ఢిల్లీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణానికి సంబంధించి దాదాపు 17 మాసాలుగా జైల్లో ఉన్న ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు తాజాగా సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఇదే కేసులో ఈ ఏడాది మార్చి నుంచి జైల్లో ఉన్న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కవితకు కూడా ఊరట లభించనుందా? అనే చర్చ జరుగుతోంది. తాజా పరిణామాలను గమనిస్తే..సిసోడియా కేసును సాగదీయాలన్న ఉద్దేశం కనిపిస్తోందని సీబీఐ, ఈడీలకు సుప్రీంకోర్టు చురకలు అంటించింది.
తన కేసును త్వరగా విచారణ చేయమని కోరే హక్కు సిసోడియాకు రాజ్యాంగ బద్ధంగా దఖలు పడిందని తెలిపింది. విచారణ పేరుతో ఓ అనుమానితుడిని ఎంతో కాలం జైల్లో ఉంచలేరని వ్యాఖ్యానించింది. దీనికి సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితిలోనూ రాజీ పడబోదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. అయితే.. శుక్రవారం నాటి విచారణ సందర్భంగా.. సీబీఐ న్యాయవాదులు మాట్లాడుతూ.. సిసోడియాను తిరిగి ట్రయల్ కోర్టుకు పంపించాలని.. అక్కడ విచారణ చేసి.. బెయిల్ ఇవ్వాలో వద్దో నిర్ణయిస్తారని తెలిపారు.
దీనిపై సుప్రీంకోర్టు మండిపడింది. ట్రయల్ కు పంపడమంటే సిసోడియాతో వైకుంఠపాళీ ఆడించినట్లేనని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం సిసోడియాకు దఖలు పడే ప్రాథమిక హక్కులతో ఆడుకోవడమేనని న్యాయమూర్తులు తెలిపారు. బెయిల్ ఇవ్వకుండా ఉండేందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదన్నారు. బెయిల్ ఇవ్వకపోవడం అంటే.. అనుమానితుడిని శిక్ష పడకుండా ముందే శిక్షించడం వంటిదని పేర్కొన్నారు. దిగువ కోర్టులు ఈ విసయాన్ని మరిచిపోవడం దారుణమని వ్యాఖ్యానించారు.
కవితకు ఇదే ఊతమా!
ఇక, బీఆర్ఎస్ అధినేత కుమార్తె కవిత కూడా ఇదే కేసులో తీహార్ జైల్లో ఉండడం.. ఇప్పటికే ఆరు సార్లు బెయిల్ కోసం ప్రయత్నించి విఫలమైన నేపథ్యం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ.. సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు కవితకు ఊతంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రాథమిక హక్కుల గురించి సుప్రీం పేర్కొన్న నేపథ్యంలో కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు.
This post was last modified on August 9, 2024 3:11 pm
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…