ఢిల్లీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణానికి సంబంధించి దాదాపు 17 మాసాలుగా జైల్లో ఉన్న ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు తాజాగా సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఇదే కేసులో ఈ ఏడాది మార్చి నుంచి జైల్లో ఉన్న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కవితకు కూడా ఊరట లభించనుందా? అనే చర్చ జరుగుతోంది. తాజా పరిణామాలను గమనిస్తే..సిసోడియా కేసును సాగదీయాలన్న ఉద్దేశం కనిపిస్తోందని సీబీఐ, ఈడీలకు సుప్రీంకోర్టు చురకలు అంటించింది.
తన కేసును త్వరగా విచారణ చేయమని కోరే హక్కు సిసోడియాకు రాజ్యాంగ బద్ధంగా దఖలు పడిందని తెలిపింది. విచారణ పేరుతో ఓ అనుమానితుడిని ఎంతో కాలం జైల్లో ఉంచలేరని వ్యాఖ్యానించింది. దీనికి సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితిలోనూ రాజీ పడబోదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. అయితే.. శుక్రవారం నాటి విచారణ సందర్భంగా.. సీబీఐ న్యాయవాదులు మాట్లాడుతూ.. సిసోడియాను తిరిగి ట్రయల్ కోర్టుకు పంపించాలని.. అక్కడ విచారణ చేసి.. బెయిల్ ఇవ్వాలో వద్దో నిర్ణయిస్తారని తెలిపారు.
దీనిపై సుప్రీంకోర్టు మండిపడింది. ట్రయల్ కు పంపడమంటే సిసోడియాతో వైకుంఠపాళీ ఆడించినట్లేనని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం సిసోడియాకు దఖలు పడే ప్రాథమిక హక్కులతో ఆడుకోవడమేనని న్యాయమూర్తులు తెలిపారు. బెయిల్ ఇవ్వకుండా ఉండేందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదన్నారు. బెయిల్ ఇవ్వకపోవడం అంటే.. అనుమానితుడిని శిక్ష పడకుండా ముందే శిక్షించడం వంటిదని పేర్కొన్నారు. దిగువ కోర్టులు ఈ విసయాన్ని మరిచిపోవడం దారుణమని వ్యాఖ్యానించారు.
కవితకు ఇదే ఊతమా!
ఇక, బీఆర్ఎస్ అధినేత కుమార్తె కవిత కూడా ఇదే కేసులో తీహార్ జైల్లో ఉండడం.. ఇప్పటికే ఆరు సార్లు బెయిల్ కోసం ప్రయత్నించి విఫలమైన నేపథ్యం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ.. సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు కవితకు ఊతంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రాథమిక హక్కుల గురించి సుప్రీం పేర్కొన్న నేపథ్యంలో కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు.
This post was last modified on August 9, 2024 3:11 pm
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటిసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టలేదు. ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన.. పాలనా పరంగా…
హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. గతానికి భిన్నంగా దేశంలోని మెట్రోపాలిటిన్ నగరాల్లో కొన్నింటిని మించిపోయిన భాగ్యనగరి.. మరికొన్ని మహానగరాల దూకుడుకు ఏ…
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు కీలక వ్యవస్థలను ప్రభుత్వ శాఖల్లో కలిపేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ హయాంలో…
ఒక అపార్టుమెంట్ లోని పార్కింగ్ వద్ద చోటు చేసుకున్న పంచాయితీ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లటం…
దేవర పార్ట్ 1 విడుదల కోసం అభిమానులతో సమానంగా విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఆతృతగా ఎదురు…
ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన మంత్రి వర్గ…