ఆళ్ల నాని. ఏలూరు జిల్లాకు చెందిన కీలక నాయకుడు, వైసీపీ హయాంలో కాపుల కోటాలో ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే.. కొన్ని రోజుల కిందట ఆయన.. ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం.. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఇప్పుడు ఏకంగా ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా సమర్పించినట్టు చెప్పారు. తాజాగా ఏలూరులో మీడియాతో మాట్లాడిన నాని.. ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.
ఇకపై వ్యక్తిగా అందరికీ అందుబాటులో ఉంటానని నాని చెప్పారు. కొన్నాళ్ల కిందట కేవలం తాను ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి మాత్రమే రాజీనామా చేశానని చెప్పారు. కానీ, ఇప్పుడు వైసీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. దీంతో పార్టీకి ఆయనకు సంబంధం లేకుండా పోయింది. అయితే.. ఏలూరు జిల్లా ప్రజలకు మాత్రం తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తానని కూడా అన్నారు.
ఇక, ఏలూరులో పార్టీ ఆఫీస్ కూల్చివేతపై స్పందిస్తూ.. గత ఏడాదిగా పార్టీ కార్యాలయం ఉన్న స్థలాన్ని యజమానికి తిరిగి ఇవ్వాలని కోరారని, ఈ విషయం పార్టీ రీజినల్ కో – ఆర్డినేటర్, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి కూడా తెలుసని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 1న పార్టీ కార్యాలయ స్థలాన్ని యజమానికి హ్యాండోవర్ చేసినట్టు చెప్పారు. దీంతో అమెరికాలో ఉన్న యజమాని, తనకు స్నేహితుడు.. ఈ స్థలాన్ని పూర్తి స్థాయిలో హ్యాండోవర్ చేసుకున్నారని చెప్పారు. దీనిలో ఎలాంటిరాజకీయాలు లేవన్నారు.
ఎందుకీ నిర్ణయం?
వాస్తవానికి ఆళ్ల నాని(కాళీకృష్ణ శ్రీనివాస్) కొన్నాళ్ల కిందట జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పు డు.. ఆయన పార్టీ నుంచి ఓదార్పును కోరుకున్నారు. కానీ, పార్టీ అధినేత మౌనంగా ఉండిపోయారు. ఒకరిద్దరు నాయకులు మాట్లాడినా.. జగన్ స్పందించలేదు. దీంతో ఆళ్ల నాని మరింత హర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీని పూర్తిగా వదిలేశారని అనుచరులు చెబుతున్నారు. ఏదేమైనా వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్న ఆళ్ల నాని నిష్క్రమణ పార్టీకి ఇబ్బందేనని అంటున్నారు.
This post was last modified on August 17, 2024 3:58 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…