మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం విధ్వంసంలో పాత్ర ఉందని పోలీసులు కేసు నమోదు చేసిన వైసీపీ నాయకులు తలో దారి పడుతున్నారు. వీరిలో విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ తాజాగా దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆయనను పట్టుకున్నారు. గురువారం అర్థరాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ పారిపోయేందుకు దేవినేని అవినాష్ ప్రయత్నించినట్టు అధికారులు తెలిపారు. వాస్తవానికి వీరిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది.
దీంతో శంషాబాద్ పోలీసులు విమానాశ్రయంలో అవినాష్ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పొంతనలేని సమాధానం ఇవ్వడంతో వారు మంగళగిరి పోలీసుల కు సమాచారమిచ్చినట్టు తెలిసింది. దీంతో అవినాష్ పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి నిరాకరించాలని మంగళగిరి పోలీసులు వారికి తేల్చి చెప్పారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయం నుంచి దేవినేని అవినాష్ వెనక్కి వెళ్లిపోయారు.
మంగళగిరి కార్యాలయంపై జరిగిన దాడిలో పాల్గొన్న వారిపై పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా లుకౌట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇక, ఈ కేసు ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉంది. ఈ నెల 20వ తేదీ వరకు వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోరాదంటూ.. కోర్టు ఆదేశించింది. ఎమ్మెల్సీలు.. లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్ సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. దీంతో వీరంతా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన కోర్టు.. ఈ నెల 20వ తేదీ వరకు వారిపై చర్యలు నిలిపివేసింది. ఇంతలోనే అవినాష్ తప్పించుకునే ప్రయత్నం చేయడం సంచలనంగా మారింది.
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…