ఆళ్ల నాని. ఏలూరు జిల్లాకు చెందిన కీలక నాయకుడు, వైసీపీ హయాంలో కాపుల కోటాలో ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే.. కొన్ని రోజుల కిందట ఆయన.. ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం.. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఇప్పుడు ఏకంగా ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా సమర్పించినట్టు చెప్పారు. తాజాగా ఏలూరులో మీడియాతో మాట్లాడిన నాని.. ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.
ఇకపై వ్యక్తిగా అందరికీ అందుబాటులో ఉంటానని నాని చెప్పారు. కొన్నాళ్ల కిందట కేవలం తాను ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి మాత్రమే రాజీనామా చేశానని చెప్పారు. కానీ, ఇప్పుడు వైసీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. దీంతో పార్టీకి ఆయనకు సంబంధం లేకుండా పోయింది. అయితే.. ఏలూరు జిల్లా ప్రజలకు మాత్రం తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తానని కూడా అన్నారు.
ఇక, ఏలూరులో పార్టీ ఆఫీస్ కూల్చివేతపై స్పందిస్తూ.. గత ఏడాదిగా పార్టీ కార్యాలయం ఉన్న స్థలాన్ని యజమానికి తిరిగి ఇవ్వాలని కోరారని, ఈ విషయం పార్టీ రీజినల్ కో – ఆర్డినేటర్, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి కూడా తెలుసని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 1న పార్టీ కార్యాలయ స్థలాన్ని యజమానికి హ్యాండోవర్ చేసినట్టు చెప్పారు. దీంతో అమెరికాలో ఉన్న యజమాని, తనకు స్నేహితుడు.. ఈ స్థలాన్ని పూర్తి స్థాయిలో హ్యాండోవర్ చేసుకున్నారని చెప్పారు. దీనిలో ఎలాంటిరాజకీయాలు లేవన్నారు.
ఎందుకీ నిర్ణయం?
వాస్తవానికి ఆళ్ల నాని(కాళీకృష్ణ శ్రీనివాస్) కొన్నాళ్ల కిందట జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పు డు.. ఆయన పార్టీ నుంచి ఓదార్పును కోరుకున్నారు. కానీ, పార్టీ అధినేత మౌనంగా ఉండిపోయారు. ఒకరిద్దరు నాయకులు మాట్లాడినా.. జగన్ స్పందించలేదు. దీంతో ఆళ్ల నాని మరింత హర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీని పూర్తిగా వదిలేశారని అనుచరులు చెబుతున్నారు. ఏదేమైనా వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్న ఆళ్ల నాని నిష్క్రమణ పార్టీకి ఇబ్బందేనని అంటున్నారు.
This post was last modified on August 17, 2024 3:58 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…