హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని సమాచారం. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 352, 79, 299తో పాటు ఐటీ చట్టం సెక్షన్ 67 కింద కేసులు నమోదు చేశారు. ఇటీవల అన్వేష్ ప్రధాన ఇన్స్టాగ్రామ్ ఖాతాను మెటా సంస్థ బ్లాక్ చేసింది. దాదాపు 13 లక్షల ఫాలోవర్లు ఉన్న ఆ ఖాతాలో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్న కంటెంట్పై ఫిర్యాదులు రావడంతో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం.
అకౌంట్ తొలగింపుకు ప్రతిస్పందనగా అన్వేష్ అసభ్య పదజాలంతో వీడియో విడుదల చేయడం వివాదానికి దారితీసింది. పోలీసులను, వ్యవస్థలను కించపరిచేలా మాట్లాడినట్లు ఆరోపణలు వచ్చాయి.
అన్వేష్కు మరిన్ని ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయని ఆయన స్వయంగా ప్రకటించడంతో, వాటి వివరాలు సేకరించేందుకు పోలీసులు మెటా, యూట్యూబ్ సంస్థలకు అధికారిక లేఖలు రాయాలని నిర్ణయించారు.
లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడం వల్ల అన్వేష్ విదేశాల నుంచి భారత్కు చేరుకున్న వెంటనే విమానాశ్రయ అధికారులకు సమాచారం అందుతుంది. తద్వారా ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది.
విచారణకు సహకరించడం లేదనే అభిప్రాయంతోనే పోలీసులు ఈ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. పోలీసులు తదుపరి చర్యలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
This post was last modified on February 25, 2026 3:58 pm
దళపతి విజయ్ ఇప్పుడు అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నాడు. ఒకవైపు 30 ఏళ్ల సినీ కెరీర్ను వదిలేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి…
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సినిమా సినిమాకు తన మార్కెట్ రేంజ్ ను మరో లెవెల్ కు తీసుకు వెళుతున్నాడు.…
బాలయ్య అభిమానులు ఎదురుచూసే కొద్దీ దూరం వెళ్తున్నాడు మోక్షజ్ఞ. ఎప్పుడెప్పుడాని వెయిట్ చేస్తుంటే ఇప్పుడప్పుడే కాదనే తరహాలో ఇస్తున్న సంకేతాలు…
సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు టాలీవుడ్లోనే కాదు, ఇండియన్ సినిమాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. ‘యానిమల్’తో బాక్సాఫీస్ను షేక్ చేసిన…
ఘట్టమనేని మూడో తరం నుంచి వస్తున్న మొదటి వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం టీజర్ ఇటీవలే విడుదలయ్యింది.…
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి కల్ట్ మూవీస్ తో ఒక ప్రత్యేక ముద్ర వేసిన దర్శకుడు తరుణ్…