Political News

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ర‌ద్దు: అసెంబ్లీ ఏక‌గ్రీవ ఆమోదం!

ఎన్నిక‌ల‌కు ముందు తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అయిన‌.. ల్యాండ్ టైటింగ్ యాక్ట్ బుట్ట దాఖ‌లైంది. ఈ చ‌ట్టాన్ని ర‌ద్దు చేస్తూ.. ఏపీ అసెంబ్లీ ఏక‌గ్రీవ ఆమోదం తెలిపింది. దీంతో 2021-22 మ‌ధ్య అప్ప‌టి జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువ‌చ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా ర‌ద్ద‌యిపోయిన‌ట్టు అయింది. ఎన్నిక‌ల‌కు మూడు వారాల ముందు.. అనూహ్యంగా ఈ అంశం తెర‌మీదకు వ‌చ్చింది. అప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప్ర‌చారం ఒక ఎత్తు అయితే. ఈ చ‌ట్టం వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చిన త‌ర్వాత‌.. జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారం మ‌రో ఎత్తు.

అప్ప‌టి వ‌ర‌కు గెలుపు ధీమాతో ఉన్న వైసీపీ నాయ‌కులను ఈ చ‌ట్టంపై ప్ర‌తిప‌క్షాలు చేసిన ప్ర‌చారం.. దిమ్మ‌తిరిగిపోయేలా చేసింది. “టైటిల్ చ‌ట్టం అమ‌లు చేస్తే.. మీ భూములు మీవి కావు. జ‌గ‌న్ వాటిని లాగేసుకుంటాడు. మీ ఆస్తులు తీసేసుకుంటాడు. మీ భూములు లాగేసుకుంటాడు” అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నుంచి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర‌కు ఊరూ వాడా ప్ర‌చారం చేశారు. దీనికి స‌రైన కౌంట‌ర్ ఇచ్చుకోలేక‌.. జ‌గ‌న్ తెల్ల మొహం వేశారు.

నిజానికి ఈ చ‌ట్టంపై స‌భ‌లో జ‌రిగిన చ‌ర్చ‌ల్లో అప్ప‌టి ఎమ్మెల్యే పయ్యావుల కేశ‌వ్ మంచిదేన‌ని చెప్పార‌ని జ‌గ‌న్ చెప్పే ప్ర‌య‌త్నం చేసినా.. ఫ‌లించ‌లేదు. మొత్తానికి బ‌ల‌మైన ఓటు బ్యాంకు బ‌దాబ‌ద‌లైపోయింది. కూట‌మికి ఎవ‌రూ ఊహించ‌ని విధంగా బ‌ల‌మైన మెజారిటీ తెచ్చిపెట్టింది. కాగా, తాను అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఈ చ‌ట్టాన్ని ర‌ద్దు చేస్తాన‌ని చంద్ర‌బాబు అప్ప‌ట్లోనే ప్ర‌క‌టించారు. ఆయ‌న ప్ర‌క‌టించినట్టుగానే రెండో సంత‌కాన్ని ఈ చ‌ట్టం ర‌ద్దు ఫైలుపైనే చేశారు. తాజాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ర‌ద్ద‌యి పోయింది.

తాజాగా ఏం జ‌రిగింది?

మంగ‌ళ‌వారం.. స‌భ ప్రారంభం కాగానే.. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును స‌భ‌లో పెట్టారు. ఈ సంద‌ర్భంగా స్పీక‌ర్ అయ్య‌న్న మాట్లాడుతూ.. ఈ చ‌ట్టాన్ని ర‌ద్దు చేసేందుకు అంగీక‌రించేవారు.. ‘అవును’ అనాల‌ని సూచించారు. దీంతో అంద‌రూ ఏక‌గ్రీవంగా ‘అవును’ అని చెప్పారు. దీంతో చ‌ట్టం ర‌ద్దు ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదించిన‌ట్టు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. కాగా.. ఈ స‌మ‌యంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎవ‌రూ స‌భ‌లో క‌నిపించ‌లేదు.

This post was last modified on July 23, 2024 3:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

14 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

57 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago