రాష్ట్రంలో ‘రాళ్ల’ సమస్య వచ్చింది. అవికూడా.. అత్యంత ఖరీదైన గ్రానైట్ రాళ్లు. ధనవంతుల ఇళ్లలో వేసుకునే రాళ్లు. ఇప్పుడు ఆ రాళ్లను ఏం చేయాలో తెలియక చంద్రబాబు సర్కారు తలపట్టుకుంది. పోనీ.. వదిలేద్దామంటే రూ.350 కోట్లు పెట్టి జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. అలాగని వాడదామంటే.. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశారు. దీంతో ఆ రాళ్ల వ్యవహారం.. ఇప్పుడు సర్కారుకు చిక్కుముడిగా మారింది. ఇంతకీ.. ఆ రాళ్ల సంగతేంటి? వాటి వెనుక ఉన్న నిజాలేంటి? అప్పటి సీఎం జగన్ అతి తెలివి ఏంటి? అనేది ఆసక్తిగా మారింది.
రెవెన్యూ శాఖలో డాక్యుమెంట్లపై జగన్ బొమ్మలు వేసుకున్న విషయం తెలిసిందే. పట్టాదార్ పాస్ పుస్తకాల వంటివాటిపై కూడా జగన్ బొమ్మ వేసుకున్నారు. అలానే రూ. 22.95 కోట్ల ఖర్చుతో జారీ చేసిన 21.86 లక్షల భూ హక్కు సర్వే పత్రాలపైనా ఆయన ఫొటోలు వేసుకున్నారు. ఈ క్రమంలో జగన్ బొమ్మతో ఉన్న సర్వే రాళ్ల వ్యవహారం 2022లో పెద్ద దుమారం రేపింది. రాళ్లపై బొమ్మలేంటని అప్పట్లో చంద్రబాబు ప్రశ్నించారు. గత ప్రభుత్వం భూముల రీసర్వే చేపట్టింది. ఈ సర్వే అనంతరం సరిహద్దులు నిర్ణయించి.. బూముల్లో వీటిని పాతాలని నిర్ణయించారు.
అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి సూచనల మేరకు.. ఇలా 350 కోట్లను ఖర్చు చేసి జగన్ తన బొమ్మలు వేసుకున్నారన్న ప్రచారం ఉంది. సుమారు ఏడు వేల గ్రామాల్లో ఇప్పటికే రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, రీ సర్వే పూర్తయింది. ఇంతలో సర్కారు మారి.. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చింది. అయితే, రీ సర్వేకోసం తెచ్చిన హద్దు రాళ్లపై జగన్ బొమ్మ ఉండటంతో ఈ రాళ్లను ఏమి చేయాలో ప్రభుత్వానికి దిక్కుతోచడం లేదు.
ఈ రాళ్లను దేనికి ఉపయోగిస్తే బాగుంటుందనే ఆలోచనలు పలు రకాలుగా సాగుతున్నాయి. కొందరు మంత్రులు ఈ రాళ్లను గుడులు, బడులు నిర్మించేటప్పుడు పునాది రాళ్లుగా ఉపయోగిస్తే బాగుంటుందని సూచించారు. అయితే.. అంత ఖరీదు పెట్టి కొన్న రాళ్లను ఇలా పునాదులకు ఎలా ఉపయోగిస్తారనేది ప్రశ్న. పోనీ.. రాళ్లను అలాగే వదిలేద్దామా? అంటే రూ.350 కోట్లు కళ్లముందు కనిపిస్తున్నాయి. ఉపయోగిద్దామా అంటే ప్రత్యర్థి వైఎస్ జగన్ బొమ్మ ఉంది. మొత్తంగా వీటిని ఏం చేయాలన్న విషయంపై చంద్రబాబు ఇప్పుడు పెద్ద సమస్యగా మారాయి.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…