టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుపై ఒత్తిడి పడుతోందా? ఎన్నికలకు ముందు పార్టీకి సహకరించిన విభిన్న వర్గాల నుంచి ఆయన ఒత్తిడి ఎదుర్కొంటున్నారా? అంటే ఔననే అంటున్నారు పార్టీ సీనియర్ నాయకులు. ఎన్నికల సమయంలో పారిశ్రామిక వర్గాల నుంచి సామాజిక సమీకరణల వరకు అన్ని వైపులా మద్దతు లభించింది. వీరిలో వైసీపీని సమర్థించిన రెడ్డి సామాజిక వర్గం కూడా ఉంది.ఇదే సమయంలో కమ్మ సామాజిక వర్గం నుంచి భారీ ఎత్తున మద్దతు లభించింది.
ఈ పరిణామాలతో సహజంగానే చంద్రబాబుపై ఒత్తిడి పెరిగింది. కీలక పదవులు.. కార్పొరేషన్ల వ్యవహారం లో తమను పరిశీలనలోకి తీసుకోవాలని వారంతా కోరుతున్నారు. అయితే.. ఇప్పటికే ఉన్న నాయకులు, సీట్లు త్యాగం చేసిన వారు, సీనియర్లను చూసుకుంటే.. వారికి ఇవ్వగా మిగిలే పదవులు చాలా వరకు తక్కువగా ఉన్నాయి. పైగా ప్రధాన పోస్టులకే ఎక్కువగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో వాటిని కాదని ఇతర పదవులు ఇస్తే.. తీసుకునేందుకు మిగిలిన వారు సంసిద్ధంగా లేరు.
దీనికితోడు, కూటమి పార్టీలకు కూడా న్యాయం చేయాల్సి వుంది. ఇప్పటికే పదవుల పందేరం విషయంలో ఒక ఫార్ములా అనుకున్నా..దీనికి బీజేపీ అదిష్టానం మొగ్గు చూపడం లేదు. తాము సీట్ల విషయంలో త్యాగాలు చేశామని.. అసెంబ్లీకి 10 సీట్లే తీసుకున్నామని.. కాబట్టి నామినేటెడ్ పదవుల్లో తమకు మెజారిటీ భాగం కావాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై చర్చలు అసంపూర్తిగా నిలిచిపోవడంతో ఇప్పటి వరకు నామినేటెడ్ పోస్టుల వ్యవహారంపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
త్వరలోనే వీటిని భర్తీ చేస్తామని చెబుతున్నా.. పైనుంచి ఉన్న ఒత్తిళ్లు, అంతర్గతంగా ఉన్న డిమాండ్లను పరిశీలిస్తే.. ఎవరికి పదవి ఇచ్చినా.. ఇబ్బందులు తప్పవనే చర్చ సాగుతోంది. ఈక్రమంలో మరోసారి చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేసి.. బీజేపీ నేతలను ఒప్పించడంతోపాటు, అంతర్గత సమావేశాలు నిర్వహించి.. పదవులు కోరుతున్నవారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించాలని భావిస్తున్నారు. ఏదేమైనా అధికారంలోకి వచ్చేందుకు ఎంత ఒత్తిడి ఫీలయ్యారో.. ఇప్పుడు దానికి డబుల్ ఒత్తిడిని ఆయన ఎదుర్కొంటున్నారు.
This post was last modified on August 10, 2024 10:47 am
హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. గతానికి భిన్నంగా దేశంలోని మెట్రోపాలిటిన్ నగరాల్లో కొన్నింటిని మించిపోయిన భాగ్యనగరి.. మరికొన్ని మహానగరాల దూకుడుకు ఏ…
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు కీలక వ్యవస్థలను ప్రభుత్వ శాఖల్లో కలిపేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ హయాంలో…
ఒక అపార్టుమెంట్ లోని పార్కింగ్ వద్ద చోటు చేసుకున్న పంచాయితీ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లటం…
దేవర పార్ట్ 1 విడుదల కోసం అభిమానులతో సమానంగా విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఆతృతగా ఎదురు…
ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన మంత్రి వర్గ…
అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి.. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులను వైసీపీ ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని ఏపీ సీఎం…