Political News

కేంద్ర బ‌డ్జెట్‌: బంగారం.. మొబైల్ ఫోన్లు ఇక, చ‌వ‌కే!

కేంద్ర బ‌డ్జెట్‌లో కొన్ని వ‌రాలు ప్ర‌క‌టించారు మంత్రి నిర్మలా సీతారామ‌న్‌. ముఖ్యంగా ప్ర‌స్తుతం గ్రాము 7000 దాటిపోయిన బంగారంపై కొంత ఊర‌ట క‌ల్పించారు. బంగారం కస్ట‌మ్ డ్యూటీని 6 శాతానికి త‌గ్గిస్తున్నట్టు ప్ర‌క‌టించారు. త‌ద్వారా.. దేశీయ మార్కెట్ బంగారం ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్ట‌నున్నాయి. అదేవిధంగా ధ‌న‌వంతులు మాత్ర‌మే ధ‌రించే ప్లాటిన‌మ్ ధ‌ర‌లు కూడా త‌గ్గుముఖం ప‌ట్ట‌నున్నాయి. వీటిపై కూడా క‌స్ట‌మ్ డ్యూటీని 6.4 శాతానికి త‌గ్గించ‌నున్నారు.

దేశంలో ప్ర‌స్తుతం స్టార్ట‌ప్‌ల‌కు కేంద్రంగా ఉన్న మొబైల్ రంగానికి ఊత‌మిచ్చేందుకు కూడా చ‌ర్య‌లు తీసుకున్నారు. దీనిలో భాగంగా.. బేసిక్ మొబైల్ ఫోన్ల‌పై ప్ర‌స్తుతం ఉన్న క‌స్ట‌మ్ డ్యూటీని త‌గ్గించ‌నున్నట్టు.. నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు.త ద్వారా దేశంలో మొబైల్ వినియోగం పెంచ‌డంతోపాటు ఉపాధి క‌ల్ప‌న‌కు పెద్ద‌పీట వేయ‌నున్న‌ట్టు చెప్పారు. ప్ర‌స్తుతం యువత 26 శాతం మంది మొబైల్ వ్యాపారంలో ఉన్నారు. దీంతో ఈ రంగానికి ప్రాధాన్యం ఇచ్చిన‌ట్టు అయింది.

ఇక‌, దేశంలో కేన్సర్‌ రోగులకు ఊరటక‌లిగిస్తూ.. బ‌డ్జెట్‌లో ప్ర‌తిపాద‌న‌లు చేశారు. కేన్సర్‌ రోగుల మందుల పై సుంకం పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. అదేవిధంగా ప్రాణాధార‌మైన మూడు ఔష‌ధాలపై నా సుంకాల‌ను ఎత్తి వేస్తున్న‌ట్టు నిర్మ‌ల‌మ్మ ప్ర‌క‌టించారు. అదేవిధంగా 500 పెద్ద కంపెనీల్లో కోటి మంది యువతకు ఉద్యోగాల కల్పనకు మార్గం సుగ‌మం చేశారు. వంద నగరాల్లో ప్లగ్‌ అండ్‌ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయ‌నున్నారు.,

2 విస్తృతస్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు ద్వారా.. వ‌స్తు, ఆభ‌రాల‌ను చౌక‌గా అందించనున్న‌ట్టు తెలిపారు. పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం చేప‌ట్ట‌నున్నా రు. అలాగే.. కార్మికుల నివాసం కోసం పారిశ్రామిక కేంద్రాల్లో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం చేయ‌ను న్నారు. త‌ద్వారా వ‌ల‌స కూలీల సంఖ్య‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నం చేయ‌నున్న‌ట్టు తెలిపారు.

This post was last modified on July 23, 2024 1:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

1 hour ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

2 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

2 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

2 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

4 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

5 hours ago