తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, ఫైర్ బ్రాండ్ మంత్రి సీతక్క తన విశ్వరూపం చూపించారు. తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆమె వరుసగా రెండో రోజు కూడా.. టాక్ ఆఫ్ ది సెషన్గా నిలిచారు. తొలుత బుధవారం సభ ప్రారంభం కాగానే మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్పై విమర్శలు గుప్పించారు. అధికారం కోసం.. హామీలు ఇచ్చింది ఎవరు? వాటిని 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పిందెవరు? అంటూ ప్రవ్నించారు. సన్నాసులు గ్రూప్ టూ వాయిదా వేయమంటున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో జోక్యం చేసుకున్న మంత్రి సీతక్క.. కేటీఆర్పై విరుచుకుపడ్డారు. తాము చెప్పిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తున్నామని.. ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని.. ప్రతిపక్షాలే సంతృప్తిగా లేవని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులు ఓర్పుగా ఉండాలని సూచించారు. ఈ సమయంలోనే పదేళ్ల పాటు ఓయూకు వెళ్లలేని పరిస్థితి తెచ్చుకున్నారని సీతక్క దుయ్యబట్టారు.
పదేళ్లపాటు బీఆర్ ఎస్ అధికారంలో ఉండి కూడా.. ఎందుకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేక పోయిందని సీతక్క ప్రవ్నించారు. ఆశా వర్కర్ల ఉద్యమాన్ని ప్రశ్నిస్తున్నవారు..వారి కుటుంబాల్లోని ముసలివారికి.. పింఛన్లు ఎందుకు తీసేశారని నిప్పులు చెరిగారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారి కుటుంబాలలోని తల్లిదండ్రుల పింఛన్ను కూడా తీసేసింది .. మీరు కాదా? అని కేటీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నలు గుప్పించారు. ధరణి పేరుతో పెద్ద కార్యక్రమం చేపట్టామనిచెప్పుకొనే వారు.. కనీసం పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని అన్నారు.
దీంతో పదే పదే కేటీఆర్ మంత్రి సీతక్క ప్రసంగానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. ఆమె చెబుతున్న లెక్కలన్నీ తప్పులని వ్యాఖ్యానించారు. తమ హయాంలో ఏ ఒక్కరి పింఛను తీసేయలేదన్నారు. దీంతో ఇరు పక్షాల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. అయితే.. స్పీకర్ జోక్యం చేసుకుని ఇరువురినీ శాంతింప చేశారు.
ఇటీవల టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్లో పెద్ద గొడవ జరిగి అది మీడియా దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఈ…
బాలీవుడ్ చిత్రాలతో పోలిస్తే సౌత్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదన్నట్లు.. వాళ్ల పనికి సరైన కాంప్లిమెంట్స్ రావన్నట్లు…
గత నెలలో విడుదలైన సమంత కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ థియేటర్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఏకంగా…
భారత దేశ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ తో విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన దీక్ష…
ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. గత ఎన్నికలకు ముందు వైసీపీ హయాంలో రాష్ట్రం…
త్వరలో ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలోని ఆశావహులకు అందరికీ పోటీ చేసే అవకాశం కల్పిస్తామని జనసేన ముఖ్య…