Political News

క‌వితకు ఊర‌ట ద‌క్కిన‌ట్టేనా?  బిగ్ డిబేట్‌!

బీఆర్ ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత ఎట్ట‌కేల‌కు బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. అయితే.. దీనిని త‌మ విజ‌యంగా బీఆర్ ఎస్ నాయ‌కులు ప్ర‌చారం చేస్తున్నారు. అంతేకాదు.. `న్యాయం` గెలిచింద‌ని మాజీ మంత్రి, క‌విత సోద‌రుడు కేటీఆర్ కామెంట్ చేశారు. దీనిలో త‌ప్పులేకున్నా.. వాస్త‌వానికి క‌విత నిజంగానే గెలిచిందా? కేసును ఓడించిందా?  అనేది ఇక్క‌డ ప్ర‌శ్న‌. దీనికి పెద్ద‌గా లోతుపాతుల్లోకి వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. బెయిల్ పిటిష‌న్ విచార‌ణ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌ను నిశితంగా ప‌రిశీలిస్తే.. కేసు తీవ్ర‌త‌.. అర్థ‌మ‌వుతుంది.

క‌విత‌కు బెయిల్ ఇవ్వ‌డాన్ని స‌మ‌ర్థించిన సుప్రీంకోర్టు.. కేసును ఎక్క‌డా త‌ప్పుబ‌ట్ట‌లేదు. అయితే.. ద‌ర్యాప్తు అధికారులు వ్య‌వహరించిన తీరులో ఉన్న లోపాల‌ను మాత్రం ఎండ‌గ‌ట్టింది. ఇది స‌ర్వ‌సాధార‌ణంగా జ‌రిగేదే. గ‌తంలో ప్రొఫెస‌ర్ సాయిబాబా విషయంలోనూ ముంబై కోర్టు ఇలానే వ్యాఖ్యానించింది. మావోయిస్టుల‌తో చేతులుక‌లిపి.. ప్ర‌ధాని మోడీని అంత‌మొందించేందుకు మేధోప‌రిజ్ఞానం పంచుకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌తో సాయిబాబాను ఎన్ఐఏ అరెస్టు చేసి.. 2018 నుంచి జైల్లోనే ఉంచింది. దీనిలోనూ కేసు తేల‌లేదు. దీంతో ఆయ‌న పాత్రపై సందేహాలు వ్య‌క్తం చేసిన కోర్టు.. నిర్దోషిగా వెల్ల‌డించింది. అయితే.. కేసు తేలితే.. మాత్రం ఆయ‌న‌ను వ‌దిలిపెట్ట‌లేమ‌ని తేల్చి చెప్పింది.

ఇక‌, క‌విత విష‌యం వేరు. ఆమెపై సాక్ష్యాలు ఉన్నాయ‌ని.. కేసులో బ‌ల‌మైన‌.. ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయ‌ని.. సీబీఐ, ఈడీలు బ‌ల‌మైన సాక్ష్యాల‌ను కోర్టుకు స‌మ‌ర్పించాయి. దీంతో కేసు జోలికి పోవ‌డం లేద‌ని సుప్రీంకోర్టు పేర్కొంది. కేవ‌లం .. బెయిల్ ఇవ్వ‌చ్చా.. ఇవ్వ‌కూడ‌దా? అన్న రెండు అంశాల‌పైనే దృష్టి పెడ‌తామ‌ని చెప్పింది. ఈ క్ర‌మంలోనే సీబీఐ ఇప్ప‌టికే చార్జిషీట్లు దాఖ‌లు చేయ‌డం.. ఈడీ విచార‌ణ‌లు కూడా పూర్తి అయిన నేప‌థ్యంలోనే బెయిల్ ఇచ్చేందుకు సానుకూల‌త వ్య‌క్తం చేసింది త‌ప్ప‌.. క‌విత‌కు ఎక్క‌డా ఈ కేసుతో సంబంధం లేద‌ని స‌ర్టిఫికెట్ ఇవ్వ‌లేదు.

రేపు చార్జిషీట్ల‌పై విచార‌ణ ప్రారంభించిన త‌ర్వాత‌… క‌విత ఇరుకున ప‌డే అవ‌కాశం ఉంది. అయితే.. దీనికి కొంత స‌మ‌యం ప‌డుతుందే త‌ప్ప‌.. పూర్తిస్తాయిలో ఊర‌ట అయితే.. ఆమెకు ల‌భించ‌లేదు. అనేక మంది సాక్షులు.. రేపు కోర్టులో విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి ఉంటుంది. అప్పుడు వారు చెప్పే వాంగ్మూలాల ఆధారంగా క‌విత‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు అవ‌కాశం ఉంది. ఒక్క క‌వితే కాదు.. మ‌ద్యం కుంభ‌కోణంలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రిపైనా ఇదే క‌త్తి వేలాడుతోంది. సో.. ఇప్ప‌టికిప్పుడు త‌గ్గింది.. ఊర‌టే త‌ప్ప‌.. న్యాయం కాదు. ఈ కేసు ఇంకా కొన‌సాగుతుంది.

This post was last modified on August 28, 2024 12:21 pm

Share

Recent Posts

‘సనాతన’ వివాదంపై అనసూయ క్లారిటీ

టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముక్కుసూటిగా మాట్లాడడం, అనుకున్నది ఠక్కున చెప్పేయడం ఆమె నైజం. ఇక,…

1 hour ago

ప‌వ‌న్ స‌తీమ‌ణి సింప్లిసిటీ… రైలులో పిఠాపురం వరకు..

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సతీమ‌ని అన్నా కొణిదెల ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తున్నారు. త‌న…

1 hour ago

రాజగోపాల్ రెడ్డిపై ఈసారి వేటు తప్పదా?

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాకాలంగా సొంత పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్న సంగతి…

2 hours ago

మైత్రీ సినిమాలన్నీ గతంలోకే వెళ్తున్నాయే!

మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో ఉన్న లైనప్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తోంది. ప్రెజెంట్ నడుస్తున్న కథల కంటే…

3 hours ago

రేషన్ కార్డుపై మోదీ బొమ్మ వేయాల్సిందే!

ఈ రోజుల్లో పబ్లిసిటీకి కాదేదీ అనర్హం…రాజకీయ నేతలు మొదలు సినీ తారల వరకు అందరూ పబ్లిసిటీనే నమ్ముకున్నారంటే అతిశయోక్తి కాదు.…

3 hours ago

జగన్ కు అవమానం… జైలు సిబ్బంది క్లారిటీ

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ని పరామర్శించేందుకు కర్నూలు జిల్లా పంచలింగాల జైలు వద్దకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…

4 hours ago