Political News

బాబుకు 20 నిమిషాలు ఇచ్చారు.. నాకెందుకివ్వ‌రు: మ‌మ‌త

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అధ్య‌క్ష‌తన శ‌నివారం రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో నీతి ఆయోగ్ భేటీ ప్రారంభైంది. దీనిని కొన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు బ‌హిష్క‌రించారు. అయితే.. ఈ స‌మావేశంలో ప్ర‌ధాని మోడీని గ‌ట్టిగా నిల‌దీయాల‌న్న ల‌క్ష్యంతో వ‌చ్చిన ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ.. అనూహ్యంలోనే స‌మావేశం మ‌ధ్య‌లోనే బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. దీనిపై అంద‌రూ విస్మ‌యం చేశారు. అయితే.. ప్ర‌ధాని మోడీ మాత్రం మౌనంగా ఉన్నారు.

ఏం జ‌రిగింది?

విక‌సిత భార‌త్-2047 థీమ్‌తో నిర్వ‌హించిన నీతి ఆయోగ్ భేటీలో ముందు ప్ర‌దాని మాట్లాడారు. త‌ర్వాత‌.. అక్ష‌ర క్ర‌మంలో తొలి రాష్ట్ర‌మైన ఏపీకిఅవ‌కాశం వ‌చ్చింది. దీంతో ఏపీ సీఎం చంద్ర‌బాబు మాట్లాడారు. అనేక అంశాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. ఆ త‌ర్వాత అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ సీఎం, త‌ర్వాత‌.. అస్సాం.. ఆ త‌ర్వాత‌.. బెంగాల్ సీఎం మ‌మ‌త‌కు అవ‌కాశం ల‌భించింది. అప్ప‌టి వ‌ర‌కు మాట్లాడిన సీఎంలు .. వారివారి స‌మస్య‌ల‌ను విక‌సిత భార‌త్ ల‌క్ష్యాల‌ను ఎలా ముందుకు తీసుకువెళ్లేదీ కూడా వివ‌రించారు.

అయితే.. మ‌మ‌త వంతు వ‌చ్చే స‌రికి.. ఆమె ప్ర‌స్తుతం ఉన్న నీతిఆయోగ్‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఇదేస‌మయంలో గ‌త ప్ర‌ణాళికా సంఘాన్ని పున‌రుద్ధ‌రించాల‌ని కూడా డిమాండ్ చేశారు. ఇక, బెంగాల్ విభ‌జ‌న‌కు జ‌రుగుతున్న కుట్ర‌ను కేంద్రం ఆపాల‌న్నారు. ఇలా ఆమె అజెండాలో లేని అంశాల‌ను ప్ర‌స్తావించ‌డంతో వెంట‌నే మైక్ క‌ట్ చేశారు. దీంతో మ‌మ‌త ఆగ్ర‌హోద‌గ్రురాల‌య్యారు. చివాల్న సీటులోంచి లేచి.. బ‌య‌ట‌కు వ‌చ్చేశారు.

చంద్ర‌బాబుకు 20 నిమిషాల సేపు మాట్లాడేందుకు అవ‌కాశం ఇచ్చార‌ని.. త‌ను ప్ర‌సంగం ప్రారంభించ‌గానే మైకు క‌ట్ చేశార‌ని.. మ‌మ‌త విమ‌ర్శించారు. నీతి ఆయోగ్ అంటే.. మోడీ నీతులు వినేందుకు రావ‌డ‌మేన‌ని.. ఎద్దేవా చేశారు. త‌మ‌కు అవ‌కాశం లేద‌ని.. త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనే అవ‌కాశం ఇవ్వ‌ర‌ని వ్యాఖ్యానించారు. అందుకే నిర‌స‌న‌గా తాను స‌మావేశాన్ని బాయ్ కాట్ చేశాన‌ని ఆమె వివ‌రించారు. గ‌తంలో త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన జ‌య‌ల‌లిత కూడా.. ఇదేవిధంగా నీతి ఆయోగ్ స‌మావేశం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి మోడీని తిట్టిపోసిన విష‌యం తెలిసిందే. త‌ర్వాత ఆమె అవినీతి కేసులు జోరందుకోవ‌డం.. జైలుకు వెళ్ల‌డం.. త‌ర్వాత బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చి అనారోగ్యంతో క‌న్నుమూయ‌డం తెలిసిందే.

This post was last modified on July 27, 2024 3:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

42 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

1 hour ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago