మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం విధ్వంసంలో పాత్ర ఉందని పోలీసులు కేసు నమోదు చేసిన వైసీపీ నాయకులు తలో దారి పడుతున్నారు. వీరిలో విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ తాజాగా దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆయనను పట్టుకున్నారు. గురువారం అర్థరాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ పారిపోయేందుకు దేవినేని అవినాష్ ప్రయత్నించినట్టు అధికారులు తెలిపారు. వాస్తవానికి వీరిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది.
దీంతో శంషాబాద్ పోలీసులు విమానాశ్రయంలో అవినాష్ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పొంతనలేని సమాధానం ఇవ్వడంతో వారు మంగళగిరి పోలీసుల కు సమాచారమిచ్చినట్టు తెలిసింది. దీంతో అవినాష్ పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి నిరాకరించాలని మంగళగిరి పోలీసులు వారికి తేల్చి చెప్పారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయం నుంచి దేవినేని అవినాష్ వెనక్కి వెళ్లిపోయారు.
మంగళగిరి కార్యాలయంపై జరిగిన దాడిలో పాల్గొన్న వారిపై పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా లుకౌట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇక, ఈ కేసు ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉంది. ఈ నెల 20వ తేదీ వరకు వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోరాదంటూ.. కోర్టు ఆదేశించింది. ఎమ్మెల్సీలు.. లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్ సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. దీంతో వీరంతా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన కోర్టు.. ఈ నెల 20వ తేదీ వరకు వారిపై చర్యలు నిలిపివేసింది. ఇంతలోనే అవినాష్ తప్పించుకునే ప్రయత్నం చేయడం సంచలనంగా మారింది.
This post was last modified on August 16, 2024 4:08 pm
కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…