అధికారంలో ఉండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంతగా రెచ్చిపోయారో.. ప్రత్యర్థి పార్టీల నాయకుల్ని ఎన్నెన్ని మాటలన్నారో.. వాళ్లను ఎంతగా వేదనకు గురి చేశారో తెలిసిందే. అహంకారంతో విర్రవీగిన వాళ్లందరూ ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. చరిత్రలో చూడని పరాభవం ఎదుర్కొని అవమాన భారంతో ఇంటికి పరిమితమయ్యారు. ఇప్పుడేమో కర్మ బూమరాంగ్ అన్నట్లుగా వారి కథ అడ్డం తిరుగుతోంది.
అధికారంలో ఉండగా చేసిన పాపాలు చాలామందిని వెంటాడుతున్నాయి. దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ కోవలోనే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు రచ్చ రచ్చ అవుతోంది. అధికారంలో ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను దారుణాతి దారుణమైన మాటలు అన్న వారిలో దువ్వాడ శ్రీనివాస్ ఒకరు. ఒక సందర్భంలో పవన్ వ్యక్తిగత జీవితం మీద ఆయన తీవ్ర వ్యాఖ్యలే చేశారు.
“ముగ్గురిని నువ్వు ఒక్కడు చేసుకుంటే.. ఒక్కొక్క మగాడు వేల మందిని చేసుకోగలడు. కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగువాడిగా ఏక పత్నీ వ్రతం.. మన మతం. ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో సంసారం చేయడం అన్నది మన సంప్రదాయం. ఆ సంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్” అంటూ ఒక టీవీ ఛానెల్ చర్చలో విరుచుకుపడ్డారు దువ్వాడ శ్రీనివాస్.
కట్ చేస్తే ఇప్పుడు దువ్వాడ రెండో పెళ్లి వ్యవహారం ఇప్పుడు రచ్చ రచ్చ అవుతోంది. శ్రీనివాస్ కొంత కాలంగా మొదటి భార్యను విడిచిపెట్టి రెండో భార్యతోనే ఉంటున్నాడట. తమకు అన్యాయం చేస్తున్నాడంటూ దువ్వాడ మొదటి భార్య కూతుళ్లు రోడ్డు మీదికి వచ్చి నిరసన తెలపడం గమనార్హం. గురువారం రాత్రి వీళ్లు చేపట్టిన ఆందోళనతో దువ్వాడ తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆయన ప్రస్తుతం రెండో భార్యతో ఉంటున్న ఇంటి ముందే వాళ్లు ఆందోళన చేపట్టడంతో వ్యవహారం మీడియాకు ఎక్కింది. రెండో భార్య ఉన్న వ్యక్తి.. ఏకపత్నీ వ్రతం గురించి నీతులు చెబుతూ పవన్ను అన్నేసి మాటలు అన్నాడా అంటూ జనం ఇప్పుడు అవాక్కవుతున్నారు.
This post was last modified on August 9, 2024 12:01 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…