అనంతపురం జిల్లాలోని కీలకమైన తాడిపత్రి నియోజకవర్గం మరోసారి రణరంగంగా మారింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత.. ఇక్కడ ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ వైసీపీ మాజీ ఎమ్మలె్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర వివాదాలు కొనసాగాయి. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని పెద్దారెడ్డిని కొన్నాళ్లు .. నగరం విడిచి వెళ్లాలని చెప్పడంతో కొన్నాళ్లుగా ఆయన తాడిపత్రి నుంచి వెళ్లిపోయారు. దీంతో అప్పటి నుంచి పరిస్థితులు సానుకూలంగా మారాయి. కానీ, తాజాగా మంగళవారం పెద్దారెడ్డి తిరిగి తాడిపత్రిలో అడుగు పెట్టారు.
పెద్దారెడ్డి రాకతో మరోసారి తాడిపత్రిలో రగడ ప్రారంభమైంది. పలు కేసులకు సంబంధించి ఇంట్లో ఉన్న పత్రాలు తీసుకునేందుకు వచ్చానని పెద్దారెడ్డి చెబుతున్నారు. అయితే.. ఆయన వచ్చిన విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు.. పెద్దారెడ్డి ఇంటిని ముట్టడించారు. టీడీపీ కార్యకర్తలు వస్తున్న విషయం పసిగట్టిన పెద్దారెడ్డి వర్గీయులు కర్రలు, రాళ్లతో అక్కడకు చేరుకుని టీడీపీ వారిని తరిమికొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు పక్షాల మధ్య రగడ తీవ్రస్థాయికి చేరింది. ఈ క్రమంలో పెద్దారెడ్డి అనుచరుడు కందిగోపుల మురళి రెచ్చిపోవడంతో ఆయన ఇంటిపైకి కూడా టీడీపీ కార్యకర్తలు ముట్టడించారు.
ఇంటి ముందు పార్కు చేసిన కారును కొందరు ధ్వంసం చేశారు. స్కూటీలకు నిప్పు పెట్టారు. దీంతో రగడ తీవ్రస్థాయికి చేరింది. ఇరువర్గాల కార్యకర్తల దాడులతో తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొంది. విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగి ఇరు పక్షాలపైనా లాఠీ చార్జీ చేశారు. అయినప్పటికీ టీడీపీ, వైసీపీ కార్యకర్తలు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఇరు పక్షాలు రాళ్లు రువ్వుకున్నాయి. దీంతో పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి అనంతపురం పంపించేసిన పోలీసులు నగరంలో పికెట్ ఏర్పాటు చేశారు. ఇదేసమయంలో టీడీపీ కార్యకర్తలను కూడా చెదరగొట్టారు. ఈ పరిణామాలపై డీజీపీ స్పందించి.. మరిన్ని బలగాలను పంపించారు. ఎలాంటి హింసకు తావులేదని.. అవసరమైతే.. ముఖ్య నాయకులను గృహ నిర్బంధం చేయాలని డీజీపీ ఆదేశించారు.
This post was last modified on August 21, 2024 7:25 am
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…