Political News

ఇది పిన్నెల్లికి పరువు సమస్య

ప‌ల్నాడు జిల్లా మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం పేరు ఇటీవ‌ల కాలంలో రాష్ట్రాల స‌రిహ‌ద్దులు కూడా దాటిపోయిన విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల పోలింగ్ స‌మ‌యంలో ఈవీఎం, వీవీ ప్యాట్‌ల‌ను ధ్వంసం చేసిన వైసీపీ నాయ‌కుడు, అప్ప‌టి ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డి ఉదంతం దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. త‌ర్వాత పోలీసుల‌పై దాడులు.. టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడుల కేసుల‌తో మాచ‌ర్ల వ్య‌వ‌హారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

ఆయా కేసుల నేప‌థ్యంలో పిన్నెల్లి ప్ర‌స్తుతం జైల్లో ఉన్నారు. అయితే.. ఇక్క‌డ సుమారు రెండు ద‌శాబ్దాల త‌ర్వాత‌.. పెను సంచ‌ల‌నం చోటు చేసుకుంది. పిన్నెల్లి హ‌యాం నుంచి ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే న‌డిచిన మాచ‌ర్ల మునిసిపాలిటీ.. కార్య‌క‌లాపాలు.. ఇక్క‌డి పాల‌వ‌ర్గం అంతా.. ఇప్పుడు మూకుమ్మ‌డిగా టీడీపీలోకి చేరారు. నిజానికి పిన్నెల్లి కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు.. త‌ర్వాత‌.. వైసీపీలోకి చేరిన‌ప్పుడు కూడా ఆయ‌న‌దే హ‌వా అన్న‌ట్టుగా ఇక్క‌డ సాగిన విష‌యం తెలిసిందే.

అంతేకాదు.. మాచ‌ర్ల‌లో వేరే పార్టీ జెండా ఎగ‌రాలంటే.. భ‌య‌ప‌డిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో ఏ ఎన్నిక వ‌చ్చినా పిన్నెల్లి వ‌ర్గ‌మే విజ‌యం ద‌క్కించుకునేది. ఇలానే 2021లో వ‌చ్చిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా మాచ‌ర్ల‌లో ఎవ‌రూ నామినేష‌న్ వేసేందుకు కూడా సాహ‌సించే ప‌రిస్థితి లేకుండా పోయింది. కేవ‌లం పిన్నెల్లి ఆశీస్సులు ఉన్న వారే ఇక్క‌డ నామినేష‌న్ వేసి.. విజ‌యంద‌క్కించుకున్నారు. ఇలానే మాచ‌ర్ల మునిసిపాలిటీ ఏర్ప‌డింది.

అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు అనూహ్య‌మైన మార్పులు చోటు చేసుకున్నాయి. పిన్నెల్లి మాటే విని పించ‌డం లేదు. వైసీపీ జెండాలు క‌నిపించ‌డం లేదు. తాజా ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ త‌ర‌ఫున జూలకంటి బ్ర‌హ్మానంద‌రెడ్డి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, అప్ప‌టి నుంచి స్థానిక నాయ‌క‌త్వం అంతా కూడా టీడీపీ వెంటే న‌డుస్తోంది. ఇలానే.. తాజా మాచ‌ర్ల మునిసిపాలిటీలోని 16 మంది కౌన్సిల‌ర్లు కూడా వైసీపీకి రాజీనామా చేసి.. టీడీపీలో చేరిపోయారు. దీంతో ఇక్క‌డ తాజాగా టీడీపీ నేతృత్వంలోని న‌ర‌సింహారావు చైర్మ‌న్‌గా ప్ర‌మాణ స్వీకారం చేశారు.

This post was last modified on August 23, 2024 6:40 pm

Share
Show comments
Published by
Satya
Tags: Pinnelli

Recent Posts

ఏఎంబీ… ఇక్కడ హిట్… అక్కడ ఫ్లాప్?

ఏషియన్ సినిమా సంస్థ.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోల…

7 minutes ago

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

2 hours ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

జనసైనికుల మనసు దోచుకున్న నారా లోకేష్

“మనకు అన్నీ బాగున్నప్పుడు అందరూ తోడుంటారు. కానీ కష్టకాలంలో అండగా నిలిచినవారే మనవారు. అలాంటి వారిని జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు”…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

3 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

4 hours ago