సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్ స్లిప్ అయినా చాలు ఆ వీడియోని పట్టుకుని వైరల్ చేయడానికి కొన్ని వందల హ్యాండిల్స్ కాచుకుని ఉంటాయి.
లిటిల్ హార్ట్స్, హే బలవంత్ హీరోయిన్ శివాని నగారంకు ఇది అనుభవమయ్యింది. ఇటీవలే ఒక పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు 15 నిముషాలు తనను ఎవరూ టచ్ చేయలేదని, ఒకపక్క గోవిందా నామాలు, ఇంకోపక్క కాత్యాయని భోంచేశావా అంటూ స్లోగన్స్ వినిపించాయని ఎగ్జైట్ మెంట్ తో చెప్పింది.
నిజానికి బ్రేక్ దర్శనానికి వెళ్ళినప్పుడు గోవిందా నామాలు తప్ప ఇంకేం వినిపించవు. ఒకవేళ ఏపీ ముఖ్యమంత్రి వెళ్లినా జై టిడిపి అని ఎవరూ అరవరు. అలాంటిది శివాని కోసం నాన్ స్టాప్ గా నినాదాలు చేశారనేది నమ్మశక్యంగా లేదు.
ఇది పక్కనపెడితే తాను హీరోయిన్ కాబట్టే పదిహేను నిముషాలు నిలబెట్టి దర్శనం చేయించారనే రీతిలో శివాని చెప్పడం వేరే అర్థం తెచ్చింది. టిటిడి అధికారులు చిన్న ప్రముఖులకు సైతం ఇంతేసి సమయం దర్శనం కేటాయించి సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని ట్వీట్లు పెట్టడం మొదలుపెట్టారు. దీంతో శివాని కొంత ఆలస్యంగా అయినా వివరణ ఇచ్చింది.
ఎయిర్ పోర్ట్ లో శ్రీవాణి దర్శనం టికెట్లు పది వేల రూపాయలు ఇచ్చి కొన్నామని, దాంట్లో భాగంగానే వాకిలి నుంచి లోపలికి వెళ్లి బయటికి వచ్చే దాకా స్వామిని చూసే భాగ్యం పదిహేను నిముషాలు దొరికిందని క్లారిటీ ఇచ్చింది. ఇదేదో ఆ ఇంటర్వ్యూలోనే ముందే చెప్పి ఉంటే ఈ గొడవ ఉండేది కాదు.
శ్రీవాణి టికెట్ల విషయం దాచి పావు గంట కదలకుండా ఉన్నామని చెప్పడం ఒకరకంగా తప్పే అవుతుంది. ఉద్దేశం మంచిదే అయినా చెప్పే విధానం తేడాగా ఉంటే ఇలాంటి కామెంట్లు చవి చూడాల్సి వస్తుంది. మొత్తానికి శివాని మరో వీడియోతో దీనికి చెక్ పెట్టేసింది కాబట్టి మళ్ళీ ఎవరూ ఆ టాపిక్ ని టచ్ చేయకుండా ఉంటే ఇంకే డిస్కషన్లు రావు.
This post was last modified on February 25, 2026 7:01 pm
తమ్ముడు తమ్ముడే.. రాజకీయం రాజకీయమే.. బీజేపీ విషయంలో ఇది అక్షరాలా నిజం. తనకు అవకాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మించే సినిమా దర్శకుడి ఎంపిక విషయంలో ఎంత తలనొప్పి ఎదురైందో…
టాలీవుడ్లో ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర కథానాయకులతో పాటు నాని, విజయ్…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2024…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసులో రోజుకో కొత్త…
ఏపీ సీఎం చంద్రబాబు గత 2024లో కూటమి కట్టి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత..…