సీఎం చంద్రబాబు.. ఒక వ్యవస్థీ కృత గ్యాప్లో పడిపోయినట్టు తెలుస్తోంది. చీమ చిటుక్కుమన్నా తెలిసే సాంకేతికత ఆయన సొంతం. అయితే.. ఇది నిన్నమాట. ఇప్పుడు తాజాగా వెలుగు చూసిన ఓ వ్యవహారం.. ఆయనకు.. ప్రజలకే కాదు.. ప్రముఖలకు మధ్య గ్యాప్ పెంచేస్తున్నవారు ఉన్నట్టుగా అర్థమవుతోంది. ప్రముఖ ఉద్యమ కారిణి, ప్రజ్వల సంస్థ నిర్వాహకురాలు సునీతా కృష్ణణ్ చేసిన ట్వీట్ చూస్తే.. చంద్రబాబు వరకు కొన్ని విషయాలు చేరడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలను వ్యభిచార కూపం నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన ప్రజ్వల సంస్థ ద్వారా సునీతా కృష్ణన్ దక్షిణాదిలో మంచి పేరు సంపాయించుకున్నారు.
చంద్రబాబు సీఎం అయిన తర్వాత.. ఆమె ఆయనను కలుసుకునేందుకు, రాష్ట్రంలో మహిళల పురోభివృద్ధిపై చర్చించేందుకు నిర్ణయించుకున్నట్టు ఆమె చేసిన తాజా ట్వీట్తో తెలిసింది. అయితే.. ఇప్పటికి పలు మార్లు ఆమె ప్రయత్నించినట్టు తెలిపారు. అయితే..చంద్రబాబు అప్పాయింట్ మెంటు మాత్రం ఆమెకు లభించలేదు. అసలు ఈ విషయం చంద్రబాబు వరకు చేరలేదని కూడా.. ఆమె చేసిన ట్వీట్ను బట్టి తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో నేరుగా చంద్రబాబు ట్విటర్కే ఆమె పోస్టు పెట్టారు. తను కలవాల్సి ఉందని, తగిన సమయం కేటాయిస్తే.. 10 నిమిషాలు చర్చించాల్సిన అంశాలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు.
దీనికి చంద్రబాబు సానుకూలత వ్యక్తం చేశారు. ఇదేసమయంలో అప్పాయింట్ మెంటు వ్యవహారంలో జరిగిన లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తానని కూడా వివరణ ఇచ్చారు. అయితే.. వాస్తవానికి చంద్రబాబుకు అప్పాయింట్మెంటు కల్పించే విషయంలో జీఏడీ(సాధారణ పరిపాలన శాఖ) చూడాలి. కానీ, అది పక్కకుపోయి.. ఇప్పుడు పార్టీ కీలక నాయకులు చూస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ గ్యాప్ పెరుగుతున్నట్టు సమాచారం.
ఇలా ఎంత మంది ఆయనను కలుసుకునేందుకు వచ్చి.. అప్పాయింట్మెంటు లభించక వెనుదిగారనే విషయంపై సీఎంవో వర్గాలు దృష్టి పెట్టాయి. ఏదేమైనా ఇది వ్యవస్థీకృత లోపంగానే అధినేత చంద్రబాబు భావిస్తున్నారు.
This post was last modified on August 11, 2024 7:13 am
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…