టీడీపీకి వైసీపీ ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చారంటూ.. సీనియర్ నాయకుడు, మంత్రి కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యాలు సంచలనం రేపుతున్నాయి. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్టు తర్వాత.. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే దక్కారు. వీరిలో జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి వంటి కీలకమైన ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే వైసీపీకి వీర విధేయులు.
మిగిలిన వారి విషయంలో ఇంత వీర విధేయత ఉంటుందని భావించలేం. ఉన్నా కూడా.. పరిస్థితులకు అనుగుణంగా మారే లక్షణం ఉన్న నాయకులు కావడంతో వీరిపైనే అనుమానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కొల్లు మాట్లాడుతూ.. తమ పార్టీలోకి చేరేందుకు 5 నుంచి 8 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని, చంద్రబాబు గేట్లు తీస్తే.. ఇక వారంతా పార్టీ మారిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. కానీ, ఇటు వైపు చూస్తే.. అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.
వైసీపీ నుంచి వచ్చేందుకు రెడీగానే ఉన్నప్పటికీ.. కూటమి ప్రభుత్వంలో నాయకులు కూడా కిక్కిరిసి పోయారు. 164 మందితో కూటమి ప్రభుత్వం కిటకిటలాడుతోంది. ఇలాంటి సమయంలో వారిని తీసుకుని ఏం చేస్తారు? వారు వచ్చినా.. ఏం ప్రయోజనం అన్నది ప్రశ్న. అయితే.. రాజకీయంగా వైసీపీకి దెబ్బ కొట్టేందుకు.. లేదా.. పార్టీకి వాయిస్ లేకుండా చేసేందుకు మాత్రం వ్యూహం పనిచేస్తుందని భావిస్తున్నారు. దీనికి చంద్రబాబు ప్రస్తుతానికి సుముఖంగా అయితేలేరు.
ఈ నేపథ్యంలో మంత్రి చెప్పిన మాటలు నిజమేనా? లేక, రాజకీయంగా ఆయన వైసీపీని ఆత్మరక్షణలో పడేసేందుకు చెబుతున్నారా? అనేది తేలాల్సి ఉంది. అయితే.. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు .. అన్నట్టుగా వచ్చినా రావొచ్చని.. చంద్రబాబు మనసు మార్చుకోవచ్చని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నా రు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఒకవేళ ఇదే జరిగి 5-8 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోతే.. జగన్కు మరింత ఇబ్బందులు తప్పవని అంటున్నారు పరిశీలకులు.
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…