మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం విధ్వంసంలో పాత్ర ఉందని పోలీసులు కేసు నమోదు చేసిన వైసీపీ నాయకులు తలో దారి పడుతున్నారు. వీరిలో విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ తాజాగా దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆయనను పట్టుకున్నారు. గురువారం అర్థరాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ పారిపోయేందుకు దేవినేని అవినాష్ ప్రయత్నించినట్టు అధికారులు తెలిపారు. వాస్తవానికి వీరిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది.
దీంతో శంషాబాద్ పోలీసులు విమానాశ్రయంలో అవినాష్ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పొంతనలేని సమాధానం ఇవ్వడంతో వారు మంగళగిరి పోలీసుల కు సమాచారమిచ్చినట్టు తెలిసింది. దీంతో అవినాష్ పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి నిరాకరించాలని మంగళగిరి పోలీసులు వారికి తేల్చి చెప్పారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయం నుంచి దేవినేని అవినాష్ వెనక్కి వెళ్లిపోయారు.
మంగళగిరి కార్యాలయంపై జరిగిన దాడిలో పాల్గొన్న వారిపై పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా లుకౌట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇక, ఈ కేసు ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉంది. ఈ నెల 20వ తేదీ వరకు వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోరాదంటూ.. కోర్టు ఆదేశించింది. ఎమ్మెల్సీలు.. లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్ సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. దీంతో వీరంతా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన కోర్టు.. ఈ నెల 20వ తేదీ వరకు వారిపై చర్యలు నిలిపివేసింది. ఇంతలోనే అవినాష్ తప్పించుకునే ప్రయత్నం చేయడం సంచలనంగా మారింది.
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…
ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…
దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…