అధికారంలో ఉన్నపుడే కాదు.. ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తన సోదరి షర్మిళతో తలపోటు తప్పట్లేదు. జగన్ను అధికారం నుంచి దించడంలో తన వంతు పాత్ర పోషంచిన షర్మిళ.. ఆయన ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా ఎటాక్ ఆపట్లేదు. తమ పార్టీ నేతలు, కార్యకర్తల మీద జరిగిన దాడులపై ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నా మీద ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతూ షర్మిళ వేసిన ప్రశ్నలకు వైసీపీ నేతల నుంచి సమాధానమే లేకపోయింది.
ఇక ఈ ధర్నాకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని పిలిచినా రాలేదని, కాంగ్రెస్ పార్టీ మద్తతు పలకలేదని జగన్ చేసిన విమర్శల మీద తాజాగా షర్మిళ స్పందించింది. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా జగన్కు ఆమె సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించింది. బుల్లెట్లలా ఉన్న ఆ ప్రశ్నలకు జగన్ అండ్ కో సమాధానం చెప్పే పరిస్థితి ఎంతమాత్రం ఉండదన్నది స్పష్టం. ఇంతకీ షర్మిళ ఏమందంటే..?
“కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న జగన్ గారు… మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి ? పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా..? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా..? 5 ఏళ్లు బీజేపితో అక్రమ సంబందం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి.. ఆఖరుకి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు…ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరం. క్రిష్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత గురి చేసినా.. నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చారు కదా? YSR వ్యతిరేకించిన మతతత్వ బీజేపికే జై కొట్టారు కదా? మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీనుంచి వచ్చిందా సంఘీభావం? మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్పా…రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. సిద్దం అన్న వాళ్లకు 11మంది భలం సరిపోలేదా.. ఇప్పుడు కలిసి పోరాడుదాం అంటున్నారు” అని షర్మిళ పేర్కొంది.
This post was last modified on July 27, 2024 3:26 pm
90వ దశకంలో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన కథానాయిక.. మీనా. ఇటు తెలుగులో, అటు తమిళంలో ఆమె…
ముందు సౌత్ సినిమాల్లో నటించి, ఆ తర్వాత బాలీవుడ్లో స్థిరపడ్డ హీరోయిన్లు చాలామంది.. ఇక్కడి సినిమాలు, పరిస్థితుల గురించి విమర్శలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంటే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్కు ఉన్న వ్యతిరేకత ఎలాంటిదో తెలిసిందే. ‘జస్ట్ ఆస్కింగ్’…
పదేళ్లకు పైగా 33 మంది పసి బాలురపై పునరావృత లైంగిక దాడులకు పాల్పడిన కేసులో ఉత్తరప్రదేశ్ బందా ప్రత్యేక పోక్సో…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటిస్తే.. అది అమలు కావాల్సిందే!. అది గిరిజన ప్రాంతమైనా.. మైదాన ప్రాంతమైనా.. చెప్పినట్టు…
గత ఏడాది మలయాళంలో ఎవ్వరూ ఊహించని స్థాయిలో భారీ హిట్ అయింది మార్కో మూవీ. తెలుగులో జనతా గ్యారేజ్, భాగమతి…