Political News

విదేశాల‌కు పారిపోతున్న అవినాష్‌.. ప‌ట్టుకున్న పోలీసులు

మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యం విధ్వంసంలో పాత్ర ఉంద‌ని పోలీసులు కేసు న‌మోదు చేసిన వైసీపీ నాయ‌కులు త‌లో దారి ప‌డుతున్నారు. వీరిలో విజ‌య‌వాడ‌కు చెందిన దేవినేని అవినాష్ తాజాగా దుబాయ్ పారిపోయేందుకు ప్ర‌య‌త్నించ‌గా పోలీసులు ఆయ‌న‌ను ప‌ట్టుకున్నారు. గురువారం అర్థరాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ పారిపోయేందుకు దేవినేని అవినాష్ ప్ర‌య‌త్నించిన‌ట్టు అధికారులు తెలిపారు. వాస్త‌వానికి వీరిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది.

దీంతో శంషాబాద్ పోలీసులు విమానాశ్ర‌యంలో అవినాష్‌ను అడ్డుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పొంతన‌లేని స‌మాధానం ఇవ్వ‌డంతో వారు మంగళగిరి పోలీసుల కు సమాచారమిచ్చిన‌ట్టు తెలిసింది. దీంతో అవినాష్ పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి నిరాకరించాలని మంగళగిరి పోలీసులు వారికి తేల్చి చెప్పారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయం నుంచి దేవినేని అవినాష్ వెనక్కి వెళ్లిపోయారు.

మంగ‌ళ‌గిరి కార్యాల‌యంపై జ‌రిగిన‌ దాడిలో పాల్గొన్న వారిపై పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా లుకౌట్ నోటీసులు జారీ చేసిన విష‌యం తెలిసిందే.

ఇక‌, ఈ కేసు ప్ర‌స్తుతం హైకోర్టు ప‌రిధిలో ఉంది. ఈ నెల 20వ తేదీ వ‌ర‌కు వారిపై ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోరాదంటూ.. కోర్టు ఆదేశించింది. ఎమ్మెల్సీలు.. లేళ్ల అప్పిరెడ్డి, త‌ల‌శిల ర‌ఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్ స‌హా ప‌లువురిపై కేసులు న‌మోద‌య్యాయి. దీంతో వీరంతా ముంద‌స్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్ర‌యించారు. దీనిని విచారించిన కోర్టు.. ఈ నెల 20వ తేదీ వ‌ర‌కు వారిపై చ‌ర్య‌లు నిలిపివేసింది. ఇంత‌లోనే అవినాష్ త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

This post was last modified on August 16, 2024 4:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

4 minutes ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

6 minutes ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

35 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago