సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్ స్లిప్ అయినా చాలు ఆ వీడియోని పట్టుకుని వైరల్ చేయడానికి కొన్ని వందల హ్యాండిల్స్ కాచుకుని ఉంటాయి.
లిటిల్ హార్ట్స్, హే బలవంత్ హీరోయిన్ శివాని నగారంకు ఇది అనుభవమయ్యింది. ఇటీవలే ఒక పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు 15 నిముషాలు తనను ఎవరూ టచ్ చేయలేదని, ఒకపక్క గోవిందా నామాలు, ఇంకోపక్క కాత్యాయని భోంచేశావా అంటూ స్లోగన్స్ వినిపించాయని ఎగ్జైట్ మెంట్ తో చెప్పింది.
నిజానికి బ్రేక్ దర్శనానికి వెళ్ళినప్పుడు గోవిందా నామాలు తప్ప ఇంకేం వినిపించవు. ఒకవేళ ఏపీ ముఖ్యమంత్రి వెళ్లినా జై టిడిపి అని ఎవరూ అరవరు. అలాంటిది శివాని కోసం నాన్ స్టాప్ గా నినాదాలు చేశారనేది నమ్మశక్యంగా లేదు.
ఇది పక్కనపెడితే తాను హీరోయిన్ కాబట్టే పదిహేను నిముషాలు నిలబెట్టి దర్శనం చేయించారనే రీతిలో శివాని చెప్పడం వేరే అర్థం తెచ్చింది. టిటిడి అధికారులు చిన్న ప్రముఖులకు సైతం ఇంతేసి సమయం దర్శనం కేటాయించి సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని ట్వీట్లు పెట్టడం మొదలుపెట్టారు. దీంతో శివాని కొంత ఆలస్యంగా అయినా వివరణ ఇచ్చింది.
ఎయిర్ పోర్ట్ లో శ్రీవాణి దర్శనం టికెట్లు పది వేల రూపాయలు ఇచ్చి కొన్నామని, దాంట్లో భాగంగానే వాకిలి నుంచి లోపలికి వెళ్లి బయటికి వచ్చే దాకా స్వామిని చూసే భాగ్యం పదిహేను నిముషాలు దొరికిందని క్లారిటీ ఇచ్చింది. ఇదేదో ఆ ఇంటర్వ్యూలోనే ముందే చెప్పి ఉంటే ఈ గొడవ ఉండేది కాదు.
శ్రీవాణి టికెట్ల విషయం దాచి పావు గంట కదలకుండా ఉన్నామని చెప్పడం ఒకరకంగా తప్పే అవుతుంది. ఉద్దేశం మంచిదే అయినా చెప్పే విధానం తేడాగా ఉంటే ఇలాంటి కామెంట్లు చవి చూడాల్సి వస్తుంది. మొత్తానికి శివాని మరో వీడియోతో దీనికి చెక్ పెట్టేసింది కాబట్టి మళ్ళీ ఎవరూ ఆ టాపిక్ ని టచ్ చేయకుండా ఉంటే ఇంకే డిస్కషన్లు రావు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…