వైఎస్ విజయమ్మతో టీడీపీ సీనియర్ నాయకుడు, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్.. జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా హైదరాబాద్లో భేటీ అయ్యారు. ఉరుములు లేని పిడుగు మాదిరిగా.. జరిగిన ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం జేసీ కుటుంబం టీడీపీలోనే ఉంది. పైగా జేసీ కుమారుడు అస్మిత్రెడ్డి టీడీపీ తరఫున విజయం సాధించారు. ఇక, విజయమ్మ తటస్థంగా ఉన్నారనే విషయం తెలిసిందే. అటుకుమారుడు, ఇటు కుమార్తె షర్మిలకు ఆమె తటస్థంగానే వ్యవహరిస్తున్నారు.
ఇలాంటి సమయంలో అనూహ్యంగా జేసీ కలుసుకోవడం.. కేవలం విజయమ్మ ఆరోగ్యం గురించే తాను వాకబు చేసినట్టు చెప్పడం.. గమనార్హం. హైదరాబాద్లో ఉంటున్న విజయమ్మను సోమవారం ఉదయమే .. జేసీ కలుసుకున్నారు. ఆమెతో సుమారు గంటకుపైనే చర్చలు జరిపారు. ఊరక రారు.. అన్నట్టుగా విజయమ్మ ఆరోగ్యం కోసమే అయి ఉంటే.. జేసీ ఇప్పటికిప్పుడు పనిగట్టుకుని అనంతపురం నుంచి హైదరాబాద్కు వచ్చేంత సీన్ లేదు. ఇది స్పష్టం.
అయితే.. జేసీ దివాకర్రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి సతీమణికి, విజయమ్మ కుటుంబానికి బంధుత్వం ఉంది. అందుకే.. ఆమెను పలకరించేందుకు వచ్చారని జేసీ వర్గం ప్రచారం చేస్తోంది. అయితే… వైఎస్ ఉన్నంతకాలం జేసీలు కాంగ్రెస్ లోనే ఉన్నారు. మంత్రి పదవి ఇవ్వకపోయినా మారలేదు. జగన్ తో చెడినా… విజయమ్మతో అప్పటి పరిచయం అలాగే ఉన్న నేపథ్యంలో మర్యాదపూర్వకంగా కలిసి ఉండొచ్చు.
This post was last modified on July 29, 2024 4:36 pm
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…