తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి తనదైన పంథాలో సాగిపోతున్నారు. కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తూనే మరికొన్ని విషయాల్లో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సవాళ్ల నడుమ ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపిస్తున్నారు. ఇటీవల పరిణామాలు చూస్తుంటే రేవంత్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తున్నారు. సమస్యలను పరిష్కరించడంలో తనదైన ముద్ర వేస్తున్నారు.
డీఎస్సీ వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు ఆందోళన చేశారు. కానీ ఈ పరీక్ష నిర్వహణకే రేవంత్ మొగ్గు చూపారు. అందుకే మరో డీఎస్సీ వేస్తామని, ఈ పరీక్ష మాత్రం నిర్వహిస్తామని చెప్పారు. దీంతో కాస్త అసంతృప్తి అదుపులోకి వచ్చింది. తాజాగా గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయడంతో నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహం పోయింది. వాళ్లను శాంతింపజేసేలా రేవంత్ నిర్ణయం తీసుకున్నారు.
ఇక గతంలో కేసీఆర్ హయాంలో రైతుబంధు పథకం కింద వందల ఎకరాలు ఉన్నవాళ్లు కూడా లబ్ధి పొందారు. అంత అవసరం లేకపోయినా రూ.లక్షల్లో ప్రభుత్వ సొమ్ము అందుకున్నారు. అందుకే రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధును రైతుభరోసాగా మార్చి అవసరాల్లో ఉన్న రైతులకే లబ్ధి చేకూర్చాలని చూస్తున్నారు.
వ్యవసాయం చేస్తున్న అన్నదాతలకు, పెట్టుబడి సాయం కావాల్సిన వాళ్లకే మేలు జరిగేలా కసరత్తులు చేస్తున్నారు. దీని కోసం మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రైతుభరోసా పథకం అమలు ఆలస్యమవుతోంది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్నా రేవంత్ మాత్రం తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. ఇక రుణమాఫీ కూడా అక్రమ దారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
This post was last modified on July 20, 2024 2:06 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…