Political News

ప్ర‌జాద‌ర్బార్‌.. చంద్ర‌బాబు షాక‌య్యే ప‌రిస్థితి

టీడీపీ అధినేత చంద్ర‌బాబు షాక‌య్యే ప‌రిస్థితి ఏర్ప‌డింది. పార్టీ కార్యాల‌యంలో రోజూ నిర్వ‌హిస్తున్న ప్ర‌జాద‌ర్బార్‌కు త‌న వంతుగా ఆయ‌న హాజ‌రవుతున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లు పోటెత్తి త‌మ స‌మ‌స్య‌లు విన్న‌విస్తున్నారు. అయితే ప్రజల నుంచి వస్తున్న సమస్యలు చూసి చంద్రబాబు నాయుడు షాక్ అవుతున్నారు. ఎక్కువగా భూములకు సంబంధించిన వివాదాలు భూకబ్జాలకు సంబంధించిన అంశాలు వైసిపి నాయకుల ఆగడాల‌కి సంబంధించిన కేసులు చూసి ఆయన ఏం చేయాలో తెలియని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

నిజానికి ఇన్ని సమస్యలు ఉంటాయని చంద్రబాబు సైతం ఊహించలేదు. ఎక్కడ ప్రజాదర్బార్ పెట్టినా పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. వీటిలో ఎక్కువగా భూములకు సంబంధించిన కేసులో ఉండడం తమ భూములను వైసిపి నాయకులు ఆక్రమించుకున్నారని, పెద్ద ఎత్తున ఆరోపించడం, వీటికి సంబంధించి ఆధారాలు కూడా చూపిస్తున్నారు. అంటే అసలు వైసిపి హయాంలో ఏం జరిగింది అన్న అంశంపై చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఐపీఎస్‌, ఇద్దరు ఐఏఎస్‌ల‌తో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు.

కేవలం భూములు వివాదాలకు సంబంధించిన అంశాలపై పరిష్కారం చూపించేలా ఒక నిర్ణయం తీసుకోవాలని చంద్ర‌బాబు భావిస్తున్నారు. తాజాగా మాజీ సీఎం జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల నియోజకవర్గంలో వైయస్ జగన్ బంధువులే తమ భూమిని ఆక్రమించారంటూ వచ్చిన ఫిర్యాదు చంద్రబాబును ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. నిజానికి వైఎస్ కుటుంబానికి పెట్టని కోటగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో ఇప్పటివరకు ఇలాంటి ఆరోపణ ఎప్పుడూ రాలేదు. అలాంటిది వైసిపి హయాంలో తొలిసారి తమ భూములను ఆక్రమించుకున్నారు అంటూ పులివెందుల నియోజకవర్గానికి చెందిన ఓ మహిళ కన్నీరు మున్నీరు అవుతూ ఆవేదన వ్యక్తం చేయడం చంద్రబాబును కలిచి వేసింది.

దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై ఆయన దృష్టి పెట్టారు. నిజానికి అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఇటువంటి భూ వివాదాల విష‌యంలో వీటిలో జోక్యం చేసుకుంటే ఏం జరుగుతుందనే విషయంపై ప్రభుత్వం ఆలోచనలో పడ్డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం. ఒక్క‌ పులివెందులలోనే కాకుండా కీలకమైన నెల్లూరు అనంతపురం జిల్లాల్లో కూడా ఇదే తరహా కేసులు వెలుగు చూస్తుండడంతో వీటిపై ఏం చేయాలనేది చంద్ర‌బాబుకు ఒక రకంగా తలనొప్పి గానే మారిందని చెప్పాలి. దీంతో చంద్రబాబు ఇలాంటి కేసులు పరిశీలించేందుకు అధికారులను నియ‌మించాలని నిర్ణయం తీసుకున్నారు. మరి ఎంత‌తవరకు పరిష్కారం లభిస్తుందో చూడాలి.

This post was last modified on August 4, 2024 7:31 pm

Share
Show comments
Published by
Satya
Tags: Praja darbar

Recent Posts

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

33 minutes ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

2 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

3 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

3 hours ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

4 hours ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

5 hours ago