటి? మోపిదేవిని జగన్ చూసుకున్నట్టుగా ఇంకెవరూ చూడలేదు. మంత్రి పదవి ఇచ్చారు. ఓడిపోయినా.. ఎమ్మెల్సీని చేశారు. తర్వాత.. రాజ్యసభకు పంపించారు. కేబినెట్ హోదా కల్పించారు. అయినా.. ఆయన పార్టీకి రాంరాం చెప్పేశారు. ఇక, బీద కూడా.. టీడీపీ నుంచి వచ్చాక 2019లో ఆయనకు కూడా రాజ్యసభ సీటును ఆఫర్ చేశారు. వ్యాపారాలకు కూడా అనుమతులు ఇచ్చారు. ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు.
గొల్ల బాబూరావు అయితే.. మరీ విడ్డూరం. ఈ ఏడాది ఎన్నికలకు ముందు రాజ్యసభ సీటు తెచ్చుకుని తృటిలో బతికిపోయారు. లేకపోయి ఉంటే.. ఆయన కూడా పాయకరావు పేట నుంచి పోటీ చేసి ఉంటే ఓడిపోయేవారు. ఇంత చేసినా..జగన్పై వారికి ఏమాత్రం అభిమానం లేదు. మరి ఇలాంటి నాయకులను తీసుకుంటే..చంద్రబాబు అవమానం కాదా? రేపు అవసరం తీరాక..చంద్రబాబును మాత్రం వారు ఉపేక్షిస్తారా? అనేది ప్రశ్న. ఏదేమైనా.. ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేయకపోతే.. చంద్రబాబుకే బ్యాడ్ నేమ్ అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 29, 2024 3:12 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…