ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, 31 రాజకీయ హత్యలు జరిగాయని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించడం తెలిసిందే. ఏపీలో రాజకీయ కక్షలతో జరుగుతున్న దాడులను తాము పార్లమెంటులో ప్రస్తావిస్తామని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని దేశం మొత్తానికి వివరిస్తామని మిథున్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా నెంబర్లు వివరించారు.
తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు దాదాపు35-36 మంది హత్యల్లో దారుణంగా చనిపోయారన్నది జగన్ చేసిన ఆరోపణ. వినుకొండలో జరిగిన దారుణ ఘటన తర్వాత.. ఈ విషయం హాట్ టాపిక్గా మారింది ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలో ధర్నా కూడా చేస్తున్నారు. అయితే.. వాస్తవానికి గడిచిన 50 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కల్లోలం అయితే జరిగింది. అదేసమయంలో హత్యలు కూడా జరిగాయి. కానీ, ఇంతగా 35 మంది హత్యలకు గురయ్యాయా? అనేది ప్రశ్న.
ఈ విషయంపైనే రాజకీయాలు కూడా.. నడుస్తున్నాయి. అధికార పక్షం నుంచి నెంబర్ గేమ్కు ఫుల్ స్టాప్ పెట్టే చర్యలు కొనసాగుతున్నాయి. మంత్రి వంగలపూడి అనిత సహా సీనియర్ నేతలు ఈ నెంబర్లను తప్పుపడుతున్నారు. దీనికి తగిన ఆధారాలు ఉంటే ఇవ్వాలని కూడా చెబుతున్నారు. అయితే.. వైసీపీ నుంచి నెంబర్లు మాత్రం బయటకు రాలేదు. ఇక, ఈ క్రమంలోనే పోలీసులు జోక్యం చేసుకున్నారు.
జూన్ 4 నుంచి జులై 22 వరకు రాష్ట్రంలో రాజకీయ కారణాలతో జరిగిన హత్యలు 4 అని హోం శాఖ వెల్లడించింది. అందులో అనంతపురం జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 1, కర్నూలు జిల్లాలో 1 ఘటన జరిగాయని వివరించింది. మృతి చెందినవారిలో ముగ్గురు టీడీపీకి చెందినవారని, ఒకరు వైసీపీకి చెందినవారని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. ఇక, పాతకక్షలు, రాజకీయ విభేదాలతో ఆవేశపూరితంగా జరిగిన గొడవల్లో పల్నాడు జిల్లాలో 1, శ్రీ సత్యసాయి జిల్లాలో 1 హత్య జరిగినట్టు వెల్లడించింది. మృతులు ఇద్దరూ వైసీపీకి చెందినవారని పేర్కొంది. సో.. వాస్తవం ఇదేనని హోం శాఖ చెబుతుండగా.. వైసీపీ మాత్రం కాదు.. 35 మంది చనిపోయారని చెబుతుండడం గమనార్హం.
This post was last modified on July 23, 2024 3:45 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…