Political News

ఇది పిన్నెల్లికి పరువు సమస్య

ప‌ల్నాడు జిల్లా మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం పేరు ఇటీవ‌ల కాలంలో రాష్ట్రాల స‌రిహ‌ద్దులు కూడా దాటిపోయిన విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల పోలింగ్ స‌మ‌యంలో ఈవీఎం, వీవీ ప్యాట్‌ల‌ను ధ్వంసం చేసిన వైసీపీ నాయ‌కుడు, అప్ప‌టి ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డి ఉదంతం దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. త‌ర్వాత పోలీసుల‌పై దాడులు.. టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడుల కేసుల‌తో మాచ‌ర్ల వ్య‌వ‌హారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

ఆయా కేసుల నేప‌థ్యంలో పిన్నెల్లి ప్ర‌స్తుతం జైల్లో ఉన్నారు. అయితే.. ఇక్క‌డ సుమారు రెండు ద‌శాబ్దాల త‌ర్వాత‌.. పెను సంచ‌ల‌నం చోటు చేసుకుంది. పిన్నెల్లి హ‌యాం నుంచి ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే న‌డిచిన మాచ‌ర్ల మునిసిపాలిటీ.. కార్య‌క‌లాపాలు.. ఇక్క‌డి పాల‌వ‌ర్గం అంతా.. ఇప్పుడు మూకుమ్మ‌డిగా టీడీపీలోకి చేరారు. నిజానికి పిన్నెల్లి కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు.. త‌ర్వాత‌.. వైసీపీలోకి చేరిన‌ప్పుడు కూడా ఆయ‌న‌దే హ‌వా అన్న‌ట్టుగా ఇక్క‌డ సాగిన విష‌యం తెలిసిందే.

అంతేకాదు.. మాచ‌ర్ల‌లో వేరే పార్టీ జెండా ఎగ‌రాలంటే.. భ‌య‌ప‌డిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో ఏ ఎన్నిక వ‌చ్చినా పిన్నెల్లి వ‌ర్గ‌మే విజ‌యం ద‌క్కించుకునేది. ఇలానే 2021లో వ‌చ్చిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా మాచ‌ర్ల‌లో ఎవ‌రూ నామినేష‌న్ వేసేందుకు కూడా సాహ‌సించే ప‌రిస్థితి లేకుండా పోయింది. కేవ‌లం పిన్నెల్లి ఆశీస్సులు ఉన్న వారే ఇక్క‌డ నామినేష‌న్ వేసి.. విజ‌యంద‌క్కించుకున్నారు. ఇలానే మాచ‌ర్ల మునిసిపాలిటీ ఏర్ప‌డింది.

అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు అనూహ్య‌మైన మార్పులు చోటు చేసుకున్నాయి. పిన్నెల్లి మాటే విని పించ‌డం లేదు. వైసీపీ జెండాలు క‌నిపించ‌డం లేదు. తాజా ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ త‌ర‌ఫున జూలకంటి బ్ర‌హ్మానంద‌రెడ్డి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, అప్ప‌టి నుంచి స్థానిక నాయ‌క‌త్వం అంతా కూడా టీడీపీ వెంటే న‌డుస్తోంది. ఇలానే.. తాజా మాచ‌ర్ల మునిసిపాలిటీలోని 16 మంది కౌన్సిల‌ర్లు కూడా వైసీపీకి రాజీనామా చేసి.. టీడీపీలో చేరిపోయారు. దీంతో ఇక్క‌డ తాజాగా టీడీపీ నేతృత్వంలోని న‌ర‌సింహారావు చైర్మ‌న్‌గా ప్ర‌మాణ స్వీకారం చేశారు.

This post was last modified on August 23, 2024 6:40 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

2 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

3 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

3 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

3 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

5 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

5 hours ago