వైసీపీ అధినేత, ఏపీ విపక్ష నాయకుడు జగన్ను కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు తగులుకున్నారు. ఎన్నికల సమయంలోనూ జగన్పై విరుచుకుపడ్డ ఆయన ఇప్పుడు మరోసారి మాటల తూటాలు పేల్చారు. జగన్కు రాజకీయాల్లో ఓనమాలు తెలియవని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ కోరడమేంటని.. దీనిని బట్టే ఆయన రాజకీయ పరిపక్వతను అర్ధం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఈ మాటలు విని జనం నవ్వుకుంటున్నారని అన్నారు.
జగన్ కోరికలు కూడా ఆయనలానే చిత్రంగా ఉన్నాయని గోనె అన్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన కోరడం.. ఎవరైనా ఇచ్చిన సలహానా.. లేక ఆయనకే వచ్చిన ఐడియానా? అని వ్యాఖ్యానించారు. ఎలా చూసుకున్నా.. పట్టుమని మూడు వారాలు కూడా నిండని ప్రభుత్వాన్ని తోసేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, రాష్ట్రపతి పాలన అసాధ్యమని వ్యాఖ్యానించారు. “జగన్ డిమాండ్ చేయడం చూస్తుంటే రాజకీయాల్లో ఆయనకు ఓనమాలు తెలియవని స్పష్టం అవుతోంది” అని గోనె అన్నారు.
ఇక, దివంగత వైఎస్ గురించి మాట్లాడుతూ.. వైఎస్ను తాను దేవుడితో సమానంగా భావిస్తానని, ఇప్పటికీ తన ఇంట్లో వైఎస్ ఫొటో ఉంటుందని తెలిపారు. కానీ, ఆయన కుమారుడిగా జగన్ నవ్వుల పాలవుతున్నారని, దీంతో వైఎస్ను కూడా చులకనగా చూసే పరిస్థితి వచ్చిందని గోనె వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన మీడియాతోమాట్లాడుతూ.. ఏపీలో చంద్రబాబు పాలన ఇప్పుడే ప్రారంభమైందని.. ఇంతలోనే ఏదో ఊహించేసుకుని.. ఆరోపణలు చేయడం సరికాదని గోనె అన్నారు. ఇటీవల తాను చంద్రబాబును మర్యాద పూర్వకంగానే కలిసినట్టు చెప్పారు.
తనకు రాజకీయంగా ఎలాంటి ఆశలు లేవన్న గోనె..వీటిని ఎప్పుడో వదిలేశానని చెప్పారు. ప్రస్తుతం తాను ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్నానని చెప్పారు. తుది శ్వాస వరకు అక్కడే ఉంటానన్నారు. కాగా, వైఎస్ హయాంలో గోనె ప్రకాష్రావు.. ఓ వెలుగు వెలిగారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీ బోర్డు చైర్మన్గా పనిచేశారు. దీనికి ముందు ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్నారు. అయితే.. జగన్తోనూ తొలినాళ్లలో బాగానే ఉన్నా..తర్వాత వీరిద్దరి మధ్య చెడిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి జగన్ను కార్నర్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. అదేసమయంలో షర్మిలకు మద్దతుగా మాట్లాడిన విషయం గుర్తుండే ఉంటుంది.
This post was last modified on August 11, 2024 7:05 am
హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. గతానికి భిన్నంగా దేశంలోని మెట్రోపాలిటిన్ నగరాల్లో కొన్నింటిని మించిపోయిన భాగ్యనగరి.. మరికొన్ని మహానగరాల దూకుడుకు ఏ…
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు కీలక వ్యవస్థలను ప్రభుత్వ శాఖల్లో కలిపేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ హయాంలో…
ఒక అపార్టుమెంట్ లోని పార్కింగ్ వద్ద చోటు చేసుకున్న పంచాయితీ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లటం…
దేవర పార్ట్ 1 విడుదల కోసం అభిమానులతో సమానంగా విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఆతృతగా ఎదురు…
ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన మంత్రి వర్గ…
అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి.. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులను వైసీపీ ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని ఏపీ సీఎం…