టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై బూతులు మాట్లాడుతూ.. అసభ్యంగా వ్యవహరించిన వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్టు అయ్యారు. ఒక్క చంద్రబాబునే కాదు.. ఆయన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పైనా విమర్శలు గుప్పించారు. మూడు పెళ్లిళ్లు అంటూ.. విమర్శించారు. అదేవిధంగా రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనితపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయా అంశాలపై పోలీసులకు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.
వీటిపై ఎప్పుడో కేసులు నమోదైనా.. నాగార్జున యాదవ్ తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన కోసం గాలిస్తున్న పోలీసులకు తాజాగా బెంగళూరు నుంచి విజయవాడకు వస్తున్నట్టుగా సమాచారం అందుకుని.. గన్నవరం విమానాశ్రయంలో కాపు కాచి అరెస్టు చేశారు. నేరుగా.. అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. వైసీపీ అనుకూల మీడియాల్లో జరిగే చర్చా కార్యక్రమాల్లో పాల్గొనే నాగార్జున యాదవ్.. జగన్కు వీర విధేయుడు. ఆయనపై ఈగ వాలినా తట్టుకోలేనంతగా స్పందిస్తారు.
ఈ క్రమంలో ఎన్నికలకు ముందు తర్వాత.. కూడా పలు టీవీ చానెళ్లలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుపై బూతులతో విరుచుకుపడ్డారు. ఆయన అనారోగ్యాన్ని సైతం వదిలి పెట్టుకుండా విమర్శలు గుప్పిం చారు. పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు, కాపులకు అన్యాయం చేశారని.. ఇలా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు. మరీ ముఖ్యంగా అనిత వ్యక్తిగత జీవితంపై తీవ్ర విమర్శలు చేశారు. అనలేని,.. వినలేని మాటలు మాట్లాడినట్టు పోలీసులకు అందిన ఫిర్యాదులో టీడీపీ నేతలు పేర్కొన్నారు.
దీంతో నాగార్జున యాదవ్పై కుప్పం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తాజాగా అదుపులోకి తీసుకున్న నాగార్జున యాదవ్ను పోలీసులు వివిధ అంశాలపై విచారిస్తున్నారు. అయితే.. ఆయన తరపు న్యాయవాది.. బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు మాత్రం వెంటనే ఆయనను కోర్టు ముందు పెట్టి జైలుకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు.
This post was last modified on July 22, 2024 3:29 pm
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…