అమర్ రాజా బ్యాటరీస్ అధినేత, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ గురించి కొత్తగా చెప్పనక్కర లేదు. గుంటూరు నుండి రెండు సార్లు ఎంపీగా పోటీ చేసిన గల్లా వైసీపీ కక్ష్యపూరిత రాజకీయాల మూలంగా తన కంపెనీలు, కార్మికుల భవిష్యత్తు గురించి ఆలోచించి గత ఎన్నికల్లో రాజకీయాల నుండి వెనక్కి తగ్గి పోటీ చేయకుండా ఉండిపోయారు. నిజంగా పోటీ చేస్తే ఈ సారి గెలిచి కేంద్రంలో మంత్రి అయ్యేవాడు అన్న టాక్ వినిపిస్తుంది.
రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రస్తుత పరిస్థితులలో ఆయనను ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించి ఆయన సేవలు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలుస్తుంది. పారిశ్రామికవేత్తగా, రెండు సార్లు ఎంపీగా గల్లాకు ప్రజల సమస్యల మీద, ఏపీ ప్రభుత్వ అవసరాల మీద స్పష్టమయిన అవగాహన ఉంది. ఏపీలో కూటమికి స్పష్టమయిన బలం ఉన్న నేపథ్యంలో రాజ్యసభకు పోటీ చేసి తిరిగి చట్టసభలో అడుగు పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇక గుంటూరు నుండి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ నేరుగా కేంద్రమంత్రి అయిన నేపథ్యంలో ఆయన అక్కడి నుండి కదిలే అవకాశం ఉండదని, అందుకే ఏపీలోని ఇతర లోక్ సభ నియోజకవర్గాలలో ఏదైనా ఎంచుకుని భవిష్యత్తులో పోటీ చేయాలన్న ఆలోచన కూడా గల్లాకు ఉన్నట్లు తెలుస్తుంది.
2014 నుండి 2024 వరకు ఎంపీగా పనిచేసిన గల్లా పార్లమెంటు సమావేశాలకు 90 శాతం హాజరయ్యారు. 432 ప్రశ్నలు లేవనెత్తడంతో పాటు 105 చర్చలలో పాల్గొన్నారు. ఆయన లోక్ సభ పనితీరుకు 10కి 8.5 మార్కులు రావడం విశేషం.
This post was last modified on August 25, 2024 4:34 pm
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…