Political News

ప్ర‌హ‌రీ గోడ వ‌ర్సెస్ సాయిరెడ్డి కుమార్తె.. అస‌లేంటీ స్టోరీ!

గ‌త వారం రోజులుగా వైసీపీ కీల‌క నాయ‌కుడు, రాజ్య‌స‌భ ఎంపీ సాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డి పేరు మీడియాలో వ‌స్తోంది. దీనికి కార‌ణం.. విశాఖ జిల్లాలోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతం భీమిలి బీచ్ వద్ద సముద్ర తీరానికి అతి సమీపంలో నిర్మించిన కాంక్రీట్ ప్రహరీ. దీనిని కూల్చివేయాల‌న్న‌ది.. జ‌న‌సేన కార్పొరేట‌ర్ పీత‌ల మూర్తి డిమాండ్‌. అయితే.. తాము ఎలాంటి నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌లేద‌న్న‌ది నేహా త‌ర‌ఫు వాద న‌. దీంతో అస‌లు ఇది ఎలా వివాదం అయింద‌నేది ప్ర‌శ్న‌.

వైసీపీ అధికారంలో ఉండ‌గా.. విజ‌య‌సాయిరెడ్డి కుటుంబ స‌భ్యులు విశాఖ‌లో త‌మ వ్యాపారాల‌ను విస్త‌రిం చుకున్నారు. ఈ క్ర‌మంలోనే భీమిలి ప‌ర్యాట‌క ప్రాంతానికి స‌మీపంలో నేహా రెడ్డి ఓ అంత‌ర్జాతీయ‌ స్పా సెంట‌ర్ నిర్మించుకున్నారు. కార్య‌క‌లాపాలు కూడా ప్రారంభ‌మ‌య్యాయి. దీనికి వైసీపీ స‌ర్కారు అనుమ‌తి ఇచ్చింది. అయితే.. ఇది స‌ముద్ర‌తీరానికి అతి స‌మీపంలో ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ 12 అడుగుల ఎత్తుతో భారీ ప్ర‌హ‌రీని నిర్మించేందుకు నేహా సిద్ధ‌మ‌య్యారు.

దీనికి ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు అవ‌స‌రం. ఇదే విధంగా జీవీఎంసీ అనుమ‌తులు కూడా అస‌వ‌రం. అప్పట్లో వైసీపీనే జీవీఎంసీలో ఉంది క‌నుక‌.. వాటికి అనుమ‌తులు వ‌చ్చాయి. కానీ, ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు రాలేదు. దీనికి ఆమె ద‌ర‌ఖాస్తు చేశారో..లేదో కూడా తెలియ‌దు. ఈ నిర్మాణం.. వైసీపీ హ‌యాంలో గ‌త ఏడాదే ప్రారంభ‌మైంది. కానీ, నిర్మాణం జ‌రుగుతున్న క్రమంలోనే కొన్ని అవాంత‌రాల‌తో ఆల‌స్య‌మైంది. ఇక‌, ఆ త‌ర్వాత‌.. అప్ప‌ట్లోనే పీత‌ల మూర్తి.. దీనిని విభేదిస్తూ.. పార్టీ నాయ‌కుల‌కు ఫిర్యాదులు చేశారు.

అప్ప‌ట్లో సంగ‌తి ఎలా ఉన్నా.. పార్టీ అధికారంలోకి వ‌చ్చాక‌.. పీత‌ల మూర్తి హైకోర్టును ఆశ్ర‌యించి.. క‌ట్ట‌డాన్ని కూల్చేయాల‌ని కోరారు. దీనిని విచారించిన‌.. అప్ప‌టి ధ‌ర్మాస‌నం.. నిర్మాణాలను నిలుపుదల చేస్తూ, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని సూచిస్తూ.. ఆదేశించింది. అంతేకాదు.. జీవీఎంసీ అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది. దీంతో ఈ నిర్మాణాన్ని కూల్చేసేందుకు.. అధికారులు రెడీ అయ్యారు. కానీ, దీనికి జీవీఎంసీ అధికారులు అనుమ‌తి ఇచ్చార‌ని.. కాబ‌ట్టి తాను ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని పేర్కొంటూ.. మ‌రోసారి నేహా రెడ్డి కోర్టుకు వెళ్లారు.

అయితే.. దీనిని విచారించేందుకు ధ‌ర్మాస‌నం నిరాక‌రిస్తూ.. సింగిల్ జ‌డ్జి వ‌ద్దేతేల్చుకోవాల‌ని చెప్పింది. ఈ ప‌రిణామాల‌తో నేహా రెడ్డి మరోసారి సింగిల్ జ‌డ్జిని అప్రోచ్ అయ్యారు. ఆయ‌నేమో… త‌న చేతిలో ఏమీ లేద‌ని..గ‌తంలో నిర్మాణాల విష‌యంలో ధ‌ర్మాస‌నం ఆదేశాలు ఇచ్చింది కాబ‌ట్టి.. నేనే మ‌ధ్యంతర ఉత్త‌ర్వులు ఇవ్వ‌లేన‌న్నారు. మ‌రోవైపు.. అధికారులు కూల్చివేత కార్య‌క్ర‌మాల‌కు రెడీ అయ్యారు. కానీ, హైకోర్టులో అటు ధ‌ర్మాసనం, ఇటు సింగిల్ జ‌డ్జి వ‌ద్ద తాను పిటిష‌న్లు వేశానంటూ.. నేహారెడ్డి చెబుతున్నారు. ఫ‌లితంగా ఈ వ్య‌వ‌హారం ఎటూ తేల‌క‌పోగా.. రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది.

Satya

Recent Posts

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

46 minutes ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

48 minutes ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

1 hour ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

2 hours ago

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

3 hours ago

చిరు లీక్ చేశాడు… నందిని కన్ఫమ్ చేసింది

మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్‌ను అనుకోకుండా రివీల్…

4 hours ago