Political News

చంద్ర‌బాబు పంటికింద ‘రాళ్లు!’

రాష్ట్రంలో ‘రాళ్ల’ సమస్య వచ్చింది. అవికూడా.. అత్యంత ఖ‌రీదైన గ్రానైట్ రాళ్లు. ధ‌న‌వంతుల ఇళ్ల‌లో వేసుకునే రాళ్లు. ఇప్పుడు ఆ రాళ్లను ఏం చేయాలో తెలియ‌క చంద్ర‌బాబు స‌ర్కారు త‌ల‌పట్టుకుంది. పోనీ.. వదిలేద్దామంటే రూ.350 కోట్లు పెట్టి జ‌గ‌న్‌ ప్రభుత్వం కొనుగోలు చేసింది. అలాగ‌ని వాడ‌దామంటే.. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ర‌ద్దు చేశారు. దీంతో ఆ రాళ్ల వ్య‌వ‌హారం.. ఇప్పుడు స‌ర్కారుకు చిక్కుముడిగా మారింది. ఇంత‌కీ.. ఆ రాళ్ల సంగ‌తేంటి? వాటి వెనుక ఉన్న నిజాలేంటి? అప్ప‌టి సీఎం జ‌గ‌న్ అతి తెలివి ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది.

రెవెన్యూ శాఖలో డాక్యుమెంట్లపై జగన్‌ బొమ్మలు వేసుకున్న విష‌యం తెలిసిందే. పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల వంటివాటిపై కూడా జగన్‌ బొమ్మ వేసుకున్నారు. అలానే రూ. 22.95 కోట్ల ఖర్చుతో జారీ చేసిన 21.86 లక్షల భూ హక్కు సర్వే పత్రాలపైనా ఆయ‌న ఫొటోలు వేసుకున్నారు. ఈ క్ర‌మంలో జగన్‌ బొమ్మతో ఉన్న స‌ర్వే రాళ్ల వ్య‌వ‌హారం 2022లో పెద్ద దుమారం రేపింది. రాళ్ల‌పై బొమ్మ‌లేంట‌ని అప్ప‌ట్లో చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. గత ప్రభుత్వం భూముల రీసర్వే చేపట్టింది. ఈ సర్వే అనంత‌రం స‌రిహ‌ద్దులు నిర్ణ‌యించి.. బూముల్లో వీటిని పాతాల‌ని నిర్ణ‌యించారు.

అప్ప‌టి గ‌నుల శాఖ డైరెక్ట‌ర్ వెంక‌ట‌రెడ్డి సూచ‌న‌ల మేర‌కు.. ఇలా 350 కోట్ల‌ను ఖ‌ర్చు చేసి జ‌గ‌న్ త‌న బొమ్మ‌లు వేసుకున్నార‌న్న ప్ర‌చారం ఉంది. సుమారు ఏడు వేల గ్రామాల్లో ఇప్పటికే రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, రీ సర్వే పూర్తయింది. ఇంత‌లో స‌ర్కారు మారి.. చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చింది. అయితే, రీ సర్వేకోసం తెచ్చిన హద్దు రాళ్లపై జగన్‌ బొమ్మ ఉండటంతో ఈ రాళ్లను ఏమి చేయాలో ప్రభుత్వానికి దిక్కుతోచడం లేదు.

ఈ రాళ్లను దేనికి ఉపయోగిస్తే బాగుంటుందనే ఆలోచనలు పలు రకాలుగా సాగుతున్నాయి. కొందరు మంత్రులు ఈ రాళ్లను గుడులు, బడులు నిర్మించేటప్పుడు పునాది రాళ్లుగా ఉపయోగిస్తే బాగుంటుందని సూచించారు. అయితే.. అంత ఖ‌రీదు పెట్టి కొన్న రాళ్ల‌ను ఇలా పునాదుల‌కు ఎలా ఉప‌యోగిస్తార‌నేది ప్ర‌శ్న‌. పోనీ.. రాళ్లను అలాగే వదిలేద్దామా? అంటే రూ.350 కోట్లు కళ్లముందు కనిపిస్తున్నాయి. ఉపయోగిద్దామా అంటే ప్రత్యర్థి వైఎస్‌ జగన్‌ బొమ్మ ఉంది. మొత్తంగా వీటిని ఏం చేయాల‌న్న విష‌యంపై చంద్ర‌బాబు ఇప్పుడు పెద్ద స‌మ‌స్య‌గా మారాయి.

This post was last modified on August 10, 2024 12:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఖైదీ 2 ఇక ఎప్పటికీ రాదేమో

దర్శకుడు లోకేష్ కనగరాజ్ టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమాగా ఖైదీ స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. అంతకు ముందు…

8 hours ago

అఖండ తాండవానికి అదొక్కటే సమస్య

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న అఖండ 2 తాండవానికి రంగం సిద్ధమయ్యింది. గంటకు సగటు 16 నుంచి 18…

10 hours ago

రెహమాన్ మీదే ‘పెద్ది’ బరువు

ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…

10 hours ago

బోరుగడ్డతో వైసీపీకి సంబంధం లేదా?

బోరుగడ్డ అనిల్.. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి…

10 hours ago

‘మీ మతంలో జరిగినా అలాగే మాట్లాడతారా జగన్’

తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్‌ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తీవ్రంగా…

11 hours ago

ఆఖర్లోనూ సిక్సర్లు కొడుతున్న బాలీవుడ్

గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…

12 hours ago