Political News

క‌ళ్ల‌లో కారం చ‌ల్లి.. టీడీపీ నేత దారుణ హ‌త్య‌

ఏపీలో ఘోరం చోటు చేసుకుంది. టీడీపీ నాయ‌కుడు, ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని ప‌త్తికొండ నియోజ‌కవ‌ర్గం ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అనుచ‌రుడు, 45 ఏళ్ల‌ వాకిటి శ్రీను దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. బుధ‌వారం తెల్ల‌వారుజామున నియోజ‌క‌వ‌ర్గంలోని శివారు ప్రాంతం హోసూరులో బ‌హిర్భూమికి వెళ్లిన శ్రీనును కొంద‌రు వ్య‌క్తులు అనుస‌రించి.. క‌ళ్ల‌లో కారం చ‌ల్లి వెంట తెచ్చుకున్న క‌త్తుల‌తో దారుణంగా హ‌త్య చేశారు. అయితే.. ఎవ‌రు చేశార‌న్న‌ది మాత్రం ఇంకా తెలియ‌లేదు.

సుమారు 20 ఏళ్లుగా వాకిటి శ్రీను.. కేఈ కుటుంబానికి అత్యంత స‌న్నిహితుడుగా మెలుగుతున్నారు. గ‌తం లో మండ‌ల స్థాయిలో చిన్న‌పాటి ప‌ద‌విని కూడా ఆయ‌న చేసిన‌ట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే.. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ నేత‌ల‌పై ఆయ‌న విమ‌ర్శ‌లు చేయ‌డం, వారికి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేయ‌డంతో వైసీపీకి అనుకూలంగా ఉన్న కొన్ని కుటుంబాలు టీడీపీకి అనుకూలంగా మారాయ‌నే వాద‌న ఉంది. ఈ కార‌ణంగానే వైసీపీ నాయ‌కులు ఆయ‌న‌ను హ‌త్య చేసి ఉంటార‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు న‌మోదు చేశారు. హ‌తుడు శ్రీను కు ఉన్న పరిచయాలు, ఇతర గొడవలపై ఆరా తీశారు. టీడీపీ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు కూడా ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్యేకు ఇటీవ‌ల కాలంలో శ్రీను ప్రధాన అనుచరుడిగా మారారు. పార్టీని గెలిపించ‌డంలోనూ.. మండ‌ల స్థాయిలో నాయ‌కుల‌ను చేర‌దీయ‌డంలోనూ శ్రీను కీల‌క పాత్ర పోషించిన‌ట్టు తెలిసింది.

అయితే.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అనుచ‌రుల‌కు, శ్రీను కు మ‌ధ్య కొన్నాళ్లుగా తీవ్ర ఘ‌ర్ష‌ణ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఆయ‌న హ‌త్య‌కు గురి కావ‌డంతో వైసీపీ నేత‌ల పాత్ర ఉండి ఉంటుంద‌ని శ్యాంబాబు అనుమానాలు వ్య‌క్తం చేశారు. దీనిపై విచార‌ణ చేస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు. ఎవ‌రినీ వ‌దిలి పెట్ట‌బోమని డీఎస్పీ చెప్పారు. కాగా, ఈ హ‌త్య అనంత‌రం ప‌త్తికొండ‌లో ఎలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా.. ముంద‌స్తుగా 114 సెక్ష‌న్‌ను అమ‌లు చేస్తున్న‌ట్టు డీఎస్పీ ప్ర‌క‌టించారు.

This post was last modified on August 14, 2024 12:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

1 hour ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

2 hours ago

పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…

2 hours ago

ఉగాది రోజు కూటమి కొలువుల కానుక

ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్‌ను విడుదల…

2 hours ago

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

6 hours ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

10 hours ago