Political News

వేణు స్వామిని క‌డిగి పారేశారు

వేణు స్వామి.. ఈ జ్యోతిష్యుడి గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కుల భ‌విత‌వ్యం గురించి జోస్యం చెబుతూ సోష‌ల్ మీడియాలో బాగా పాపుల‌ర్ అయ్యారీయ‌న‌. కొన్ని సంద‌ర్భాల్లో ఆయ‌న జోస్యాలు ఫలించాయి. చాలానే తేడా కొట్టాయి.

ఐతే సెల‌బ్రెటీల వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి కూడా వెళ్లిపోయి అవ‌స‌రం లేని సంద‌ర్భాల్లోనూ జోస్యాలు చెప్పడంతో వేణు స్వామి మీద తీవ్ర విమర్శ‌లు త‌ప్ప‌లేదు. ఇటీవ‌లే నాగ‌చైత‌న్య‌, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం చేసుకుంటే.. వాళ్లిద్ద‌రూ మూడేళ్ల‌లో విడిపోతార‌ని వేణు స్వామి చెప్ప‌డం దుమారం రేపింది.

ఈ క్ర‌మంలోనే టీవీ5లో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఒక చ‌ర్చా కార్య‌క్ర‌మం పెట్టి వేణు స్వామిని క‌డిగి పారేశారు. ఆయ‌న డ‌బ్బులు తీసుకుని రాజ‌కీయ జోస్యాలు చెప్పిన తీరు గురించి కొన్ని ఆధారాలు కూడా బ‌య‌ట‌పెట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి మంచి స్పంద‌నే వ‌చ్చింది.

కాగా ఇప్పుడు వేణు స్వామి త‌న భార్య‌తో క‌లిసి లైన్లోకి వ‌చ్చారు. మూర్తి మీద తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తూ త‌మ‌కు ఆత్మ‌హ‌త్యే శ‌ర‌ణ్యం అంటూ వీళ్లిద్ద‌రూ ఒక వీడియో రిలీజ్ చేశారు. 2017లో మ‌హా టీవీలో ఉన్న‌ప్ప‌టి నుంచి మూర్తి త‌న‌ను వేధిస్తున్నాడ‌ని.. అప్ప‌ట్లో డ‌బ్బులు డిమాండ్ చేస్తే ఇవ్వ‌లేద‌ని క‌క్ష పెంచుకున్నాడ‌ని వేణు స్వామి ఆరోపించారు.

తాను త‌న జోస్యం ద్వారా ఎంద‌రో జీవితాల‌ను బాగు చేశాన‌ని.. కానీ ఇప్పుడు త‌న‌కే ఆత్మ‌హ‌త్య చేసుకునే ప‌రిస్థితి క‌ల్పించార‌ని వేణు స్వామి అన్నారు. వేణు స్వామి భార్య మాట్లాడుతూ.. త‌మ‌ను ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నార‌ని.. ఆ డ‌బ్బులు ఇచ్చే వ‌ర‌కు వ‌దిలిపెట్టం అని బెదిరిస్తున్నార‌ని ఆరోపించింది.

త‌న‌వి, త‌న కూతురివి క‌లిపి న‌గ‌లు అమ్మినా వాళ్లు డిమాండ్ చేసిన దాంట్లో ఐదు ప‌ర్సంట్ కూడా రాద‌ని.. తాము అంత డ‌బ్బు ఎలా క‌ట్టాల‌ని ఆమె ప్ర‌శ్నించింది. తాము ఎలాగూ చ‌చ్చిపోతామ‌ని.. ఈలోపు వీళ్ల త‌ప్పులు బ‌య‌ట‌పెట్టాల‌నే ఈ వీడియో చేస్తున్నామ‌ని వేణు స్వామి భార్య పేర్కొంది.

This post was last modified on August 20, 2024 10:17 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాద్ గారు కాస్త ఊపిరినిచ్చారు

సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బస్టర్ రన్ తో రికార్డులు సృష్టించిన మన శంకరవరప్రసాద్ గారు తర్వాత బాగా స్లో అయిపోయింది.…

6 minutes ago

మూడోసారి దొరికిపోయిన మర్దాని

ఏదైనా సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. దాని మీద అంచనాలు అందుకునేలా దర్శక…

35 minutes ago

శాంతి కోసం చాలా కష్టపడ్డారు కానీ

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…

2 hours ago

పాక్ నక్క బుద్ధి… నష్టం తట్టుకోలేరు

టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…

3 hours ago

అసలు చంద్రబాబు ప్రమేయమే లేదు

2023లో స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న…

3 hours ago

ఏబీఎన్ రిపోర్టర్ పై బీఆర్ఎస్ దాడి.. ఎవరికి నష్టం?

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ…

5 hours ago