అనంతపురం జిల్లాలోని కీలకమైన తాడిపత్రి నియోజకవర్గం మరోసారి రణరంగంగా మారింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత.. ఇక్కడ ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ వైసీపీ మాజీ ఎమ్మలె్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర వివాదాలు కొనసాగాయి. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని పెద్దారెడ్డిని కొన్నాళ్లు .. నగరం విడిచి వెళ్లాలని చెప్పడంతో కొన్నాళ్లుగా ఆయన తాడిపత్రి నుంచి వెళ్లిపోయారు. దీంతో అప్పటి నుంచి పరిస్థితులు సానుకూలంగా మారాయి. కానీ, తాజాగా మంగళవారం పెద్దారెడ్డి తిరిగి తాడిపత్రిలో అడుగు పెట్టారు.
పెద్దారెడ్డి రాకతో మరోసారి తాడిపత్రిలో రగడ ప్రారంభమైంది. పలు కేసులకు సంబంధించి ఇంట్లో ఉన్న పత్రాలు తీసుకునేందుకు వచ్చానని పెద్దారెడ్డి చెబుతున్నారు. అయితే.. ఆయన వచ్చిన విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు.. పెద్దారెడ్డి ఇంటిని ముట్టడించారు. టీడీపీ కార్యకర్తలు వస్తున్న విషయం పసిగట్టిన పెద్దారెడ్డి వర్గీయులు కర్రలు, రాళ్లతో అక్కడకు చేరుకుని టీడీపీ వారిని తరిమికొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు పక్షాల మధ్య రగడ తీవ్రస్థాయికి చేరింది. ఈ క్రమంలో పెద్దారెడ్డి అనుచరుడు కందిగోపుల మురళి రెచ్చిపోవడంతో ఆయన ఇంటిపైకి కూడా టీడీపీ కార్యకర్తలు ముట్టడించారు.
ఇంటి ముందు పార్కు చేసిన కారును కొందరు ధ్వంసం చేశారు. స్కూటీలకు నిప్పు పెట్టారు. దీంతో రగడ తీవ్రస్థాయికి చేరింది. ఇరువర్గాల కార్యకర్తల దాడులతో తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొంది. విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగి ఇరు పక్షాలపైనా లాఠీ చార్జీ చేశారు. అయినప్పటికీ టీడీపీ, వైసీపీ కార్యకర్తలు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఇరు పక్షాలు రాళ్లు రువ్వుకున్నాయి. దీంతో పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి అనంతపురం పంపించేసిన పోలీసులు నగరంలో పికెట్ ఏర్పాటు చేశారు. ఇదేసమయంలో టీడీపీ కార్యకర్తలను కూడా చెదరగొట్టారు. ఈ పరిణామాలపై డీజీపీ స్పందించి.. మరిన్ని బలగాలను పంపించారు. ఎలాంటి హింసకు తావులేదని.. అవసరమైతే.. ముఖ్య నాయకులను గృహ నిర్బంధం చేయాలని డీజీపీ ఆదేశించారు.
This post was last modified on August 21, 2024 7:25 am
రాష్ట్ర బీజేపీలో నాయకుల నియామకం.. కొత్తగా వచ్చే వారికి అవకాశం ఇవ్వడం... ఉన్న వారికి పనులు కేటాయించడం.. అనేది సహజం.…
ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ సంక్షోభం నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. తాజాగా…
ఎప్పుడూ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటూ హీరోల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. హీరోయిన్ల గురించి అంత…
టాలీవుడ్ లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పెద్ద కొడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో పెద్ద స్టార్ అయిపోయాడు.…
కొన్ని డిమాండ్ల గురించి చర్చకు తీసుకొచ్చినప్పుడు.. ఒకవైపు వాదన విన్నప్పుడు నిజమే కదా? అనిపిస్తుంది. కానీ.. అదే విషయాన్ని మరో…
పిఠాపురం మున్సిపల్అధికారులపై టీడీపీ నేత వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో తమ నేత చంద్రబాబు నాయుడి ఫొటో…