వేణు స్వామి.. ఈ జ్యోతిష్యుడి గురించి పరిచయం అవసరం లేదు. సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల భవితవ్యం గురించి జోస్యం చెబుతూ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారీయన. కొన్ని సందర్భాల్లో ఆయన జోస్యాలు ఫలించాయి. చాలానే తేడా కొట్టాయి.
ఐతే సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి కూడా వెళ్లిపోయి అవసరం లేని సందర్భాల్లోనూ జోస్యాలు చెప్పడంతో వేణు స్వామి మీద తీవ్ర విమర్శలు తప్పలేదు. ఇటీవలే నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం చేసుకుంటే.. వాళ్లిద్దరూ మూడేళ్లలో విడిపోతారని వేణు స్వామి చెప్పడం దుమారం రేపింది.
ఈ క్రమంలోనే టీవీ5లో సీనియర్ జర్నలిస్ట్ మూర్తి ఒక చర్చా కార్యక్రమం పెట్టి వేణు స్వామిని కడిగి పారేశారు. ఆయన డబ్బులు తీసుకుని రాజకీయ జోస్యాలు చెప్పిన తీరు గురించి కొన్ని ఆధారాలు కూడా బయటపెట్టారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందనే వచ్చింది.
కాగా ఇప్పుడు వేణు స్వామి తన భార్యతో కలిసి లైన్లోకి వచ్చారు. మూర్తి మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ తమకు ఆత్మహత్యే శరణ్యం అంటూ వీళ్లిద్దరూ ఒక వీడియో రిలీజ్ చేశారు. 2017లో మహా టీవీలో ఉన్నప్పటి నుంచి మూర్తి తనను వేధిస్తున్నాడని.. అప్పట్లో డబ్బులు డిమాండ్ చేస్తే ఇవ్వలేదని కక్ష పెంచుకున్నాడని వేణు స్వామి ఆరోపించారు.
తాను తన జోస్యం ద్వారా ఎందరో జీవితాలను బాగు చేశానని.. కానీ ఇప్పుడు తనకే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించారని వేణు స్వామి అన్నారు. వేణు స్వామి భార్య మాట్లాడుతూ.. తమను ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నారని.. ఆ డబ్బులు ఇచ్చే వరకు వదిలిపెట్టం అని బెదిరిస్తున్నారని ఆరోపించింది.
తనవి, తన కూతురివి కలిపి నగలు అమ్మినా వాళ్లు డిమాండ్ చేసిన దాంట్లో ఐదు పర్సంట్ కూడా రాదని.. తాము అంత డబ్బు ఎలా కట్టాలని ఆమె ప్రశ్నించింది. తాము ఎలాగూ చచ్చిపోతామని.. ఈలోపు వీళ్ల తప్పులు బయటపెట్టాలనే ఈ వీడియో చేస్తున్నామని వేణు స్వామి భార్య పేర్కొంది.
This post was last modified on August 20, 2024 10:17 am
80, 90 దశకాల్లో వైభవం చూసిన కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. స్వతహాగా తమిళుడైనప్పటికీ.. తెలుగులోనే ఆయన పెద్ద హీరోగాఎదిగారు. అంకుశం,…
గ్లోబల్ పాప్ సెన్సేషన్ రిహానా పేరు వింటేనే ఒక రేంజ్ వైబ్ గుర్తొస్తుంది. అలాంటిది ఈ ఇంటర్నేషనల్ స్టార్ సడన్గా…
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. తద్వారా ఉద్యోగాలకు పొంచి…
తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…
తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…
సంచలనంగా మారిన అనంతపురం హనీట్రాప్ గుట్టు రట్టైంది. ప్లాన్ చేసి.. టార్గెట్ చేసి ముగ్గులోకి దించటం.. లక్షలాది రూపాయిలు కొల్లగొట్టే…