Political News

బాబుకు 20 నిమిషాలు ఇచ్చారు.. నాకెందుకివ్వ‌రు: మ‌మ‌త

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అధ్య‌క్ష‌తన శ‌నివారం రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో నీతి ఆయోగ్ భేటీ ప్రారంభైంది. దీనిని కొన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు బ‌హిష్క‌రించారు. అయితే.. ఈ స‌మావేశంలో ప్ర‌ధాని మోడీని గ‌ట్టిగా నిల‌దీయాల‌న్న ల‌క్ష్యంతో వ‌చ్చిన ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ.. అనూహ్యంలోనే స‌మావేశం మ‌ధ్య‌లోనే బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. దీనిపై అంద‌రూ విస్మ‌యం చేశారు. అయితే.. ప్ర‌ధాని మోడీ మాత్రం మౌనంగా ఉన్నారు.

ఏం జ‌రిగింది?

విక‌సిత భార‌త్-2047 థీమ్‌తో నిర్వ‌హించిన నీతి ఆయోగ్ భేటీలో ముందు ప్ర‌దాని మాట్లాడారు. త‌ర్వాత‌.. అక్ష‌ర క్ర‌మంలో తొలి రాష్ట్ర‌మైన ఏపీకిఅవ‌కాశం వ‌చ్చింది. దీంతో ఏపీ సీఎం చంద్ర‌బాబు మాట్లాడారు. అనేక అంశాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. ఆ త‌ర్వాత అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ సీఎం, త‌ర్వాత‌.. అస్సాం.. ఆ త‌ర్వాత‌.. బెంగాల్ సీఎం మ‌మ‌త‌కు అవ‌కాశం ల‌భించింది. అప్ప‌టి వ‌ర‌కు మాట్లాడిన సీఎంలు .. వారివారి స‌మస్య‌ల‌ను విక‌సిత భార‌త్ ల‌క్ష్యాల‌ను ఎలా ముందుకు తీసుకువెళ్లేదీ కూడా వివ‌రించారు.

అయితే.. మ‌మ‌త వంతు వ‌చ్చే స‌రికి.. ఆమె ప్ర‌స్తుతం ఉన్న నీతిఆయోగ్‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఇదేస‌మయంలో గ‌త ప్ర‌ణాళికా సంఘాన్ని పున‌రుద్ధ‌రించాల‌ని కూడా డిమాండ్ చేశారు. ఇక, బెంగాల్ విభ‌జ‌న‌కు జ‌రుగుతున్న కుట్ర‌ను కేంద్రం ఆపాల‌న్నారు. ఇలా ఆమె అజెండాలో లేని అంశాల‌ను ప్ర‌స్తావించ‌డంతో వెంట‌నే మైక్ క‌ట్ చేశారు. దీంతో మ‌మ‌త ఆగ్ర‌హోద‌గ్రురాల‌య్యారు. చివాల్న సీటులోంచి లేచి.. బ‌య‌ట‌కు వ‌చ్చేశారు.

చంద్ర‌బాబుకు 20 నిమిషాల సేపు మాట్లాడేందుకు అవ‌కాశం ఇచ్చార‌ని.. త‌ను ప్ర‌సంగం ప్రారంభించ‌గానే మైకు క‌ట్ చేశార‌ని.. మ‌మ‌త విమ‌ర్శించారు. నీతి ఆయోగ్ అంటే.. మోడీ నీతులు వినేందుకు రావ‌డ‌మేన‌ని.. ఎద్దేవా చేశారు. త‌మ‌కు అవ‌కాశం లేద‌ని.. త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనే అవ‌కాశం ఇవ్వ‌ర‌ని వ్యాఖ్యానించారు. అందుకే నిర‌స‌న‌గా తాను స‌మావేశాన్ని బాయ్ కాట్ చేశాన‌ని ఆమె వివ‌రించారు. గ‌తంలో త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన జ‌య‌ల‌లిత కూడా.. ఇదేవిధంగా నీతి ఆయోగ్ స‌మావేశం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి మోడీని తిట్టిపోసిన విష‌యం తెలిసిందే. త‌ర్వాత ఆమె అవినీతి కేసులు జోరందుకోవ‌డం.. జైలుకు వెళ్ల‌డం.. త‌ర్వాత బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చి అనారోగ్యంతో క‌న్నుమూయ‌డం తెలిసిందే.

This post was last modified on July 27, 2024 3:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

4 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

6 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

6 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

8 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

8 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

9 hours ago