Political News

చంద్ర‌బాబు పంటికింద ‘రాళ్లు!’

రాష్ట్రంలో ‘రాళ్ల’ సమస్య వచ్చింది. అవికూడా.. అత్యంత ఖ‌రీదైన గ్రానైట్ రాళ్లు. ధ‌న‌వంతుల ఇళ్ల‌లో వేసుకునే రాళ్లు. ఇప్పుడు ఆ రాళ్లను ఏం చేయాలో తెలియ‌క చంద్ర‌బాబు స‌ర్కారు త‌ల‌పట్టుకుంది. పోనీ.. వదిలేద్దామంటే రూ.350 కోట్లు పెట్టి జ‌గ‌న్‌ ప్రభుత్వం కొనుగోలు చేసింది. అలాగ‌ని వాడ‌దామంటే.. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ర‌ద్దు చేశారు. దీంతో ఆ రాళ్ల వ్య‌వ‌హారం.. ఇప్పుడు స‌ర్కారుకు చిక్కుముడిగా మారింది. ఇంత‌కీ.. ఆ రాళ్ల సంగ‌తేంటి? వాటి వెనుక ఉన్న నిజాలేంటి? అప్ప‌టి సీఎం జ‌గ‌న్ అతి తెలివి ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది.

రెవెన్యూ శాఖలో డాక్యుమెంట్లపై జగన్‌ బొమ్మలు వేసుకున్న విష‌యం తెలిసిందే. పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల వంటివాటిపై కూడా జగన్‌ బొమ్మ వేసుకున్నారు. అలానే రూ. 22.95 కోట్ల ఖర్చుతో జారీ చేసిన 21.86 లక్షల భూ హక్కు సర్వే పత్రాలపైనా ఆయ‌న ఫొటోలు వేసుకున్నారు. ఈ క్ర‌మంలో జగన్‌ బొమ్మతో ఉన్న స‌ర్వే రాళ్ల వ్య‌వ‌హారం 2022లో పెద్ద దుమారం రేపింది. రాళ్ల‌పై బొమ్మ‌లేంట‌ని అప్ప‌ట్లో చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. గత ప్రభుత్వం భూముల రీసర్వే చేపట్టింది. ఈ సర్వే అనంత‌రం స‌రిహ‌ద్దులు నిర్ణ‌యించి.. బూముల్లో వీటిని పాతాల‌ని నిర్ణ‌యించారు.

అప్ప‌టి గ‌నుల శాఖ డైరెక్ట‌ర్ వెంక‌ట‌రెడ్డి సూచ‌న‌ల మేర‌కు.. ఇలా 350 కోట్ల‌ను ఖ‌ర్చు చేసి జ‌గ‌న్ త‌న బొమ్మ‌లు వేసుకున్నార‌న్న ప్ర‌చారం ఉంది. సుమారు ఏడు వేల గ్రామాల్లో ఇప్పటికే రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, రీ సర్వే పూర్తయింది. ఇంత‌లో స‌ర్కారు మారి.. చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చింది. అయితే, రీ సర్వేకోసం తెచ్చిన హద్దు రాళ్లపై జగన్‌ బొమ్మ ఉండటంతో ఈ రాళ్లను ఏమి చేయాలో ప్రభుత్వానికి దిక్కుతోచడం లేదు.

ఈ రాళ్లను దేనికి ఉపయోగిస్తే బాగుంటుందనే ఆలోచనలు పలు రకాలుగా సాగుతున్నాయి. కొందరు మంత్రులు ఈ రాళ్లను గుడులు, బడులు నిర్మించేటప్పుడు పునాది రాళ్లుగా ఉపయోగిస్తే బాగుంటుందని సూచించారు. అయితే.. అంత ఖ‌రీదు పెట్టి కొన్న రాళ్ల‌ను ఇలా పునాదుల‌కు ఎలా ఉప‌యోగిస్తార‌నేది ప్ర‌శ్న‌. పోనీ.. రాళ్లను అలాగే వదిలేద్దామా? అంటే రూ.350 కోట్లు కళ్లముందు కనిపిస్తున్నాయి. ఉపయోగిద్దామా అంటే ప్రత్యర్థి వైఎస్‌ జగన్‌ బొమ్మ ఉంది. మొత్తంగా వీటిని ఏం చేయాల‌న్న విష‌యంపై చంద్ర‌బాబు ఇప్పుడు పెద్ద స‌మ‌స్య‌గా మారాయి.

Satya

Recent Posts

నైజామ్ టికెట్ రేట్లు… ఎడతెగని టెన్షన్లు

పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…

2 hours ago

బడ్జెట్ బయటికి చెప్పడం రిస్కంటారా

మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…

2 hours ago

మాటల్లో రాజీ లేదు.. చేతల్లో ఆలస్యం కాదు..

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…

4 hours ago

బాడీగార్డ్ గురించి ఓపెన్ అయిన చ‌ర‌ణ్‌

త‌న కొత్త సినిమా పెద్ది ప్ర‌మోష‌న్లలో భాగంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డికి వెళ్లినా… ఆయ‌న వెంట…

6 hours ago

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

11 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

12 hours ago