Political News

ఇది పిన్నెల్లికి పరువు సమస్య

ప‌ల్నాడు జిల్లా మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం పేరు ఇటీవ‌ల కాలంలో రాష్ట్రాల స‌రిహ‌ద్దులు కూడా దాటిపోయిన విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల పోలింగ్ స‌మ‌యంలో ఈవీఎం, వీవీ ప్యాట్‌ల‌ను ధ్వంసం చేసిన వైసీపీ నాయ‌కుడు, అప్ప‌టి ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డి ఉదంతం దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. త‌ర్వాత పోలీసుల‌పై దాడులు.. టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడుల కేసుల‌తో మాచ‌ర్ల వ్య‌వ‌హారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

ఆయా కేసుల నేప‌థ్యంలో పిన్నెల్లి ప్ర‌స్తుతం జైల్లో ఉన్నారు. అయితే.. ఇక్క‌డ సుమారు రెండు ద‌శాబ్దాల త‌ర్వాత‌.. పెను సంచ‌ల‌నం చోటు చేసుకుంది. పిన్నెల్లి హ‌యాం నుంచి ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే న‌డిచిన మాచ‌ర్ల మునిసిపాలిటీ.. కార్య‌క‌లాపాలు.. ఇక్క‌డి పాల‌వ‌ర్గం అంతా.. ఇప్పుడు మూకుమ్మ‌డిగా టీడీపీలోకి చేరారు. నిజానికి పిన్నెల్లి కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు.. త‌ర్వాత‌.. వైసీపీలోకి చేరిన‌ప్పుడు కూడా ఆయ‌న‌దే హ‌వా అన్న‌ట్టుగా ఇక్క‌డ సాగిన విష‌యం తెలిసిందే.

అంతేకాదు.. మాచ‌ర్ల‌లో వేరే పార్టీ జెండా ఎగ‌రాలంటే.. భ‌య‌ప‌డిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో ఏ ఎన్నిక వ‌చ్చినా పిన్నెల్లి వ‌ర్గ‌మే విజ‌యం ద‌క్కించుకునేది. ఇలానే 2021లో వ‌చ్చిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా మాచ‌ర్ల‌లో ఎవ‌రూ నామినేష‌న్ వేసేందుకు కూడా సాహ‌సించే ప‌రిస్థితి లేకుండా పోయింది. కేవ‌లం పిన్నెల్లి ఆశీస్సులు ఉన్న వారే ఇక్క‌డ నామినేష‌న్ వేసి.. విజ‌యంద‌క్కించుకున్నారు. ఇలానే మాచ‌ర్ల మునిసిపాలిటీ ఏర్ప‌డింది.

అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు అనూహ్య‌మైన మార్పులు చోటు చేసుకున్నాయి. పిన్నెల్లి మాటే విని పించ‌డం లేదు. వైసీపీ జెండాలు క‌నిపించ‌డం లేదు. తాజా ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ త‌ర‌ఫున జూలకంటి బ్ర‌హ్మానంద‌రెడ్డి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, అప్ప‌టి నుంచి స్థానిక నాయ‌క‌త్వం అంతా కూడా టీడీపీ వెంటే న‌డుస్తోంది. ఇలానే.. తాజా మాచ‌ర్ల మునిసిపాలిటీలోని 16 మంది కౌన్సిల‌ర్లు కూడా వైసీపీకి రాజీనామా చేసి.. టీడీపీలో చేరిపోయారు. దీంతో ఇక్క‌డ తాజాగా టీడీపీ నేతృత్వంలోని న‌ర‌సింహారావు చైర్మ‌న్‌గా ప్ర‌మాణ స్వీకారం చేశారు.

This post was last modified on August 23, 2024 6:40 pm

Share
Show comments
Published by
Satya
Tags: Pinnelli

Recent Posts

హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ పై నైట్ ఫ్రాంక్ రిపోర్టు చదివారా?

హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. గతానికి భిన్నంగా దేశంలోని మెట్రోపాలిటిన్ నగరాల్లో కొన్నింటిని మించిపోయిన భాగ్యనగరి.. మరికొన్ని మహానగరాల దూకుడుకు ఏ…

3 hours ago

వ‌లంటీర్లు-స‌చివాల‌యాల‌పై ఏపీ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం

రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన రెండు కీల‌క వ్య‌వ‌స్థ‌ల‌ను ప్ర‌భుత్వ శాఖ‌ల్లో క‌లిపేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. జ‌గ‌న్ హ‌యాంలో…

6 hours ago

అపార్టుమెంట్ పార్కింగ్ ఇష్యూ సుప్రీం వరకు వెళ్లింది

ఒక అపార్టుమెంట్ లోని పార్కింగ్ వద్ద చోటు చేసుకున్న పంచాయితీ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లటం…

7 hours ago

స్పిరిట్ కోసం క్రేజీ విలన్ జంట ?

దేవర పార్ట్ 1 విడుదల కోసం అభిమానులతో సమానంగా విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఆతృతగా ఎదురు…

7 hours ago

`10 టు 10`.. ఇదీ ఏపీ లిక్క‌ర్ పాల‌సీ!

ఏపీలో చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం నూత‌న మ‌ద్యం విధానాన్ని తీసుకువ‌స్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా జ‌రిగిన మంత్రి వ‌ర్గ…

9 hours ago

‘శ్రీవారి ప్ర‌సాదంలో జంతువుల కొవ్వు క‌లిపారు’

అనేక వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చి.. తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునే భ‌క్తుల‌ను వైసీపీ ప్ర‌భుత్వం నిలువునా మోసం చేసింద‌ని ఏపీ సీఎం…

9 hours ago