Political News

అనంత వైసీపీలో క‌ల‌కలం.. నేత‌లు ప‌రార్‌…!

అనంతపురం వైసీపీలో తీవ్ర రాజకీయ రగడ చోటుచేసుకుంది. నాయకులు ఎవరూ కనిపించడం లేదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎన్నికల అనంతరం ముఖ్యంగా ఫలితాలు వచ్చిన తర్వాత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఒక్కరు మాత్రమే రెండు మూడుసార్లు మీడియా ముందుకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి తప్పుల‌ని ఎత్తిచూపించారు. తమవల్ల కొన్ని పొరపాట్లు జరిగాయని, అధికారులు తమను పక్కదారి పట్టించారని దీనివల్ల ప్రభుత్వానికి ప్రజలకు మధ్య గ్యాప్ ఏర్పడిందని చెప్పారు.

తాము కూడా నియోజకవర్గంలో ఏమి చేయలేని పరిస్థితి వచ్చిందని వెంకట్రామిరెడ్డి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కూడా కొన్ని ఆన్లైన్ ఛానల్ల‌లో ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. మొత్తంగా ఆయన తప్ప వైసీపీలో ఇంకెవరు బయటకు రాలేదు. కనీసం మాట్లాడలేదు. ఇప్పటికీ 50 రోజులు గడిచిపోయింది. మరోవైపు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన సోదరులపై ఇప్పటికే కొన్ని కేసులు నమోదయ్యాయి. తాజాగా జ‌రిగిన‌ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ విషయాలను సీఎం చంద్రబాబు దృష్టికి ప్రస్తుత ఎమ్మెల్యే పరిటాల సునీత తీసుకువ‌చ్చారు.

వాటిపై సాధ్యమైనంత వేగంగా చర్యలు తీసుకోవాలని కోరడం ఆయన కూడా అనంతపురం విషయాన్ని స్పెషల్ గా చూస్తున్నాన‌ని.. అనంతపురంలో అనంతమైన అక్రమాలు చోటుచేసుకున్నాయని ఏ ఒక్కరిని వదిలిపెట్టనని చెప్పినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పెద్దారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వంటి వారిపై కేసులు నమోదు కాగా మున్ముందు మరింత మందిపై కేసులు పెడతారు అనే చర్చ నడుస్తుంది. మరి దీన్ని ముందుగానే ఊహించారో.. లేకపోతే వైసీపీలో ఉండి నెట్టుకు రావడం చాలా కష్టమని భావించారో తెలియదు కానీ వైసీపీ నాయకులు ఎవరు బయటకు రావట్లేదు.

అసలు అనంతపురంలో వైసిపి ఉందా అంటే కూడా సందేహంగా మారింది. ఆ రకంగా ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. జెండా మోసే నాయకుడు లేడు. పార్టీ వాయిస్ వినిపించిన నాయకులు కూడా లేరు. ఇక ఎన్నికలకు ముందు టిడిపి నుంచి వైసీపీలోకి వచ్చిన కల్యాణదుర్గం నాయకులు తిరిగి మళ్లీ టిడిపి గూటికి చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా పెనుకొండలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నారాయణ కూడా పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అనేక అక్రమాలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.

దీంతో ఆయనపైన విచారణ చేయాలని పెనుకొండ ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు సవిత అంతర్గ‌త‌ చర్చల్లో చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారు. మ‌రోవైపు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ సైతం మౌనంగా ఉంటున్నారు. గతంలో ఆయన చేసిన అశ్లీల వీడియోకి సంబంధించిన వ్యవహారం ఇంకా సర్దుమణ‌గ‌లేదు. దానిపై ఇంకా కేసులు నమోదు అయితే పరిస్థితి ఏంటి అనేది ఒక చర్చగా నడుస్తుంది. సో ఈ పరిణామాలు గమనిస్తే అనంతపురం వైసీపీలో పరిస్థితి దారుణంగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఏ కేసులు ఎప్పుడు పెడతారో తెలియదు అని భావిస్తున్న వైసిపి నాయకులు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.

This post was last modified on July 28, 2024 11:18 am

Share

Recent Posts

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

1 hour ago

ర‌వితేజ‌కు పుత్రికోత్సాహం

స్టార్ హీరోల కుటుంబాల నుంచి అబ్బాయిలు హీరోలుగా మార‌డం మామూలే. అమ్మాయిలు మాత్రం హీరోయిన్లు కావ‌డం అరుదు. ఐతే సినీ…

2 hours ago

అర్జున్ రెడ్డిని ఆదుకున్న మామిడి తోట‌

న‌టుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ద‌ర్శ‌కుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్ల‌ను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్ట‌ర్ అనే…

5 hours ago

ఆర్జీవీకి శివ నిర్వాణ కూలర్ బాయ్

ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…

7 hours ago

ఎట్ట‌కేల‌కు తెలుగులో తొలి హిట్టు

త‌మిళంలో పెద్ద స్టార్‌గా ఎదిగిన‌ శివ కార్తికేయ‌న్ లాగే టీవీ రంగం నుంచి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన అమ్మాయి ప్రియ భ‌వానీ…

8 hours ago

చిరంజీవి ఎవ‌రినీ తొక్క‌డ‌య్యా…

తెలుగులో తెర మీద హీరోల‌కు ఎలివేష‌న్లు ఇవ్వ‌డంలో చాలామంది ద‌ర్శ‌కులు త‌మ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదిక‌ల మీద ఎలివేష‌న్లు…

9 hours ago