Political News

మళ్లీ ‘గల్లా’ ఎగరేస్తాడా ?!

అమర్ రాజా బ్యాటరీస్ అధినేత, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ గురించి కొత్తగా చెప్పనక్కర లేదు. గుంటూరు నుండి రెండు సార్లు ఎంపీగా పోటీ చేసిన గల్లా వైసీపీ కక్ష్యపూరిత రాజకీయాల మూలంగా తన కంపెనీలు, కార్మికుల భవిష్యత్తు గురించి ఆలోచించి గత ఎన్నికల్లో రాజకీయాల నుండి వెనక్కి తగ్గి పోటీ చేయకుండా ఉండిపోయారు. నిజంగా పోటీ చేస్తే ఈ సారి గెలిచి కేంద్రంలో మంత్రి అయ్యేవాడు అన్న టాక్ వినిపిస్తుంది.

రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రస్తుత పరిస్థితులలో ఆయనను ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించి ఆయన సేవలు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలుస్తుంది. పారిశ్రామికవేత్తగా, రెండు సార్లు ఎంపీగా గల్లాకు ప్రజల సమస్యల మీద, ఏపీ ప్రభుత్వ అవసరాల మీద స్పష్టమయిన అవగాహన ఉంది. ఏపీలో కూటమికి స్పష్టమయిన బలం ఉన్న నేపథ్యంలో రాజ్యసభకు పోటీ చేసి తిరిగి చట్టసభలో అడుగు పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇక గుంటూరు నుండి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ నేరుగా కేంద్రమంత్రి అయిన నేపథ్యంలో ఆయన అక్కడి నుండి కదిలే అవకాశం ఉండదని, అందుకే ఏపీలోని ఇతర లోక్ సభ నియోజకవర్గాలలో ఏదైనా ఎంచుకుని భవిష్యత్తులో పోటీ చేయాలన్న ఆలోచన కూడా గల్లాకు ఉన్నట్లు తెలుస్తుంది.

2014 నుండి 2024 వరకు ఎంపీగా పనిచేసిన గల్లా పార్లమెంటు సమావేశాలకు 90 శాతం హాజరయ్యారు. 432 ప్రశ్నలు లేవనెత్తడంతో పాటు 105 చర్చలలో పాల్గొన్నారు. ఆయన లోక్ సభ పనితీరుకు 10కి 8.5 మార్కులు రావడం విశేషం.

This post was last modified on August 25, 2024 4:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

10 వేల కెపాసిటీ బ్యాటరీతో ఫోన్ వచ్చేసింది

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో రియల్‌మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్‌ను విడుదల చేసింది.…

26 minutes ago

వెండి కూడా బంగారానికి చేరువయ్యేలా..

​హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…

2 hours ago

కూతురు కాదు కసాయి… షాకింగ్ ఘటన

అమ్మాయిది అగ్రకులం... అబ్బాయిది వెనుకుబడిన కులం...ఇద్దరూ ప్రేమించుకున్నారు...కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు...ఆ తర్వాత ఆ ప్రేమ…

2 hours ago

జగన్ పాదయాత్రపై షర్మిల సంచలన వ్యాఖలు

ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…

5 hours ago

‘ఒరేయ్ తరుణ్ భాస్కర్… క్యారెక్టర్లో ఉండిపోకు’

దర్శకుడిగా తొలి చిత్రం ‘పెళ్ళిచూపులు’తో తరుణ్ భాస్కర్ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. రెండో సినిమా ‘ఈ నగరానికి…

5 hours ago

‘వారణాసి’లో పోస్టర్లు… జక్కన్న పనేనా..?

రాజమౌళి సినిమా అంటే ఒకప్పట్లా భారతీయ ప్రేక్షకులు మాత్రమే కాదు.. గ్లోబల్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. తన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…

6 hours ago