Political News

పుంగనూరులో హై టెన్షన్..మిథున్ రెడ్డిపై దాడి

పుంగనూరులో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లిన నేపథ్యంలో రెడ్డప్ప, మిథున్ రెడ్డిలకు వ్యతిరేకంగా వందలాది మంది టీడీపీ కార్యకర్తలు రెడ్డప్ప నివాసం దగ్గరకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. వైసిపి హయాంలో రెడ్డప్ప, మిథున్ రెడ్డి వేధింపులకు గురి చేశారంటూ ఆయన పర్యటనకు నిరసనగా టిడిపి కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. గోబ్యాక్ మిథున్ రెడ్డి అని నినాదాలు చేశారు.

ఈ నేపథ్యంలోనే టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు వైసీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేసేందుకు భారీగా బలగాలని మోహరించారు. పుంగనూరులో హై టెన్షన్ వాతావరణ ఏర్పడిన నేపథ్యంలో మిథున్ రెడ్డిని రెడ్డప్ప నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేశారు. వాస్తవానికి ఎంపీ రెడ్డప్ప టార్గెట్ గా టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగడంతో అదే సమయంలో అక్కడికి వెళ్లిన మిథున్ రెడ్డి కూడా ఈ నిరసనను ఎదుర్కోవాల్సి వచ్చింది.

రెడ్డప్పతోపాటు మిథున్ రెడ్డిపై కూడా వేధింపులకు గురిచేశారని ఆరోపణలు ఉండటంతో ఒకసారి టిడిపి కార్యకర్తలు ఆ ఇద్దరిని లక్ష్యంగా చేసుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘర్షణలో మిథున్ రెడ్డి వాహనం ధ్వంసం అయింది. కాసేపు పోలీసులు పరిస్థితిని అదుపు చేసినప్పటికీ ఆ తర్వాత మరికాసేపటికి మళ్ళీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

ఇక, మిథున్ రెడ్డి పై దాడి ఘటనను తిరుపతి ఎంపీ గురుమూర్తి ఖండించారు. ఎంపీకి రక్షణ కల్పించలేని ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకు ఏం రక్షణ కల్పిస్తుందని గురుమూర్తి ప్రశ్నించారు. ఎంపీపై, ఆయన వాహనంపై రాళ్ల దాడి జరుగుతుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులు చోద్యం చూస్తూ ఊరుకున్నారని ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతోంది అనేందుకు ఇది నిదర్శనమని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని సంస్కృతిని ఎన్డీఏ పాలనలో చూస్తున్నామని అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

This post was last modified on July 18, 2024 3:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

59 minutes ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

2 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

3 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

4 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

5 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

6 hours ago