టీడీపీకి వైసీపీ ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చారంటూ.. సీనియర్ నాయకుడు, మంత్రి కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యాలు సంచలనం రేపుతున్నాయి. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్టు తర్వాత.. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే దక్కారు. వీరిలో జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి వంటి కీలకమైన ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే వైసీపీకి వీర విధేయులు.
మిగిలిన వారి విషయంలో ఇంత వీర విధేయత ఉంటుందని భావించలేం. ఉన్నా కూడా.. పరిస్థితులకు అనుగుణంగా మారే లక్షణం ఉన్న నాయకులు కావడంతో వీరిపైనే అనుమానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కొల్లు మాట్లాడుతూ.. తమ పార్టీలోకి చేరేందుకు 5 నుంచి 8 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని, చంద్రబాబు గేట్లు తీస్తే.. ఇక వారంతా పార్టీ మారిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. కానీ, ఇటు వైపు చూస్తే.. అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.
వైసీపీ నుంచి వచ్చేందుకు రెడీగానే ఉన్నప్పటికీ.. కూటమి ప్రభుత్వంలో నాయకులు కూడా కిక్కిరిసి పోయారు. 164 మందితో కూటమి ప్రభుత్వం కిటకిటలాడుతోంది. ఇలాంటి సమయంలో వారిని తీసుకుని ఏం చేస్తారు? వారు వచ్చినా.. ఏం ప్రయోజనం అన్నది ప్రశ్న. అయితే.. రాజకీయంగా వైసీపీకి దెబ్బ కొట్టేందుకు.. లేదా.. పార్టీకి వాయిస్ లేకుండా చేసేందుకు మాత్రం వ్యూహం పనిచేస్తుందని భావిస్తున్నారు. దీనికి చంద్రబాబు ప్రస్తుతానికి సుముఖంగా అయితేలేరు.
ఈ నేపథ్యంలో మంత్రి చెప్పిన మాటలు నిజమేనా? లేక, రాజకీయంగా ఆయన వైసీపీని ఆత్మరక్షణలో పడేసేందుకు చెబుతున్నారా? అనేది తేలాల్సి ఉంది. అయితే.. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు .. అన్నట్టుగా వచ్చినా రావొచ్చని.. చంద్రబాబు మనసు మార్చుకోవచ్చని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నా రు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఒకవేళ ఇదే జరిగి 5-8 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోతే.. జగన్కు మరింత ఇబ్బందులు తప్పవని అంటున్నారు పరిశీలకులు.
లెనిన్ విడుదలై మంచి స్పందన దక్కించుకున్నాక సోషల్ మీడియాలో శ్రీలీల డిస్కషన్ జరుగుతోంది. ఎందుకంటే లెనిన్ షూటింగ్ మొదలుపెట్టినప్పుడు హీరోయిన్…
హాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హారర్ జానర్ పరిచయం చేసిన కల్ట్ సిరీస్ గా 'ఈవిల్ డెడ్' సినిమాకున్న ఆదరణ…
కొన్ని కాకతాళీయంగా జరిగినట్టు అనిపించినా దాని వెనుక తెలుసుకోవాల్సిన బాక్సాఫీస్ సత్యాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఇండస్ట్రీకి వచ్చి…
నిన్న ధనుష్ తమిళ్ మురుగన్ టీజర్ వచ్చాక మొదట ఆందోళన చెందింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలోనూ…
పల్లి పల్లి లోకేశ్... ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో,…
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా…