టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుపై ఒత్తిడి పడుతోందా? ఎన్నికలకు ముందు పార్టీకి సహకరించిన విభిన్న వర్గాల నుంచి ఆయన ఒత్తిడి ఎదుర్కొంటున్నారా? అంటే ఔననే అంటున్నారు పార్టీ సీనియర్ నాయకులు. ఎన్నికల సమయంలో పారిశ్రామిక వర్గాల నుంచి సామాజిక సమీకరణల వరకు అన్ని వైపులా మద్దతు లభించింది. వీరిలో వైసీపీని సమర్థించిన రెడ్డి సామాజిక వర్గం కూడా ఉంది.ఇదే సమయంలో కమ్మ సామాజిక వర్గం నుంచి భారీ ఎత్తున మద్దతు లభించింది.
ఈ పరిణామాలతో సహజంగానే చంద్రబాబుపై ఒత్తిడి పెరిగింది. కీలక పదవులు.. కార్పొరేషన్ల వ్యవహారం లో తమను పరిశీలనలోకి తీసుకోవాలని వారంతా కోరుతున్నారు. అయితే.. ఇప్పటికే ఉన్న నాయకులు, సీట్లు త్యాగం చేసిన వారు, సీనియర్లను చూసుకుంటే.. వారికి ఇవ్వగా మిగిలే పదవులు చాలా వరకు తక్కువగా ఉన్నాయి. పైగా ప్రధాన పోస్టులకే ఎక్కువగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో వాటిని కాదని ఇతర పదవులు ఇస్తే.. తీసుకునేందుకు మిగిలిన వారు సంసిద్ధంగా లేరు.
దీనికితోడు, కూటమి పార్టీలకు కూడా న్యాయం చేయాల్సి వుంది. ఇప్పటికే పదవుల పందేరం విషయంలో ఒక ఫార్ములా అనుకున్నా..దీనికి బీజేపీ అదిష్టానం మొగ్గు చూపడం లేదు. తాము సీట్ల విషయంలో త్యాగాలు చేశామని.. అసెంబ్లీకి 10 సీట్లే తీసుకున్నామని.. కాబట్టి నామినేటెడ్ పదవుల్లో తమకు మెజారిటీ భాగం కావాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై చర్చలు అసంపూర్తిగా నిలిచిపోవడంతో ఇప్పటి వరకు నామినేటెడ్ పోస్టుల వ్యవహారంపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
త్వరలోనే వీటిని భర్తీ చేస్తామని చెబుతున్నా.. పైనుంచి ఉన్న ఒత్తిళ్లు, అంతర్గతంగా ఉన్న డిమాండ్లను పరిశీలిస్తే.. ఎవరికి పదవి ఇచ్చినా.. ఇబ్బందులు తప్పవనే చర్చ సాగుతోంది. ఈక్రమంలో మరోసారి చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేసి.. బీజేపీ నేతలను ఒప్పించడంతోపాటు, అంతర్గత సమావేశాలు నిర్వహించి.. పదవులు కోరుతున్నవారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించాలని భావిస్తున్నారు. ఏదేమైనా అధికారంలోకి వచ్చేందుకు ఎంత ఒత్తిడి ఫీలయ్యారో.. ఇప్పుడు దానికి డబుల్ ఒత్తిడిని ఆయన ఎదుర్కొంటున్నారు.
This post was last modified on August 10, 2024 10:47 am
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…