Political News

టీడీపీకి ట‌చ్‌లో 8 మంది ఎమ్మెల్యేలు.. నిజ‌మేనా?

టీడీపీకి వైసీపీ ఎమ్మెల్యేలు ట‌చ్‌లోకి వ‌చ్చారంటూ.. సీనియ‌ర్ నాయ‌కుడు, మంత్రి కొల్లు ర‌వీంద్ర చేసిన వ్యాఖ్యాలు సంచ‌ల‌నం రేపుతున్నాయి. జోగి ర‌మేష్ కుమారుడు రాజీవ్ అరెస్టు త‌ర్వాత‌.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీశాయి. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే ద‌క్కారు. వీరిలో జ‌గ‌న్‌, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్రెడ్డి వంటి కీల‌క‌మైన ముగ్గురు, న‌లుగురు ఎమ్మెల్యేలు మాత్ర‌మే వైసీపీకి వీర విధేయులు.

మిగిలిన వారి విష‌యంలో ఇంత వీర విధేయ‌త ఉంటుంద‌ని భావించ‌లేం. ఉన్నా కూడా.. ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మారే ల‌క్ష‌ణం ఉన్న నాయ‌కులు కావ‌డంతో వీరిపైనే అనుమానాలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మంత్రి కొల్లు మాట్లాడుతూ.. త‌మ పార్టీలోకి చేరేందుకు 5 నుంచి 8 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నార‌ని, చంద్ర‌బాబు గేట్లు తీస్తే.. ఇక వారంతా పార్టీ మారిపోవ‌డం ఖాయ‌మ‌ని వ్యాఖ్యానించారు. కానీ, ఇటు వైపు చూస్తే.. అలాంటి ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

వైసీపీ నుంచి వ‌చ్చేందుకు రెడీగానే ఉన్న‌ప్ప‌టికీ.. కూటమి ప్ర‌భుత్వంలో నాయ‌కులు కూడా కిక్కిరిసి పోయారు. 164 మందితో కూట‌మి ప్ర‌భుత్వం కిట‌కిట‌లాడుతోంది. ఇలాంటి స‌మ‌యంలో వారిని తీసుకుని ఏం చేస్తారు? వారు వ‌చ్చినా.. ఏం ప్ర‌యోజ‌నం అన్న‌ది ప్ర‌శ్న‌. అయితే.. రాజ‌కీయంగా వైసీపీకి దెబ్బ కొట్టేందుకు.. లేదా.. పార్టీకి వాయిస్ లేకుండా చేసేందుకు మాత్రం వ్యూహం ప‌నిచేస్తుంద‌ని భావిస్తున్నారు. దీనికి చంద్ర‌బాబు ప్ర‌స్తుతానికి సుముఖంగా అయితేలేరు.

ఈ నేప‌థ్యంలో మంత్రి చెప్పిన మాట‌లు నిజ‌మేనా? లేక‌, రాజ‌కీయంగా ఆయ‌న వైసీపీని ఆత్మ‌ర‌క్ష‌ణలో ప‌డేసేందుకు చెబుతున్నారా? అనేది తేలాల్సి ఉంది. అయితే.. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏమైనా జ‌ర‌గొచ్చు .. అన్న‌ట్టుగా వ‌చ్చినా రావొచ్చ‌ని.. చంద్ర‌బాబు మ‌న‌సు మార్చుకోవ‌చ్చ‌ని మ‌రికొంద‌రు వ్యాఖ్యానిస్తున్నా రు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఒక‌వేళ ఇదే జ‌రిగి 5-8 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోతే.. జ‌గ‌న్‌కు మ‌రింత ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on August 15, 2024 10:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘వ్యాపార సంస్క‌ర్త‌-2025’: చంద్ర‌బాబుకు ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు ల‌భించింది. ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-2025’ (వ్యాపార సంస్క‌ర్త‌-2025)కు ఆయ‌న ఎంపిక‌య్యారు.…

52 seconds ago

కొడాలి రీప్లేస్.. ఖాయమంటున్న కేడర్..!

కొడాలి నాని. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. వైసీపీ హయాంలో ప్రత్యర్థులు ఆయనకు “బూతుల మంత్రి” అనే…

18 minutes ago

నేరుగా వంటింటికే.. రైతు బజార్!

డిజిటల్ యుగానికి అనుగుణంగా ప్రభుత్వం ఆన్‌లైన్ రైతు బజార్‌ను ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్ట్‌గా విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ రైతు బజార్…

51 minutes ago

బాబు గారి పాలన… అంతా లైవ్ లోనే!

సాధారణంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశాలు మూసివున్న గదుల్లో, గోప్యంగా సాగుతుంటాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న కలెక్టర్ల…

2 hours ago

డెకాయిట్… డిఫరెంట్ అనిపిస్తున్నాడు

అడివి శేష్ తెరమీద కనిపించి రెండేళ్లు గడిచిపోయాయి. ఆ మధ్య నాని హిట్ 3 ది థర్డ్ కేస్ లో…

2 hours ago

చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు ల‌భించింది. ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-2025’ (వ్యాపార సంస్క‌ర్త‌-2025)కు ఆయ‌న ఎంపిక‌య్యారు.…

2 hours ago