కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్. వైసీపీ నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్ రెడ్డి శాసనమండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డాడని వైసీపీ పార్టీ నుండి బహిష్కరించింది. అయితే తన ఫోన్ ట్యాపింగ్ చేశారని కోటంరెడ్డి ఆరోపించారు. ఇటీవల్ల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వరసగా మూడో సారి నెల్లూరు రూరల్ శాసనసభ స్థానం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.
వైసీపీలో ఉన్నప్పుడు, వైసీపీ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా కోటంరెడ్డి సవాళ్లు విసురుతూ ఫైర్ బ్రాండ్ గా పేరుపొందాడు. అయితే తన స్వభావానికి భిన్నంగా గత కొంతకాలంగా శాంతికాముకుడిగా మారిపోయాడు. టీడీపీ తరపున గెలిచిన తర్వాత వైసీపీ నేతల ఇళ్ల ముందు కార్యకర్తలు రెచ్చగొడుతూ ఫ్లెక్సీలు పెట్టారు.
విషయం తెలుసుకున్న కోటంరెడ్డి వెంటనే ప్రత్యర్ధుల ఇళ్ల ముందు ఫ్లెక్సీలు తొలగించాలని టీడీపీ కార్యకర్తలకు సూచించాడు. తన మాటను గౌరవించకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పడంతో కార్యకర్తలు ఆ ఫ్లెక్సీలను తొలగించారు. ఫైర్ బ్రాండ్ లా ఉండే కోటంరెడ్డి హఠాత్తుగా రూటు మార్చాడేంటని సొంత పార్టీ కార్యకర్తలు, నేతలు ఆశ్చర్య పోతున్నారు.
గ్రావెల్, ఇసుక దందాలకు పాల్పడుతూ దొరికితే టీడీపీ వారైతే రూ.లక్ష జరిమానా వేయాలని, వైసీపీ వారైతే రూ.2 లక్షలు జరిమానా వేయాలని, తన పేరు చెప్పుకుని ఎవరైనా ఈ దందా చేస్తుంటే రూ.10 లక్షల జరిమానా విధించాలని అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. కోటంరెడ్డి ఫోన్ వస్తేనే వణికిపోయే అధికారులు ప్రస్తుతం ఆయనలో వచ్చిన మార్సు చూసి అసలు ఈ మార్పుకు కారణం ఏంటా ? అని ఆరాలు తీస్తున్నారట.
This post was last modified on August 12, 2024 6:59 am
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటిసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టలేదు. ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన.. పాలనా పరంగా…
హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. గతానికి భిన్నంగా దేశంలోని మెట్రోపాలిటిన్ నగరాల్లో కొన్నింటిని మించిపోయిన భాగ్యనగరి.. మరికొన్ని మహానగరాల దూకుడుకు ఏ…
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు కీలక వ్యవస్థలను ప్రభుత్వ శాఖల్లో కలిపేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ హయాంలో…
ఒక అపార్టుమెంట్ లోని పార్కింగ్ వద్ద చోటు చేసుకున్న పంచాయితీ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లటం…
దేవర పార్ట్ 1 విడుదల కోసం అభిమానులతో సమానంగా విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఆతృతగా ఎదురు…
ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన మంత్రి వర్గ…