Political News

ప్ర‌జాద‌ర్బార్‌.. చంద్ర‌బాబు షాక‌య్యే ప‌రిస్థితి

టీడీపీ అధినేత చంద్ర‌బాబు షాక‌య్యే ప‌రిస్థితి ఏర్ప‌డింది. పార్టీ కార్యాల‌యంలో రోజూ నిర్వ‌హిస్తున్న ప్ర‌జాద‌ర్బార్‌కు త‌న వంతుగా ఆయ‌న హాజ‌రవుతున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లు పోటెత్తి త‌మ స‌మ‌స్య‌లు విన్న‌విస్తున్నారు. అయితే ప్రజల నుంచి వస్తున్న సమస్యలు చూసి చంద్రబాబు నాయుడు షాక్ అవుతున్నారు. ఎక్కువగా భూములకు సంబంధించిన వివాదాలు భూకబ్జాలకు సంబంధించిన అంశాలు వైసిపి నాయకుల ఆగడాల‌కి సంబంధించిన కేసులు చూసి ఆయన ఏం చేయాలో తెలియని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

నిజానికి ఇన్ని సమస్యలు ఉంటాయని చంద్రబాబు సైతం ఊహించలేదు. ఎక్కడ ప్రజాదర్బార్ పెట్టినా పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. వీటిలో ఎక్కువగా భూములకు సంబంధించిన కేసులో ఉండడం తమ భూములను వైసిపి నాయకులు ఆక్రమించుకున్నారని, పెద్ద ఎత్తున ఆరోపించడం, వీటికి సంబంధించి ఆధారాలు కూడా చూపిస్తున్నారు. అంటే అసలు వైసిపి హయాంలో ఏం జరిగింది అన్న అంశంపై చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఐపీఎస్‌, ఇద్దరు ఐఏఎస్‌ల‌తో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు.

కేవలం భూములు వివాదాలకు సంబంధించిన అంశాలపై పరిష్కారం చూపించేలా ఒక నిర్ణయం తీసుకోవాలని చంద్ర‌బాబు భావిస్తున్నారు. తాజాగా మాజీ సీఎం జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల నియోజకవర్గంలో వైయస్ జగన్ బంధువులే తమ భూమిని ఆక్రమించారంటూ వచ్చిన ఫిర్యాదు చంద్రబాబును ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. నిజానికి వైఎస్ కుటుంబానికి పెట్టని కోటగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో ఇప్పటివరకు ఇలాంటి ఆరోపణ ఎప్పుడూ రాలేదు. అలాంటిది వైసిపి హయాంలో తొలిసారి తమ భూములను ఆక్రమించుకున్నారు అంటూ పులివెందుల నియోజకవర్గానికి చెందిన ఓ మహిళ కన్నీరు మున్నీరు అవుతూ ఆవేదన వ్యక్తం చేయడం చంద్రబాబును కలిచి వేసింది.

దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై ఆయన దృష్టి పెట్టారు. నిజానికి అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఇటువంటి భూ వివాదాల విష‌యంలో వీటిలో జోక్యం చేసుకుంటే ఏం జరుగుతుందనే విషయంపై ప్రభుత్వం ఆలోచనలో పడ్డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం. ఒక్క‌ పులివెందులలోనే కాకుండా కీలకమైన నెల్లూరు అనంతపురం జిల్లాల్లో కూడా ఇదే తరహా కేసులు వెలుగు చూస్తుండడంతో వీటిపై ఏం చేయాలనేది చంద్ర‌బాబుకు ఒక రకంగా తలనొప్పి గానే మారిందని చెప్పాలి. దీంతో చంద్రబాబు ఇలాంటి కేసులు పరిశీలించేందుకు అధికారులను నియ‌మించాలని నిర్ణయం తీసుకున్నారు. మరి ఎంత‌తవరకు పరిష్కారం లభిస్తుందో చూడాలి.

This post was last modified on August 4, 2024 7:31 pm

Share

Recent Posts

బ్రిటిషర్ల తలలతో ‘ రణబాలి’ రక్తాభిషేకం

హిట్టు ఫ్లాపు సంగతి ఎలా ఉన్నా తన సినిమా వస్తోందంటే అభిమానులు, ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి కలిగేలా చేసే విజయ్…

6 minutes ago

ఇప్పటిదాకా ‘మనం’ చూడని సుమంత్

మనం సినిమా అక్కినేని కుటుంబానికి ఎంత ప్రత్యేకమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అందులో మూడు తరాల అక్కినేని హీరోలు…

35 minutes ago

ఎపిక్ క్లైమాక్స్… ప్రేక్షకులను ప్రిపేర్ చేస్తున్న నిర్మాత

ఈ శుక్రవారం విడుదల కానున్న ఎపిక్ సినిమా మీద ప్రేక్షకుల్లో ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. కాకపోతే ఇటీవల…

2 hours ago

నిజం గెలిచింది… నాటి చీకటి రోజులను గుర్తుచేసుకున్న లోకేష్‌

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులో అరెస్టు చేసి నిర్బంధించిన నాటి పరిణామాలను మంత్రి నారా…

3 hours ago

చైతు & దుల్కర్ – లక్కీ ఛాన్స్ కొట్టేశారా?

పెద్ద బడ్జెట్లు ముడిపడిన సినిమాలకు రిలీజ్ డేట్లు లాక్ చేసుకోవడం పెద్ద సవాల్ గా మారిపోయింది. ముందు వెనుక పోటీ…

3 hours ago

చాట్‌ GPT ఆస్ట్రా 6… భయపడుతున్న యువత

AI వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఓపెన్‌ఏఐ తీసుకొచ్చిన GPT-6 ఆస్ట్రా ఆ భయాన్ని మరో…

5 hours ago