Political News

పవన్‌ను అన్ని మాటలన్నాడు.. తీరా చూస్తే

అధికారంలో ఉండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంతగా రెచ్చిపోయారో.. ప్రత్యర్థి పార్టీల నాయకుల్ని ఎన్నెన్ని మాటలన్నారో.. వాళ్లను ఎంతగా వేదనకు గురి చేశారో తెలిసిందే. అహంకారంతో విర్రవీగిన వాళ్లందరూ ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. చరిత్రలో చూడని పరాభవం ఎదుర్కొని అవమాన భారంతో ఇంటికి పరిమితమయ్యారు. ఇప్పుడేమో కర్మ బూమరాంగ్ అన్నట్లుగా వారి కథ అడ్డం తిరుగుతోంది.

అధికారంలో ఉండగా చేసిన పాపాలు చాలామందిని వెంటాడుతున్నాయి. దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ కోవలోనే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు రచ్చ రచ్చ అవుతోంది. అధికారంలో ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను దారుణాతి దారుణమైన మాటలు అన్న వారిలో దువ్వాడ శ్రీనివాస్ ఒకరు. ఒక సందర్భంలో పవన్ వ్యక్తిగత జీవితం మీద ఆయన తీవ్ర వ్యాఖ్యలే చేశారు.

“ముగ్గురిని నువ్వు ఒక్కడు చేసుకుంటే.. ఒక్కొక్క మగాడు వేల మందిని చేసుకోగలడు. కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగువాడిగా ఏక పత్నీ వ్రతం.. మన మతం. ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో సంసారం చేయడం అన్నది మన సంప్రదాయం. ఆ సంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్” అంటూ ఒక టీవీ ఛానెల్ చర్చలో విరుచుకుపడ్డారు దువ్వాడ శ్రీనివాస్.

కట్ చేస్తే ఇప్పుడు దువ్వాడ రెండో పెళ్లి వ్యవహారం ఇప్పుడు రచ్చ రచ్చ అవుతోంది. శ్రీనివాస్ కొంత కాలంగా మొదటి భార్యను విడిచిపెట్టి రెండో భార్యతోనే ఉంటున్నాడట. తమకు అన్యాయం చేస్తున్నాడంటూ దువ్వాడ మొదటి భార్య కూతుళ్లు రోడ్డు మీదికి వచ్చి నిరసన తెలపడం గమనార్హం. గురువారం రాత్రి వీళ్లు చేపట్టిన ఆందోళనతో దువ్వాడ తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆయన ప్రస్తుతం రెండో భార్యతో ఉంటున్న ఇంటి ముందే వాళ్లు ఆందోళన చేపట్టడంతో వ్యవహారం మీడియాకు ఎక్కింది. రెండో భార్య ఉన్న వ్యక్తి.. ఏకపత్నీ వ్రతం గురించి నీతులు చెబుతూ పవన్‌ను అన్నేసి మాటలు అన్నాడా అంటూ జనం ఇప్పుడు అవాక్కవుతున్నారు.

Satya

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

7 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

8 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

10 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

10 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

11 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

11 hours ago