Political News

హ‌త్య‌ల‌పై నెంబ‌ర్ గేమ్‌.. వాస్త‌వం ఏంటి.. ?

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, 31 రాజకీయ హత్యలు జరిగాయని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించడం తెలిసిందే. ఏపీలో రాజకీయ కక్షలతో జరుగుతున్న దాడులను తాము పార్లమెంటులో ప్రస్తావిస్తామని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని దేశం మొత్తానికి వివరిస్తామని మిథున్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా నెంబ‌ర్లు వివ‌రించారు.

త‌మ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు దాదాపు35-36 మంది హ‌త్య‌ల్లో దారుణంగా చ‌నిపోయార‌న్న‌ది జ‌గ‌న్ చేసిన ఆరోప‌ణ‌. వినుకొండ‌లో జ‌రిగిన దారుణ ఘ‌ట‌న త‌ర్వాత‌.. ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఢిల్లీలో ధ‌ర్నా కూడా చేస్తున్నారు. అయితే.. వాస్త‌వానికి గ‌డిచిన 50 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా క‌ల్లోలం అయితే జ‌రిగింది. అదేస‌మ‌యంలో హ‌త్య‌లు కూడా జ‌రిగాయి. కానీ, ఇంతగా 35 మంది హ‌త్య‌ల‌కు గుర‌య్యాయా? అనేది ప్ర‌శ్న‌.

ఈ విష‌యంపైనే రాజ‌కీయాలు కూడా.. న‌డుస్తున్నాయి. అధికార ప‌క్షం నుంచి నెంబ‌ర్ గేమ్‌కు ఫుల్ స్టాప్ పెట్టే చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. మంత్రి వంగ‌ల‌పూడి అనిత సహా సీనియ‌ర్ నేత‌లు ఈ నెంబ‌ర్ల‌ను త‌ప్పుప‌డుతున్నారు. దీనికి త‌గిన ఆధారాలు ఉంటే ఇవ్వాల‌ని కూడా చెబుతున్నారు. అయితే.. వైసీపీ నుంచి నెంబ‌ర్లు మాత్రం బ‌య‌ట‌కు రాలేదు. ఇక‌, ఈ క్ర‌మంలోనే పోలీసులు జోక్యం చేసుకున్నారు.

జూన్ 4 నుంచి జులై 22 వరకు రాష్ట్రంలో రాజకీయ కారణాలతో జరిగిన హత్యలు 4 అని హోం శాఖ‌ వెల్లడించింది. అందులో అనంతపురం జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 1, కర్నూలు జిల్లాలో 1 ఘటన జరిగాయని వివరించింది. మృతి చెందినవారిలో ముగ్గురు టీడీపీకి చెందినవారని, ఒకరు వైసీపీకి చెందినవారని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. ఇక, పాతకక్షలు, రాజకీయ విభేదాలతో ఆవేశపూరితంగా జరిగిన గొడవల్లో పల్నాడు జిల్లాలో 1, శ్రీ సత్యసాయి జిల్లాలో 1 హత్య జరిగినట్టు వెల్లడించింది. మృతులు ఇద్దరూ వైసీపీకి చెందినవారని పేర్కొంది. సో.. వాస్త‌వం ఇదేన‌ని హోం శాఖ చెబుతుండ‌గా.. వైసీపీ మాత్రం కాదు.. 35 మంది చ‌నిపోయార‌ని చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on July 23, 2024 3:45 pm

Share
Show comments

Recent Posts

దేశ చ‌రిత్ర‌లో.. `మ‌మ‌త` గెలిచారు… మరి ఈసీ మాటేంటి?!

సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచార‌ణ‌కు వ‌స్తాయి. న్యాయ‌శాస్త్రంలో ల‌బ్ధ‌ప్ర‌తిష్టులైన అనేక మంది న్యాయ‌వాదులు వాద‌న‌లు వినిపిస్తారు. ఇది…

3 hours ago

గంపెడు సినిమాలు… గుప్పెడు అంచనాలు

రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…

3 hours ago

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…

7 hours ago

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

11 hours ago

మహేష్ రన్నింగ్ స్టైల్ మార్చడమేంటి జక్కన్నా?

తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…

13 hours ago

దురంధర్ VS విశ్వరూపం – ఎందుకీ రచ్చ?

ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…

13 hours ago