తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, ఫైర్ బ్రాండ్ మంత్రి సీతక్క తన విశ్వరూపం చూపించారు. తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆమె వరుసగా రెండో రోజు కూడా.. టాక్ ఆఫ్ ది సెషన్గా నిలిచారు. తొలుత బుధవారం సభ ప్రారంభం కాగానే మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్పై విమర్శలు గుప్పించారు. అధికారం కోసం.. హామీలు ఇచ్చింది ఎవరు? వాటిని 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పిందెవరు? అంటూ ప్రవ్నించారు. సన్నాసులు గ్రూప్ టూ వాయిదా వేయమంటున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో జోక్యం చేసుకున్న మంత్రి సీతక్క.. కేటీఆర్పై విరుచుకుపడ్డారు. తాము చెప్పిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తున్నామని.. ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని.. ప్రతిపక్షాలే సంతృప్తిగా లేవని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులు ఓర్పుగా ఉండాలని సూచించారు. ఈ సమయంలోనే పదేళ్ల పాటు ఓయూకు వెళ్లలేని పరిస్థితి తెచ్చుకున్నారని సీతక్క దుయ్యబట్టారు.
పదేళ్లపాటు బీఆర్ ఎస్ అధికారంలో ఉండి కూడా.. ఎందుకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేక పోయిందని సీతక్క ప్రవ్నించారు. ఆశా వర్కర్ల ఉద్యమాన్ని ప్రశ్నిస్తున్నవారు..వారి కుటుంబాల్లోని ముసలివారికి.. పింఛన్లు ఎందుకు తీసేశారని నిప్పులు చెరిగారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారి కుటుంబాలలోని తల్లిదండ్రుల పింఛన్ను కూడా తీసేసింది .. మీరు కాదా? అని కేటీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నలు గుప్పించారు. ధరణి పేరుతో పెద్ద కార్యక్రమం చేపట్టామనిచెప్పుకొనే వారు.. కనీసం పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని అన్నారు.
దీంతో పదే పదే కేటీఆర్ మంత్రి సీతక్క ప్రసంగానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. ఆమె చెబుతున్న లెక్కలన్నీ తప్పులని వ్యాఖ్యానించారు. తమ హయాంలో ఏ ఒక్కరి పింఛను తీసేయలేదన్నారు. దీంతో ఇరు పక్షాల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. అయితే.. స్పీకర్ జోక్యం చేసుకుని ఇరువురినీ శాంతింప చేశారు.
This post was last modified on July 31, 2024 2:54 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…