Political News

క‌ళ్ల‌లో కారం చ‌ల్లి.. టీడీపీ నేత దారుణ హ‌త్య‌

ఏపీలో ఘోరం చోటు చేసుకుంది. టీడీపీ నాయ‌కుడు, ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని ప‌త్తికొండ నియోజ‌కవ‌ర్గం ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అనుచ‌రుడు, 45 ఏళ్ల‌ వాకిటి శ్రీను దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. బుధ‌వారం తెల్ల‌వారుజామున నియోజ‌క‌వ‌ర్గంలోని శివారు ప్రాంతం హోసూరులో బ‌హిర్భూమికి వెళ్లిన శ్రీనును కొంద‌రు వ్య‌క్తులు అనుస‌రించి.. క‌ళ్ల‌లో కారం చ‌ల్లి వెంట తెచ్చుకున్న క‌త్తుల‌తో దారుణంగా హ‌త్య చేశారు. అయితే.. ఎవ‌రు చేశార‌న్న‌ది మాత్రం ఇంకా తెలియ‌లేదు.

సుమారు 20 ఏళ్లుగా వాకిటి శ్రీను.. కేఈ కుటుంబానికి అత్యంత స‌న్నిహితుడుగా మెలుగుతున్నారు. గ‌తం లో మండ‌ల స్థాయిలో చిన్న‌పాటి ప‌ద‌విని కూడా ఆయ‌న చేసిన‌ట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే.. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ నేత‌ల‌పై ఆయ‌న విమ‌ర్శ‌లు చేయ‌డం, వారికి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేయ‌డంతో వైసీపీకి అనుకూలంగా ఉన్న కొన్ని కుటుంబాలు టీడీపీకి అనుకూలంగా మారాయ‌నే వాద‌న ఉంది. ఈ కార‌ణంగానే వైసీపీ నాయ‌కులు ఆయ‌న‌ను హ‌త్య చేసి ఉంటార‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు న‌మోదు చేశారు. హ‌తుడు శ్రీను కు ఉన్న పరిచయాలు, ఇతర గొడవలపై ఆరా తీశారు. టీడీపీ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు కూడా ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్యేకు ఇటీవ‌ల కాలంలో శ్రీను ప్రధాన అనుచరుడిగా మారారు. పార్టీని గెలిపించ‌డంలోనూ.. మండ‌ల స్థాయిలో నాయ‌కుల‌ను చేర‌దీయ‌డంలోనూ శ్రీను కీల‌క పాత్ర పోషించిన‌ట్టు తెలిసింది.

అయితే.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అనుచ‌రుల‌కు, శ్రీను కు మ‌ధ్య కొన్నాళ్లుగా తీవ్ర ఘ‌ర్ష‌ణ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఆయ‌న హ‌త్య‌కు గురి కావ‌డంతో వైసీపీ నేత‌ల పాత్ర ఉండి ఉంటుంద‌ని శ్యాంబాబు అనుమానాలు వ్య‌క్తం చేశారు. దీనిపై విచార‌ణ చేస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు. ఎవ‌రినీ వ‌దిలి పెట్ట‌బోమని డీఎస్పీ చెప్పారు. కాగా, ఈ హ‌త్య అనంత‌రం ప‌త్తికొండ‌లో ఎలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా.. ముంద‌స్తుగా 114 సెక్ష‌న్‌ను అమ‌లు చేస్తున్న‌ట్టు డీఎస్పీ ప్ర‌క‌టించారు.

This post was last modified on August 14, 2024 12:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజకవర్గాల పెంపు: ఒరిగేదేంటి.. జరిగేదేంటి?

దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…

4 hours ago

జ‌మిలికి జై కొట్టాలా?.. కాంగ్రెస్ అంత‌ర్మ‌థ‌నం!

దేశంలో రెండు కీల‌క అంశాల‌ను తేల్చేసేందుకు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ సర్కారు సిద్ధ‌మైంది. 1) జ‌మిలి ఎన్నిక‌లు. 2) పార్ల‌మెంటు…

8 hours ago

అమ‌రావ‌తి ఆగ‌ద‌ని తెలిసీ.. జ‌గ‌న్ `రాజ‌కీయం`

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. చాలా వేగంగా కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాలను…

10 hours ago

జగిత్యాల టాక్: జీవన్ రెడ్డి రాంగ్ స్టెప్..!

జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాజాగా బీఆర్ ఎస్ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ అధినేత…

10 hours ago

ఆ క‌మెడియ‌న్ కోసం వెతుకుతున్న‌ మెగా ఫ్యాన్స్

జ‌నాల‌ను న‌వ్వించ‌డం కోసం సెల‌బ్రెటీల వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి దూరితే.. ప‌రిణామాలు ఎలా ఉంటాయో చెప్ప‌డానికి ఈ ఉదంతం ఉదాహ‌ర‌ణ‌. హైద‌రాబాద్‌కు…

11 hours ago

వెయ్యి కోట్ల ఒప్పందం… ముస్లిం ఓట్ల కోస‌మేనా?

దేశవ్యాప్తంగా మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో ప్రధానంగా బిజెపి ఎక్కువగా ఆశలు పెట్టుకున్న రాష్ట్రం…

11 hours ago