Political News

అనంత వైసీపీలో క‌ల‌కలం.. నేత‌లు ప‌రార్‌…!

అనంతపురం వైసీపీలో తీవ్ర రాజకీయ రగడ చోటుచేసుకుంది. నాయకులు ఎవరూ కనిపించడం లేదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎన్నికల అనంతరం ముఖ్యంగా ఫలితాలు వచ్చిన తర్వాత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఒక్కరు మాత్రమే రెండు మూడుసార్లు మీడియా ముందుకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి తప్పుల‌ని ఎత్తిచూపించారు. తమవల్ల కొన్ని పొరపాట్లు జరిగాయని, అధికారులు తమను పక్కదారి పట్టించారని దీనివల్ల ప్రభుత్వానికి ప్రజలకు మధ్య గ్యాప్ ఏర్పడిందని చెప్పారు.

తాము కూడా నియోజకవర్గంలో ఏమి చేయలేని పరిస్థితి వచ్చిందని వెంకట్రామిరెడ్డి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కూడా కొన్ని ఆన్లైన్ ఛానల్ల‌లో ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. మొత్తంగా ఆయన తప్ప వైసీపీలో ఇంకెవరు బయటకు రాలేదు. కనీసం మాట్లాడలేదు. ఇప్పటికీ 50 రోజులు గడిచిపోయింది. మరోవైపు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన సోదరులపై ఇప్పటికే కొన్ని కేసులు నమోదయ్యాయి. తాజాగా జ‌రిగిన‌ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ విషయాలను సీఎం చంద్రబాబు దృష్టికి ప్రస్తుత ఎమ్మెల్యే పరిటాల సునీత తీసుకువ‌చ్చారు.

వాటిపై సాధ్యమైనంత వేగంగా చర్యలు తీసుకోవాలని కోరడం ఆయన కూడా అనంతపురం విషయాన్ని స్పెషల్ గా చూస్తున్నాన‌ని.. అనంతపురంలో అనంతమైన అక్రమాలు చోటుచేసుకున్నాయని ఏ ఒక్కరిని వదిలిపెట్టనని చెప్పినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పెద్దారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వంటి వారిపై కేసులు నమోదు కాగా మున్ముందు మరింత మందిపై కేసులు పెడతారు అనే చర్చ నడుస్తుంది. మరి దీన్ని ముందుగానే ఊహించారో.. లేకపోతే వైసీపీలో ఉండి నెట్టుకు రావడం చాలా కష్టమని భావించారో తెలియదు కానీ వైసీపీ నాయకులు ఎవరు బయటకు రావట్లేదు.

అసలు అనంతపురంలో వైసిపి ఉందా అంటే కూడా సందేహంగా మారింది. ఆ రకంగా ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. జెండా మోసే నాయకుడు లేడు. పార్టీ వాయిస్ వినిపించిన నాయకులు కూడా లేరు. ఇక ఎన్నికలకు ముందు టిడిపి నుంచి వైసీపీలోకి వచ్చిన కల్యాణదుర్గం నాయకులు తిరిగి మళ్లీ టిడిపి గూటికి చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా పెనుకొండలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నారాయణ కూడా పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అనేక అక్రమాలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.

దీంతో ఆయనపైన విచారణ చేయాలని పెనుకొండ ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు సవిత అంతర్గ‌త‌ చర్చల్లో చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారు. మ‌రోవైపు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ సైతం మౌనంగా ఉంటున్నారు. గతంలో ఆయన చేసిన అశ్లీల వీడియోకి సంబంధించిన వ్యవహారం ఇంకా సర్దుమణ‌గ‌లేదు. దానిపై ఇంకా కేసులు నమోదు అయితే పరిస్థితి ఏంటి అనేది ఒక చర్చగా నడుస్తుంది. సో ఈ పరిణామాలు గమనిస్తే అనంతపురం వైసీపీలో పరిస్థితి దారుణంగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఏ కేసులు ఎప్పుడు పెడతారో తెలియదు అని భావిస్తున్న వైసిపి నాయకులు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.

Satya

Recent Posts

కంబ్యాక్ హీరోని రిసీవ్ చేసుకున్నారా

దశాబ్ద కాలం పైగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న హీరో వడ్డే నవీన్ తనే నిర్మాతగా మారి ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులుతో…

2 hours ago

నితిన్ సినిమా నుంచి హీరోయిన్ ఔట్?

టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్ చివరగా ఎప్పుడు హిట్టు కొట్టాడో తన అభిమానులకు కూడా సరిగా గుర్తుండకపోవచ్చు. ‘భీష్మ’ తర్వాత…

2 hours ago

పెద్దికి రెచ్చిపోయి ఇప్పుడు దొరికిపోయారు

సినిమా ఇండస్ట్రీలో నార్త్ వర్సెస్ సౌత్ గొడవ ఎప్పటినుంచో నడుస్తున్నదే. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా, అక్కడి జనాలు సౌత్ సినిమాలపై…

3 hours ago

నీట్ పరీక్ష రాయాలంటే అబుదాబీకి వెళ్లాలా?

నీట్ పరీక్ష పెద్ద ప్రహసనంగా మారింది. పరీక్ష నిర్వహణలో రోజుకో వివాదం తలెత్తుతోంది. రీ నీట్ పరీక్షకు సంబంధించి హాల్…

4 hours ago

బండి భగీరథ్ కు బెయిల్

పోక్సో కేసులో అరెస్టైన బండి భగరీథ్‌కు మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. భగీరథ్‌ను పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు…

4 hours ago

ఎవరయ్యా ఈ సమంత ఫ్రెండు…

నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా ఇంటి బంగారం ట్రేడ్ పండిట్ల అంచనాలను మించి బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ఈ…

5 hours ago