Political News

విజ‌య‌మ్మ‌తో జేసీ భేటీ.. విష‌యం ఏంటి?

వైఎస్ విజ‌య‌మ్మ‌తో టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, తాడిప‌త్రి మునిసిప‌ల్ చైర్మ‌న్‌.. జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి తాజాగా హైద‌రాబాద్‌లో భేటీ అయ్యారు. ఉరుములు లేని పిడుగు మాదిరిగా.. జ‌రిగిన ఈ స‌మావేశం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ప్ర‌స్తుతం జేసీ కుటుంబం టీడీపీలోనే ఉంది. పైగా జేసీ కుమారుడు అస్మిత్‌రెడ్డి టీడీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించారు. ఇక‌, విజ‌య‌మ్మ త‌ట‌స్థంగా ఉన్నార‌నే విష‌యం తెలిసిందే. అటుకుమారుడు, ఇటు కుమార్తె ష‌ర్మిల‌కు ఆమె త‌ట‌స్థంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇలాంటి స‌మ‌యంలో అనూహ్యంగా జేసీ క‌లుసుకోవ‌డం.. కేవ‌లం విజ‌య‌మ్మ ఆరోగ్యం గురించే తాను వాక‌బు చేసిన‌ట్టు చెప్ప‌డం.. గ‌మ‌నార్హం. హైద‌రాబాద్‌లో ఉంటున్న విజ‌య‌మ్మ‌ను సోమ‌వారం ఉద‌య‌మే .. జేసీ క‌లుసుకున్నారు. ఆమెతో సుమారు గంట‌కుపైనే చ‌ర్చ‌లు జ‌రిపారు. ఊర‌క రారు.. అన్న‌ట్టుగా విజ‌య‌మ్మ ఆరోగ్యం కోస‌మే అయి ఉంటే.. జేసీ ఇప్ప‌టికిప్పుడు ప‌నిగ‌ట్టుకుని అనంత‌పురం నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చేంత సీన్ లేదు. ఇది స్ప‌ష్టం.

అయితే.. జేసీ దివాక‌ర్‌రెడ్డి కుమారుడు ప‌వ‌న్ రెడ్డి స‌తీమ‌ణికి, విజ‌య‌మ్మ కుటుంబానికి బంధుత్వం ఉంది. అందుకే.. ఆమెను ప‌ల‌క‌రించేందుకు వ‌చ్చార‌ని జేసీ వ‌ర్గం ప్ర‌చారం చేస్తోంది. అయితే… వైఎస్ ఉన్నంతకాలం జేసీలు కాంగ్రెస్ లోనే ఉన్నారు. మంత్రి పదవి ఇవ్వకపోయినా మారలేదు. జగన్ తో చెడినా… విజయమ్మతో అప్పటి పరిచయం అలాగే ఉన్న నేపథ్యంలో మర్యాదపూర్వకంగా కలిసి ఉండొచ్చు.

This post was last modified on July 29, 2024 4:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పాలన మీద చంద్రబాబు పట్టు కోల్పోయారా?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటిసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టలేదు. ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన.. పాలనా పరంగా…

15 mins ago

హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ పై నైట్ ఫ్రాంక్ రిపోర్టు చదివారా?

హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. గతానికి భిన్నంగా దేశంలోని మెట్రోపాలిటిన్ నగరాల్లో కొన్నింటిని మించిపోయిన భాగ్యనగరి.. మరికొన్ని మహానగరాల దూకుడుకు ఏ…

4 hours ago

వ‌లంటీర్లు-స‌చివాల‌యాల‌పై ఏపీ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం

రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన రెండు కీల‌క వ్య‌వ‌స్థ‌ల‌ను ప్ర‌భుత్వ శాఖ‌ల్లో క‌లిపేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. జ‌గ‌న్ హ‌యాంలో…

7 hours ago

అపార్టుమెంట్ పార్కింగ్ ఇష్యూ సుప్రీం వరకు వెళ్లింది

ఒక అపార్టుమెంట్ లోని పార్కింగ్ వద్ద చోటు చేసుకున్న పంచాయితీ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లటం…

8 hours ago

స్పిరిట్ కోసం క్రేజీ విలన్ జంట ?

దేవర పార్ట్ 1 విడుదల కోసం అభిమానులతో సమానంగా విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఆతృతగా ఎదురు…

8 hours ago

`10 టు 10`.. ఇదీ ఏపీ లిక్క‌ర్ పాల‌సీ!

ఏపీలో చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం నూత‌న మ‌ద్యం విధానాన్ని తీసుకువ‌స్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా జ‌రిగిన మంత్రి వ‌ర్గ…

10 hours ago