Political News

బీజేపీకి ‘గాడిద గుడ్డు’ సెగ‌!

తెలంగాణ ప్ర‌జ‌లు 8 మంది ఎంపీల‌ను ఇస్తే.. బీజేపీ రాష్ట్రానికి ఏమిచ్చింది.. ‘గాడిద గుడ్డు’! అనే కామెం ట్లు మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చాయి. గ‌తంలోనూ ఒక‌సారి కేంద్ర వైఖ‌రిని నిర‌సిస్తూ.. ఇలానే గాడిద‌గుడ్డు పోస్ట‌ర్లు వెలిశాయి. ఇప్పుడు తాజాగా కేంద్ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టిన త‌ర్వాత‌.. తెలంగాణ‌కు రూపాయి నిధులు కూడా కేటాయించ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ.. హైద‌రాబాద్ వ్యాప్తంగా ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో ఇలాంటి పోస్ట‌ర్లే వెలిశాయి.

వీటిని కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఏర్పాటు చేసిన‌ట్టు తెలిసింది. ఈ ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 8 ఎంపీ సీట్ల‌ను బీజేపీ గెలుచుకుంది. ఇది ఎవ‌ర్ గ్రీన్ రికార్డు. దీంతో రాష్ట్రంలో బీజేపీ ప్ర‌భుత్వం ఏదో చేస్తుంద‌ని కూడా అంద‌రూ భావించారు. ప్ర‌ధానంగా ఇద్ద‌రు కేంద్ర మంత్రులు(కిష‌న్ రెడ్డి, బండి సంజ య్) కూడా ఉన్న నేప‌థ్యంలో ఈ సారి ఖ‌చ్చితంగా రాష్ట్రానికి మేలు జ‌రుగుతుంద‌ని లెక్కలు వేసుకున్నారు. కానీ, కేంద్రం నుంచి అలాంటి ఆశావ‌హ ప‌రిణామాలు మాత్రం ఎదురుకాలేదు.

దీంతో కాంగ్రెస్ పార్టీ స‌హా బీఆర్ఎస్‌లు బీజేపీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. మ‌రోవైపు ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్రంలో క‌య్యానికి దిగాయి. అధికారంలో ఉండి మీరేం సాధించారంటే.. మీరేం సాధించారంటూ.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేసుకుని.. బుధ‌వారం రోజు రోజంతా కూడా దీనిపైనే స‌భ‌లో చ‌ర్చించుకున్నారు. మాట‌ల తూటాలు పేల్చుకున్నారు. అయితే.. ఇంత జ‌రుగుతున్నా.. బీజేపీ రాష్ట్ర నాయ‌కులు మాత్రం స్పందించ‌లేదు. పైగా రెచ్చ‌గొట్టేలా కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. ఏం రాష్ట్రాల పేర్లు చెప్పాలా? అని నిల‌దీశారు.

ఈ నేప‌థ్యంలో ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చిన రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో దక్కింది ‘గాడిద గుడ్డు’ అంటూ రాసిన బాన‌ర్లు హైద‌రాబాద్‌లోని ప‌లు కూడ‌ళ్ల‌లో క‌నిపించాయి. ఈ ప‌రిణామంపై రాజ‌కీయాల్లోనే కాదు.. సాధార‌ణ ప్ర‌జ‌ల్లో కూడా ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. త్వ‌ర‌లోనే స్థానిక ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో బీజేపీకి ఈ ప‌రిణామం భారీ ఇబ్బందిగా మార‌నుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on July 25, 2024 9:51 am

Share

Recent Posts

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

12 minutes ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

4 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

8 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

8 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

9 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

9 hours ago