తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి తనదైన పంథాలో సాగిపోతున్నారు. కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తూనే మరికొన్ని విషయాల్లో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సవాళ్ల నడుమ ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపిస్తున్నారు. ఇటీవల పరిణామాలు చూస్తుంటే రేవంత్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తున్నారు. సమస్యలను పరిష్కరించడంలో తనదైన ముద్ర వేస్తున్నారు.
డీఎస్సీ వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు ఆందోళన చేశారు. కానీ ఈ పరీక్ష నిర్వహణకే రేవంత్ మొగ్గు చూపారు. అందుకే మరో డీఎస్సీ వేస్తామని, ఈ పరీక్ష మాత్రం నిర్వహిస్తామని చెప్పారు. దీంతో కాస్త అసంతృప్తి అదుపులోకి వచ్చింది. తాజాగా గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయడంతో నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహం పోయింది. వాళ్లను శాంతింపజేసేలా రేవంత్ నిర్ణయం తీసుకున్నారు.
ఇక గతంలో కేసీఆర్ హయాంలో రైతుబంధు పథకం కింద వందల ఎకరాలు ఉన్నవాళ్లు కూడా లబ్ధి పొందారు. అంత అవసరం లేకపోయినా రూ.లక్షల్లో ప్రభుత్వ సొమ్ము అందుకున్నారు. అందుకే రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధును రైతుభరోసాగా మార్చి అవసరాల్లో ఉన్న రైతులకే లబ్ధి చేకూర్చాలని చూస్తున్నారు.
వ్యవసాయం చేస్తున్న అన్నదాతలకు, పెట్టుబడి సాయం కావాల్సిన వాళ్లకే మేలు జరిగేలా కసరత్తులు చేస్తున్నారు. దీని కోసం మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రైతుభరోసా పథకం అమలు ఆలస్యమవుతోంది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్నా రేవంత్ మాత్రం తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. ఇక రుణమాఫీ కూడా అక్రమ దారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
This post was last modified on July 20, 2024 2:06 pm
2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది (జమిలి…
ఒళ్ళు హూనం చేసుకుని సంవత్సరాలు ఖర్చు పెట్టి నిఖిల్ నటించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటిదాకా కొత్త రిలీజ్…
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి మైండ్ గేమ్స్, సస్పెన్స్ త్రిల్లర్స్. 'క్షణం',…
రాజకీయం రాజకీయమే. రాజకీయమనే తానులో ఉండే ఏ పార్టీ అయినా తీరు ఒక్కటే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది.…
బాలకృష్ణ ఖాకీ డ్రెస్సు వేస్తే బ్లాక్ బస్టర్ ఖాయమనేది అభిమానుల నమ్మకం. దానికి పునాది వేసింది రౌడీ ఇన్స్పెక్టర్. 1992లో…
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును బుధవారం లోక్సభ ఆమోదించిన దరిమిలా.. రాజ్యసభలో గురువారం ప్రవేశ పెట్టారు. కేంద్ర హోం శాఖ…