Political News

అనంత వైసీపీలో క‌ల‌కలం.. నేత‌లు ప‌రార్‌…!

అనంతపురం వైసీపీలో తీవ్ర రాజకీయ రగడ చోటుచేసుకుంది. నాయకులు ఎవరూ కనిపించడం లేదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎన్నికల అనంతరం ముఖ్యంగా ఫలితాలు వచ్చిన తర్వాత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఒక్కరు మాత్రమే రెండు మూడుసార్లు మీడియా ముందుకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి తప్పుల‌ని ఎత్తిచూపించారు. తమవల్ల కొన్ని పొరపాట్లు జరిగాయని, అధికారులు తమను పక్కదారి పట్టించారని దీనివల్ల ప్రభుత్వానికి ప్రజలకు మధ్య గ్యాప్ ఏర్పడిందని చెప్పారు.

తాము కూడా నియోజకవర్గంలో ఏమి చేయలేని పరిస్థితి వచ్చిందని వెంకట్రామిరెడ్డి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కూడా కొన్ని ఆన్లైన్ ఛానల్ల‌లో ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. మొత్తంగా ఆయన తప్ప వైసీపీలో ఇంకెవరు బయటకు రాలేదు. కనీసం మాట్లాడలేదు. ఇప్పటికీ 50 రోజులు గడిచిపోయింది. మరోవైపు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన సోదరులపై ఇప్పటికే కొన్ని కేసులు నమోదయ్యాయి. తాజాగా జ‌రిగిన‌ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ విషయాలను సీఎం చంద్రబాబు దృష్టికి ప్రస్తుత ఎమ్మెల్యే పరిటాల సునీత తీసుకువ‌చ్చారు.

వాటిపై సాధ్యమైనంత వేగంగా చర్యలు తీసుకోవాలని కోరడం ఆయన కూడా అనంతపురం విషయాన్ని స్పెషల్ గా చూస్తున్నాన‌ని.. అనంతపురంలో అనంతమైన అక్రమాలు చోటుచేసుకున్నాయని ఏ ఒక్కరిని వదిలిపెట్టనని చెప్పినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పెద్దారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వంటి వారిపై కేసులు నమోదు కాగా మున్ముందు మరింత మందిపై కేసులు పెడతారు అనే చర్చ నడుస్తుంది. మరి దీన్ని ముందుగానే ఊహించారో.. లేకపోతే వైసీపీలో ఉండి నెట్టుకు రావడం చాలా కష్టమని భావించారో తెలియదు కానీ వైసీపీ నాయకులు ఎవరు బయటకు రావట్లేదు.

అసలు అనంతపురంలో వైసిపి ఉందా అంటే కూడా సందేహంగా మారింది. ఆ రకంగా ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. జెండా మోసే నాయకుడు లేడు. పార్టీ వాయిస్ వినిపించిన నాయకులు కూడా లేరు. ఇక ఎన్నికలకు ముందు టిడిపి నుంచి వైసీపీలోకి వచ్చిన కల్యాణదుర్గం నాయకులు తిరిగి మళ్లీ టిడిపి గూటికి చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా పెనుకొండలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నారాయణ కూడా పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అనేక అక్రమాలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.

దీంతో ఆయనపైన విచారణ చేయాలని పెనుకొండ ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు సవిత అంతర్గ‌త‌ చర్చల్లో చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారు. మ‌రోవైపు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ సైతం మౌనంగా ఉంటున్నారు. గతంలో ఆయన చేసిన అశ్లీల వీడియోకి సంబంధించిన వ్యవహారం ఇంకా సర్దుమణ‌గ‌లేదు. దానిపై ఇంకా కేసులు నమోదు అయితే పరిస్థితి ఏంటి అనేది ఒక చర్చగా నడుస్తుంది. సో ఈ పరిణామాలు గమనిస్తే అనంతపురం వైసీపీలో పరిస్థితి దారుణంగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఏ కేసులు ఎప్పుడు పెడతారో తెలియదు అని భావిస్తున్న వైసిపి నాయకులు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.

This post was last modified on July 28, 2024 11:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

గ‌ద్ద‌ర్ అవార్డుల్లో గందరగోళం.. ఏం జరిగింది?

గ‌త ఏడాది ప్ర‌తిష్ఠాత్మ‌కంగా గ‌ద్ద‌ర్ అవార్డుల‌ను మొద‌లుపెట్టిన తెలంగాణ ప్ర‌భుత్వం.. ఒకేసారి చాలా ఏళ్ల‌కు క‌లిపి అవార్డులు ప్ర‌క‌టించిన సంగ‌తి…

2 hours ago

యూత్ హీరోలు రూటు మారుస్తున్నారు

దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…

5 hours ago

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

8 hours ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

9 hours ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

9 hours ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

9 hours ago