Political News

ప్ర‌హ‌రీ గోడ వ‌ర్సెస్ సాయిరెడ్డి కుమార్తె.. అస‌లేంటీ స్టోరీ!

గ‌త వారం రోజులుగా వైసీపీ కీల‌క నాయ‌కుడు, రాజ్య‌స‌భ ఎంపీ సాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డి పేరు మీడియాలో వ‌స్తోంది. దీనికి కార‌ణం.. విశాఖ జిల్లాలోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతం భీమిలి బీచ్ వద్ద సముద్ర తీరానికి అతి సమీపంలో నిర్మించిన కాంక్రీట్ ప్రహరీ. దీనిని కూల్చివేయాల‌న్న‌ది.. జ‌న‌సేన కార్పొరేట‌ర్ పీత‌ల మూర్తి డిమాండ్‌. అయితే.. తాము ఎలాంటి నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌లేద‌న్న‌ది నేహా త‌ర‌ఫు వాద న‌. దీంతో అస‌లు ఇది ఎలా వివాదం అయింద‌నేది ప్ర‌శ్న‌.

వైసీపీ అధికారంలో ఉండ‌గా.. విజ‌య‌సాయిరెడ్డి కుటుంబ స‌భ్యులు విశాఖ‌లో త‌మ వ్యాపారాల‌ను విస్త‌రిం చుకున్నారు. ఈ క్ర‌మంలోనే భీమిలి ప‌ర్యాట‌క ప్రాంతానికి స‌మీపంలో నేహా రెడ్డి ఓ అంత‌ర్జాతీయ‌ స్పా సెంట‌ర్ నిర్మించుకున్నారు. కార్య‌క‌లాపాలు కూడా ప్రారంభ‌మ‌య్యాయి. దీనికి వైసీపీ స‌ర్కారు అనుమ‌తి ఇచ్చింది. అయితే.. ఇది స‌ముద్ర‌తీరానికి అతి స‌మీపంలో ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ 12 అడుగుల ఎత్తుతో భారీ ప్ర‌హ‌రీని నిర్మించేందుకు నేహా సిద్ధ‌మ‌య్యారు.

దీనికి ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు అవ‌స‌రం. ఇదే విధంగా జీవీఎంసీ అనుమ‌తులు కూడా అస‌వ‌రం. అప్పట్లో వైసీపీనే జీవీఎంసీలో ఉంది క‌నుక‌.. వాటికి అనుమ‌తులు వ‌చ్చాయి. కానీ, ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు రాలేదు. దీనికి ఆమె ద‌ర‌ఖాస్తు చేశారో..లేదో కూడా తెలియ‌దు. ఈ నిర్మాణం.. వైసీపీ హ‌యాంలో గ‌త ఏడాదే ప్రారంభ‌మైంది. కానీ, నిర్మాణం జ‌రుగుతున్న క్రమంలోనే కొన్ని అవాంత‌రాల‌తో ఆల‌స్య‌మైంది. ఇక‌, ఆ త‌ర్వాత‌.. అప్ప‌ట్లోనే పీత‌ల మూర్తి.. దీనిని విభేదిస్తూ.. పార్టీ నాయ‌కుల‌కు ఫిర్యాదులు చేశారు.

అప్ప‌ట్లో సంగ‌తి ఎలా ఉన్నా.. పార్టీ అధికారంలోకి వ‌చ్చాక‌.. పీత‌ల మూర్తి హైకోర్టును ఆశ్ర‌యించి.. క‌ట్ట‌డాన్ని కూల్చేయాల‌ని కోరారు. దీనిని విచారించిన‌.. అప్ప‌టి ధ‌ర్మాస‌నం.. నిర్మాణాలను నిలుపుదల చేస్తూ, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని సూచిస్తూ.. ఆదేశించింది. అంతేకాదు.. జీవీఎంసీ అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది. దీంతో ఈ నిర్మాణాన్ని కూల్చేసేందుకు.. అధికారులు రెడీ అయ్యారు. కానీ, దీనికి జీవీఎంసీ అధికారులు అనుమ‌తి ఇచ్చార‌ని.. కాబ‌ట్టి తాను ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని పేర్కొంటూ.. మ‌రోసారి నేహా రెడ్డి కోర్టుకు వెళ్లారు.

అయితే.. దీనిని విచారించేందుకు ధ‌ర్మాస‌నం నిరాక‌రిస్తూ.. సింగిల్ జ‌డ్జి వ‌ద్దేతేల్చుకోవాల‌ని చెప్పింది. ఈ ప‌రిణామాల‌తో నేహా రెడ్డి మరోసారి సింగిల్ జ‌డ్జిని అప్రోచ్ అయ్యారు. ఆయ‌నేమో… త‌న చేతిలో ఏమీ లేద‌ని..గ‌తంలో నిర్మాణాల విష‌యంలో ధ‌ర్మాస‌నం ఆదేశాలు ఇచ్చింది కాబ‌ట్టి.. నేనే మ‌ధ్యంతర ఉత్త‌ర్వులు ఇవ్వ‌లేన‌న్నారు. మ‌రోవైపు.. అధికారులు కూల్చివేత కార్య‌క్ర‌మాల‌కు రెడీ అయ్యారు. కానీ, హైకోర్టులో అటు ధ‌ర్మాసనం, ఇటు సింగిల్ జ‌డ్జి వ‌ద్ద తాను పిటిష‌న్లు వేశానంటూ.. నేహారెడ్డి చెబుతున్నారు. ఫ‌లితంగా ఈ వ్య‌వ‌హారం ఎటూ తేల‌క‌పోగా.. రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది.

Satya

Recent Posts

నైజామ్ టికెట్ రేట్లు… ఎడతెగని టెన్షన్లు

పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…

1 hour ago

బడ్జెట్ బయటికి చెప్పడం రిస్కంటారా

మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…

2 hours ago

మాటల్లో రాజీ లేదు.. చేతల్లో ఆలస్యం కాదు..

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…

3 hours ago

బాడీగార్డ్ గురించి ఓపెన్ అయిన చ‌ర‌ణ్‌

త‌న కొత్త సినిమా పెద్ది ప్ర‌మోష‌న్లలో భాగంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డికి వెళ్లినా… ఆయ‌న వెంట…

6 hours ago

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

11 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

12 hours ago