వైసీపీలో ఉన్నవారంతా దండు పాళ్యం బ్యాచేనని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైరయ్యారు. వైసీపీ హయాంలో పనిచేసిన అధికారులు అన్ని వ్యవస్థలను నాకించేశారని చెప్పారు. ఎక్కడికక్కడ తప్పులు కనిపిస్తున్నాయని.. అయితే, విచారణలకు భయపడి రికార్డులను, ఫైళ్లను కూడా తగుల బెడుతున్నారని దుయ్యబట్టారు. “జగన్కు ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్క శాఖలో అయినా అవినీతి చేయలేదని చెప్పగలరా?” అని వెంకన్న ప్రశ్నించారు.
వైసీపీ హయంలో అందిన కాడికి దండుపాళ్యం బ్యాచ్ దండుకుందన్న వెంకన్న అవినీతి చేశారనే భయంతోనే ఫైళ్లను తగులబెడుతున్నారని దుయ్యబట్టారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన బుద్దా వెంకన్న అన్ని శాఖల్లోనూ వైసీపీ హయాంలో అడ్డగోలుగా నియామకాలు జరిగాయన్నారు. వైసీపీ నేతలు, కొంతమంది అధికారులు కుమ్మక్కై ప్రజాధనాన్ని అందినంత దోచుకున్నారని విమర్శించారు. “దండు పాళ్యం బ్యాచ్ను, ఆ బ్యాచ్ నాయకుడిని చూసి భయపడిన పారిశ్రామిక వేత్తలు.. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు జంకా”రని తెలిపారు.
చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావడంతో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు క్యూ కడుతున్నారని బుద్ధా వెంకన్న చెప్పారు. తమ ఘన కార్యం వల్లే ఏపీకి పెట్టుబడులు వస్తున్నట్టు వైసీపీ నేతలు చెప్పుకోవడానికి సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. అగ్రిగోల్డ్ భూములను కొట్టేసేందుకు మాజీ మంత్రి జోగి రమేష్ ప్రయత్నించారని బుద్దా వెంకన్న దుయ్యబట్టారు. “జగన్ పెద్ద పెద్ద దోపిడీలు చేశారు. ఆయన అడుగు జాడల్లో ఆ పార్టీ నేతలు అందినకాడికి దోచుకున్నారు” అని వెంకన్న మండిపడ్డారు.
This post was last modified on August 20, 2024 2:34 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…