Political News

చంద్ర‌బాబుకు బాల‌య్య విన్న‌పం.. !

ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు, టీడీపీ నేత‌, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌లు బావ‌, బావ‌మ‌ర‌దులు అన్న విష‌యం తెలిసిందే. అంతేకాదు.. వీరు స్వ‌యానా వియ్యంకులు కూడా. తాజాగా.. బావ చంద్ర‌బాబును బాల‌య్య‌.. ఓ కోరిక కోరారు. నిజానికి ఎప్పుడూ.. ఆయ‌న చంద్ర‌బాబును ఏమీ కోరినట్టు వార్త‌లు కానీ.. వ్యాఖ్య‌లు కానీ వినిపించ‌లేదు. గ‌తంలో ప‌దేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా.. ఇది చేయండి.. అది చేయండి.. అని ఎప్పుడూ చంద్ర‌బాబును కోరిన దాఖ‌లా లేదు.

2014-19 మ‌ధ్య చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనూ బాల‌య్య ఎలాంటి కోరిక కూడా కోరలేదు. అయితే.. తాజాగా కూట‌మి స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. తాజాగా ఒక పెద్ద కోరిక‌నే ఆయ‌న బావగారి ముందు పెట్టారు బాల‌య్య‌. 2019-22 మ‌ధ్య వైసీపీ ప్ర‌భుత్వం రాష్ట్రంలోని 13 జిల్లాల‌ను విభ‌జించి 26 జిల్లాలుగా మార్చిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాను విభ‌జించి.. శ్రీస‌త్య సాయి జిల్లాగా ఏర్పాటు చేసింది. అయితే.. దీనికి జిల్లా కేంద్రంగా పుట్ట‌ప‌ర్తిని ప్ర‌క‌టించింది.

అప్ప‌ట్లోనే దీనిని వ్య‌తిరేకిస్తూ.. స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేశారు. కానీ, వైసీపీ స‌ర్కారు మాత్రం వీరి విన్న‌పాల‌ను ప‌ట్టించుకోలేదు. ఇక‌, అదేస‌మ‌యంలో ఎమ్మెల్యేగా ఉన్న బాల‌య్య కూడా ఆందోళ‌న కారుల‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. అయిన‌ప్ప‌టికీ.. వైసీపీ స‌ర్కారు ప‌ట్టించుకోలేదు. ఈ నేప‌థ్యంలోతాజాగా అన్న క్యాంటీన్‌ను ప్రారంభించేందుకు హిందూపురం వ‌చ్చిన బాల‌య్య‌కు ఇక్క‌డి వారు ‘హిందూపురాన్ని’ జిల్లా కేంద్రంగా చేయాల‌ని విన్న‌వించారు.

దీంతో ఇదే విష‌యంపై బాల‌య్య‌..చంద్ర‌బాబును అభ్య‌ర్థించారు. శ్రీస‌త్యసాయి జిల్లా కేంద్రంగా ప్ర‌స్తుతం ఉన్న పుట్ట‌ప‌ర్తిని ర‌ద్దు చేసి.. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాల‌ని ఆయ‌న మీడియా ముఖంగా విన్న‌వించారు. అనంత‌రం రెండు అన్నా క్యాంటీన్ల‌ను బాల‌య్య ప్రారంభించారు. సంక్షేమానికి, పేద‌ల అభ్యున్న‌తికి టీడీపీ పుట్టినిల్ల‌ని త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించారు. పేద‌ల కోసం.. ఆనాడు అన్న‌గారు ఎన్టీఆర్ రూ.2 కే బియ్యం ఇస్తే.. ఇప్పుడు చంద్ర‌బాబు రూ.5కే వారికి భోజ‌నం అందిస్తున్నారని కొనియాడారు.

This post was last modified on August 16, 2024 4:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

6 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

7 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

7 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

7 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

8 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

9 hours ago