వేణు స్వామి.. ఈ జ్యోతిష్యుడి గురించి పరిచయం అవసరం లేదు. సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల భవితవ్యం గురించి జోస్యం చెబుతూ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారీయన. కొన్ని సందర్భాల్లో ఆయన జోస్యాలు ఫలించాయి. చాలానే తేడా కొట్టాయి.
ఐతే సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి కూడా వెళ్లిపోయి అవసరం లేని సందర్భాల్లోనూ జోస్యాలు చెప్పడంతో వేణు స్వామి మీద తీవ్ర విమర్శలు తప్పలేదు. ఇటీవలే నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం చేసుకుంటే.. వాళ్లిద్దరూ మూడేళ్లలో విడిపోతారని వేణు స్వామి చెప్పడం దుమారం రేపింది.
ఈ క్రమంలోనే టీవీ5లో సీనియర్ జర్నలిస్ట్ మూర్తి ఒక చర్చా కార్యక్రమం పెట్టి వేణు స్వామిని కడిగి పారేశారు. ఆయన డబ్బులు తీసుకుని రాజకీయ జోస్యాలు చెప్పిన తీరు గురించి కొన్ని ఆధారాలు కూడా బయటపెట్టారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందనే వచ్చింది.
కాగా ఇప్పుడు వేణు స్వామి తన భార్యతో కలిసి లైన్లోకి వచ్చారు. మూర్తి మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ తమకు ఆత్మహత్యే శరణ్యం అంటూ వీళ్లిద్దరూ ఒక వీడియో రిలీజ్ చేశారు. 2017లో మహా టీవీలో ఉన్నప్పటి నుంచి మూర్తి తనను వేధిస్తున్నాడని.. అప్పట్లో డబ్బులు డిమాండ్ చేస్తే ఇవ్వలేదని కక్ష పెంచుకున్నాడని వేణు స్వామి ఆరోపించారు.
తాను తన జోస్యం ద్వారా ఎందరో జీవితాలను బాగు చేశానని.. కానీ ఇప్పుడు తనకే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించారని వేణు స్వామి అన్నారు. వేణు స్వామి భార్య మాట్లాడుతూ.. తమను ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నారని.. ఆ డబ్బులు ఇచ్చే వరకు వదిలిపెట్టం అని బెదిరిస్తున్నారని ఆరోపించింది.
తనవి, తన కూతురివి కలిపి నగలు అమ్మినా వాళ్లు డిమాండ్ చేసిన దాంట్లో ఐదు పర్సంట్ కూడా రాదని.. తాము అంత డబ్బు ఎలా కట్టాలని ఆమె ప్రశ్నించింది. తాము ఎలాగూ చచ్చిపోతామని.. ఈలోపు వీళ్ల తప్పులు బయటపెట్టాలనే ఈ వీడియో చేస్తున్నామని వేణు స్వామి భార్య పేర్కొంది.
This post was last modified on August 20, 2024 10:17 am
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…