తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, ఫైర్ బ్రాండ్ మంత్రి సీతక్క తన విశ్వరూపం చూపించారు. తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆమె వరుసగా రెండో రోజు కూడా.. టాక్ ఆఫ్ ది సెషన్గా నిలిచారు. తొలుత బుధవారం సభ ప్రారంభం కాగానే మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్పై విమర్శలు గుప్పించారు. అధికారం కోసం.. హామీలు ఇచ్చింది ఎవరు? వాటిని 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పిందెవరు? అంటూ ప్రవ్నించారు. సన్నాసులు గ్రూప్ టూ వాయిదా వేయమంటున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో జోక్యం చేసుకున్న మంత్రి సీతక్క.. కేటీఆర్పై విరుచుకుపడ్డారు. తాము చెప్పిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తున్నామని.. ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని.. ప్రతిపక్షాలే సంతృప్తిగా లేవని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులు ఓర్పుగా ఉండాలని సూచించారు. ఈ సమయంలోనే పదేళ్ల పాటు ఓయూకు వెళ్లలేని పరిస్థితి తెచ్చుకున్నారని సీతక్క దుయ్యబట్టారు.
పదేళ్లపాటు బీఆర్ ఎస్ అధికారంలో ఉండి కూడా.. ఎందుకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేక పోయిందని సీతక్క ప్రవ్నించారు. ఆశా వర్కర్ల ఉద్యమాన్ని ప్రశ్నిస్తున్నవారు..వారి కుటుంబాల్లోని ముసలివారికి.. పింఛన్లు ఎందుకు తీసేశారని నిప్పులు చెరిగారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారి కుటుంబాలలోని తల్లిదండ్రుల పింఛన్ను కూడా తీసేసింది .. మీరు కాదా? అని కేటీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నలు గుప్పించారు. ధరణి పేరుతో పెద్ద కార్యక్రమం చేపట్టామనిచెప్పుకొనే వారు.. కనీసం పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని అన్నారు.
దీంతో పదే పదే కేటీఆర్ మంత్రి సీతక్క ప్రసంగానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. ఆమె చెబుతున్న లెక్కలన్నీ తప్పులని వ్యాఖ్యానించారు. తమ హయాంలో ఏ ఒక్కరి పింఛను తీసేయలేదన్నారు. దీంతో ఇరు పక్షాల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. అయితే.. స్పీకర్ జోక్యం చేసుకుని ఇరువురినీ శాంతింప చేశారు.
This post was last modified on July 31, 2024 2:54 pm
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…