పేదవాళ్ల ఆకలి తీర్చాలన్న సదుద్దేశంతో ఏపీలో కూటమి సర్కారు అన్న క్యాంటీన్లను తీసుకువచ్చింది. ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం దక్కిన రోజును పురస్కరించుకుని పేదవాటి పొట్టకు కూడా స్వతంత్రం తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఆ రోజు నుంచి క్యాంటీన్లను ప్రారంభించాలని నిర్ణయించినట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. తొలి రోజు ఆయన గుడివాడ నియోజవర్గంలో అతిపెద్ద క్యాంటీన్ను ప్రారంభించనున్నారు. మరుసటి రోజు నుంచి 99 క్యాంటీన్లను మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు వీటిని ప్రారంభించనున్నారు.
అన్న క్యాంటీన్నలు సంబరాల మధ్య ప్రారంభించాలని చంద్రబాబు ఇప్పటికే పిలుపునిచ్చారు. దీంతో సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ క్యాంటీన్ల ఏర్పాటులో నిమగ్నమయ్యారు. మొత్తంగా తొలి విడతలో 100 క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. ఇక, ముహూర్తంతో పాటు తాజాగా కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లలో ఏయే పదార్థాలను పేదలకు వడ్డించాలో కూడా స్పష్టం చేస్తూ.. మెనూను విడుదల చేసింది. వారానికి ఒక వెరైటీ చొప్పున ఈ మెనూను రెడీ చేశారు.
అంతేకాదు.. ఏదో పెట్టామంటే పెట్టామన్నట్టుగా కాకుండా.. దీనికి కూడా లెక్క నిర్ణయించారు. అన్నం ఎంత వడ్డించాలి? కూర, సాంబారు, పప్పు, పచ్చడి వంటివాటిని ఏ స్థాయిలో అందించాలనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అంటే.. పేదలకు మొక్కుబడిగా కాకుండా.. మనసు పెట్టి అన్న క్యాంటీన్ల ద్వారా కడుపు నింపాలన్న ఆశాయాన్ని సంపూర్ణంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నారు. దీని ప్రకారమే మెనూను సీఎం చంద్రబాబు రెడీ చేసినట్టు తెలిసింది. కేవలం 5 రూపాయలకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం రూ.5 కే భోజనం, రాత్రి సమయంలోనూ రూ.5కే భోజనం ఈ క్యాంటీన్ల ద్వారా అందిస్తారు.
ఇదీ మెనూ..
సోమవారం: టిఫిన్లో ఇడ్లీతో పాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ అందిస్తారు. ఇడ్లీ వద్దంటే.. పూరీ, కుర్మా ఇస్తారు. మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లోనూ మెనూ మారుతుంది.
మంగళవారం: ఇడ్లీ, చట్నీ, పొడి లేదా సాంబార్ కామన్. ఇది వద్దంటే ఉప్మాతో చట్నీ, మిక్చర్ వడ్డిస్తారు. మధ్యాహ్నం, రాత్రి భోజనాలు ఉంటాయి.
బుధవారం: ఇడ్లీ కామన్గా ఉంటుంది. ప్రత్యేకంగా పొంగల్తో చట్నీ లేదా సాంబార్ వడ్డిస్తారు. మధ్యాహ్న భోజనంలో బిర్యానీ పెడతారు. రాత్రికి మెనూ కామన్.
గురువారం: ఉదయం ఇడ్లీ కామన్. ప్రత్యేకంగా పూరీ కుర్మా ఉంటాయి.మధ్యాహ్నం చిత్రాన్నం లేదా సాధారణ మీల్స్, రాత్రికి మామూలు భోజనం.
శుక్రవారం: ఇడ్లీ కామన్. ఉప్మా ఉంటుంది. మధ్యాహ్నం స్వీటు, భోజనం. రాత్రికి భోజనం కామన్.
శనివారం: ఇడ్లీ కామన్గా ఉంటుంది. ప్రత్యేకంగా కోరుకుంటే పొంగల్తో చట్నీ లేదా పొడి లేదా సాంబార్ ఇస్తారు. మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కామన్.
ఏయే పదార్థాలు ఎంతెంత?
సమయాలు ఇవీ..
This post was last modified on August 14, 2024 12:19 pm
ఏషియన్ సినిమా సంస్థ.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోల…
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
“మనకు అన్నీ బాగున్నప్పుడు అందరూ తోడుంటారు. కానీ కష్టకాలంలో అండగా నిలిచినవారే మనవారు. అలాంటి వారిని జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు”…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…