Political News

హ‌త్య‌ల‌పై నెంబ‌ర్ గేమ్‌.. వాస్త‌వం ఏంటి.. ?

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, 31 రాజకీయ హత్యలు జరిగాయని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించడం తెలిసిందే. ఏపీలో రాజకీయ కక్షలతో జరుగుతున్న దాడులను తాము పార్లమెంటులో ప్రస్తావిస్తామని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని దేశం మొత్తానికి వివరిస్తామని మిథున్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కూడా నెంబ‌ర్లు వివ‌రించారు.

త‌మ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు దాదాపు35-36 మంది హ‌త్య‌ల్లో దారుణంగా చ‌నిపోయార‌న్న‌ది జ‌గ‌న్ చేసిన ఆరోప‌ణ‌. వినుకొండ‌లో జ‌రిగిన దారుణ ఘ‌ట‌న త‌ర్వాత‌.. ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఢిల్లీలో ధ‌ర్నా కూడా చేస్తున్నారు. అయితే.. వాస్త‌వానికి గ‌డిచిన 50 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా క‌ల్లోలం అయితే జ‌రిగింది. అదేస‌మ‌యంలో హ‌త్య‌లు కూడా జ‌రిగాయి. కానీ, ఇంతగా 35 మంది హ‌త్య‌ల‌కు గుర‌య్యాయా? అనేది ప్ర‌శ్న‌.

ఈ విష‌యంపైనే రాజ‌కీయాలు కూడా.. న‌డుస్తున్నాయి. అధికార ప‌క్షం నుంచి నెంబ‌ర్ గేమ్‌కు ఫుల్ స్టాప్ పెట్టే చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. మంత్రి వంగ‌ల‌పూడి అనిత సహా సీనియ‌ర్ నేత‌లు ఈ నెంబ‌ర్ల‌ను త‌ప్పుప‌డుతున్నారు. దీనికి త‌గిన ఆధారాలు ఉంటే ఇవ్వాల‌ని కూడా చెబుతున్నారు. అయితే.. వైసీపీ నుంచి నెంబ‌ర్లు మాత్రం బ‌య‌ట‌కు రాలేదు. ఇక‌, ఈ క్ర‌మంలోనే పోలీసులు జోక్యం చేసుకున్నారు.

జూన్ 4 నుంచి జులై 22 వరకు రాష్ట్రంలో రాజకీయ కారణాలతో జరిగిన హత్యలు 4 అని హోం శాఖ‌ వెల్లడించింది. అందులో అనంతపురం జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 1, కర్నూలు జిల్లాలో 1 ఘటన జరిగాయని వివరించింది. మృతి చెందినవారిలో ముగ్గురు టీడీపీకి చెందినవారని, ఒకరు వైసీపీకి చెందినవారని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. ఇక, పాతకక్షలు, రాజకీయ విభేదాలతో ఆవేశపూరితంగా జరిగిన గొడవల్లో పల్నాడు జిల్లాలో 1, శ్రీ సత్యసాయి జిల్లాలో 1 హత్య జరిగినట్టు వెల్లడించింది. మృతులు ఇద్దరూ వైసీపీకి చెందినవారని పేర్కొంది. సో.. వాస్త‌వం ఇదేన‌ని హోం శాఖ చెబుతుండ‌గా.. వైసీపీ మాత్రం కాదు.. 35 మంది చ‌నిపోయార‌ని చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

టాలీవుడ్‌పై బాలీవుడ్ ఏడుపుకిది నిదర్శనం

ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…

36 minutes ago

జగన్ అటాక్ మోడ్ లోకి వచ్చినట్టేనా…?

ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…

1 hour ago

సీబీఎన్ @ 361 డిగ్రీస్..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. పాల‌న‌, ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు.. వేస్తున్న అడుగులు, భ‌విష్య‌త్తు ఆంధ్ర ప్ర‌దేశ్ నిర్మాణం.. వంటి ప‌లు…

2 hours ago

పవన్ కొత్త టార్గెట్ ఇదే!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…

4 hours ago

`అన్న‌లు` నా పార్టీలోనే ఉన్నారు: క‌విత షాకింగ్ కామెంట్స్‌

తెలంగాణ ర‌క్ష‌ణ‌ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడ‌తార‌న్న పేరుంది. పైగా మాట‌ల విష‌యంలో ఆమె…

4 hours ago

అమర్ నాథ్ వ్యాఖ్యలపై అనిత రియాక్షన్

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…

4 hours ago