Political News

ఏపీలో బ్రాండెడ్ లిక్క‌ర్.. క్వార్ట‌ర్ 110

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత నాణ్య‌మైన మ‌ద్యాన్ని అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని ఎన్నిక‌ల‌కు ముందు చంద్రబాబు హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ హామీ మేర‌కు.. అక్టోబ‌రు 1వ తేదీ నుంచి నూత‌న మ‌ద్యం పాల‌సీని అందు బాటులోకి తీసుకువ‌చ్చేందుకు కూట‌మి స‌ర్కారు రెడీ అయింది. దీనికి సంబంధించి తెలంగాణ‌, కేర‌ళ‌, క‌ర్ణాట‌క స‌హా త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో మంత్రుల బృందం ప‌ర్య‌టించి.. ప‌రిశీలించింది. అక్క‌డ అమ‌ల‌వుతున్న మ‌ద్యం విధానానికి సంబంధించి చంద్ర‌బాబుకు నివేదిక కూడా అందించింది. దీనిలో ప‌లు విష‌యాల‌ను వారు వివ‌రించారు. ధ‌ర‌లు, అమ‌లు వంటివి కూడా ఉన్నాయి.

దీని ప్ర‌కారం.. క్వార్ట‌ర్ నాణ్య‌మైన మ‌ద్యాన్ని రూ.110 లోపు అందించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. మ‌రోవైపు.. ప్ర‌ముఖ బ్రాండ్ల కంపెనీల‌ను కూడా రాష్ట్రానికి ఆహ్వానించాల‌ని నిర్ణ‌యించారు. ఇక్క‌డే డిస్టిలరీల‌ను ఏర్పాటు చేసుకుని నాన్ ఫారిన్ లిక్క‌ర్ కంపెనీల‌ను ఏపీలో ఏర్పాటు చేసుకునేందుకు ఉన్న అవ‌కాశాల‌ను కూడా ప‌రిశీలించ‌నున్నారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక‌.. ప్ర‌భుత్వ‌మే లిక్క‌ర్ వ్యాపారాన్ని స్వాధీనం చేసుకుంది. వైన్స్‌ను ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తూ.. బార్ల‌ను మాత్రం ప్రైవేటుకు ఇచ్చింది.

అయితే.. ఈ విధానంలో నాణ్య‌మైన మ‌ద్యాన్ని ప‌క్క‌న పెట్టి చీపు లిక్క‌ర్ విక్ర‌యించార‌ని..త‌ద్వారా వినియోగ‌దారుల‌ ఆరోగ్యం చెడిపోయింద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే మద్యం పాలసీపై కసరత్తు చేసి.. తాజాగా ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలిసింది. ఈ కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తే, మద్యం ధరలు భారీగా తగ్గనున్నాయని మంత్రులు తెలిపారు. గ‌త‌ మద్యం పాలసీని రద్దు చేసి, 2014-19 మ‌ధ్య టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పాత మద్యం పాలసీని అమలు చేయనున్న‌ట్టు చెప్పారు.

ఈ క్ర‌మంలో తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం అందించేలా చర్యలు చేపడతామ‌ని, క్వార్టర్ బాటిల్ రూ.110 లోపే ఉండేలని భావిస్తున్న‌ట్టు తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఆయా కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు. ఇదే స‌మ‌యంలో ఔట్ లెట్ల‌ను పెంచాల‌ని కూడా నిర్ణ‌యించారు. ధ‌ర‌లు త‌గ్గిస్తున్నందున స‌రుకును ఎక్కువ‌గా విక్ర‌యించి ఆదాయం త‌గ్గ‌కుండా చూసుకోవాల‌న్న‌ది ప్ర‌భుత్వ ఆలోచ‌న‌ల‌గా ఉందని తెలుస్తోంది. మొత్తంగా అక్టోబ‌రు 1వ తేదీ నుంచి నూత‌న మ‌ద్యం పాల‌సీని అమ‌ల్లోకి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం వేగంగా జ‌రుగుతోంది.

This post was last modified on August 12, 2024 10:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అచ్చియమ్మ… తొందర లేదమ్మా

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ప్రమోషన్లలో జాన్వీ కపూర్ కనిపించకపోవడం గురించి సోషల్ మీడియాలో రకరకాల అర్థాలు తీస్తున్నారు.…

22 minutes ago

కూటమిది స్పీడు కాదు… జెట్ స్పీడు

ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి…

2 hours ago

ఇంత నొప్పి ఎలా తట్టుకుంటున్నావ్ పవన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలే శస్త్ర చికిత్స తీసుకుని… అనంతరం స్వల్ప వ్యవధి విశ్రాంతి…

3 hours ago

తెలుగు రాష్ట్రాల్లో `స‌ర్‌`: పార్టీల్లో ఆందోళ‌న‌!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్పెష‌ల్‌ ఇంటెన్సివ్ రివిజ‌న్(స‌ర్‌) పేరుతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఓట‌ర్ల జాబితాను తాజా ప‌రిచే కార్య‌క్ర‌మానికి…

4 hours ago

‘రంగా గారికి ప్రాణహాని ఉన్నప్పుడు ఏం చేశారయ్యా మీరంతా?’ – పవన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం తనదైన శైలిలో అన్ని అంశాలపై కూలంకషంగానే స్పందించారు. అనారోగ్యం…

6 hours ago

రాకా సంగీతానికి పెద్ద ఛాలెంజ్ ఉంది

అనిరుధ్ రవిచందర్ తర్వాత తమిళ దర్శకులు ఎక్కువగా జపిస్తున్న పేరు సాయి అభ్యంక్కర్. కుర్రాడు చాలా చిన్న వయసులోనే మ్యూజిక్…

7 hours ago