ఆళ్ల నాని. ఏలూరు జిల్లాకు చెందిన కీలక నాయకుడు, వైసీపీ హయాంలో కాపుల కోటాలో ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే.. కొన్ని రోజుల కిందట ఆయన.. ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం.. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఇప్పుడు ఏకంగా ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా సమర్పించినట్టు చెప్పారు. తాజాగా ఏలూరులో మీడియాతో మాట్లాడిన నాని.. ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.
ఇకపై వ్యక్తిగా అందరికీ అందుబాటులో ఉంటానని నాని చెప్పారు. కొన్నాళ్ల కిందట కేవలం తాను ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి మాత్రమే రాజీనామా చేశానని చెప్పారు. కానీ, ఇప్పుడు వైసీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. దీంతో పార్టీకి ఆయనకు సంబంధం లేకుండా పోయింది. అయితే.. ఏలూరు జిల్లా ప్రజలకు మాత్రం తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తానని కూడా అన్నారు.
ఇక, ఏలూరులో పార్టీ ఆఫీస్ కూల్చివేతపై స్పందిస్తూ.. గత ఏడాదిగా పార్టీ కార్యాలయం ఉన్న స్థలాన్ని యజమానికి తిరిగి ఇవ్వాలని కోరారని, ఈ విషయం పార్టీ రీజినల్ కో – ఆర్డినేటర్, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి కూడా తెలుసని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 1న పార్టీ కార్యాలయ స్థలాన్ని యజమానికి హ్యాండోవర్ చేసినట్టు చెప్పారు. దీంతో అమెరికాలో ఉన్న యజమాని, తనకు స్నేహితుడు.. ఈ స్థలాన్ని పూర్తి స్థాయిలో హ్యాండోవర్ చేసుకున్నారని చెప్పారు. దీనిలో ఎలాంటిరాజకీయాలు లేవన్నారు.
ఎందుకీ నిర్ణయం?
వాస్తవానికి ఆళ్ల నాని(కాళీకృష్ణ శ్రీనివాస్) కొన్నాళ్ల కిందట జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పు డు.. ఆయన పార్టీ నుంచి ఓదార్పును కోరుకున్నారు. కానీ, పార్టీ అధినేత మౌనంగా ఉండిపోయారు. ఒకరిద్దరు నాయకులు మాట్లాడినా.. జగన్ స్పందించలేదు. దీంతో ఆళ్ల నాని మరింత హర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీని పూర్తిగా వదిలేశారని అనుచరులు చెబుతున్నారు. ఏదేమైనా వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్న ఆళ్ల నాని నిష్క్రమణ పార్టీకి ఇబ్బందేనని అంటున్నారు.
This post was last modified on August 17, 2024 3:58 pm
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…