Political News

పుంగనూరులో హై టెన్షన్..మిథున్ రెడ్డిపై దాడి

పుంగనూరులో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లిన నేపథ్యంలో రెడ్డప్ప, మిథున్ రెడ్డిలకు వ్యతిరేకంగా వందలాది మంది టీడీపీ కార్యకర్తలు రెడ్డప్ప నివాసం దగ్గరకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. వైసిపి హయాంలో రెడ్డప్ప, మిథున్ రెడ్డి వేధింపులకు గురి చేశారంటూ ఆయన పర్యటనకు నిరసనగా టిడిపి కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. గోబ్యాక్ మిథున్ రెడ్డి అని నినాదాలు చేశారు.

ఈ నేపథ్యంలోనే టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు వైసీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేసేందుకు భారీగా బలగాలని మోహరించారు. పుంగనూరులో హై టెన్షన్ వాతావరణ ఏర్పడిన నేపథ్యంలో మిథున్ రెడ్డిని రెడ్డప్ప నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేశారు. వాస్తవానికి ఎంపీ రెడ్డప్ప టార్గెట్ గా టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగడంతో అదే సమయంలో అక్కడికి వెళ్లిన మిథున్ రెడ్డి కూడా ఈ నిరసనను ఎదుర్కోవాల్సి వచ్చింది.

రెడ్డప్పతోపాటు మిథున్ రెడ్డిపై కూడా వేధింపులకు గురిచేశారని ఆరోపణలు ఉండటంతో ఒకసారి టిడిపి కార్యకర్తలు ఆ ఇద్దరిని లక్ష్యంగా చేసుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘర్షణలో మిథున్ రెడ్డి వాహనం ధ్వంసం అయింది. కాసేపు పోలీసులు పరిస్థితిని అదుపు చేసినప్పటికీ ఆ తర్వాత మరికాసేపటికి మళ్ళీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

ఇక, మిథున్ రెడ్డి పై దాడి ఘటనను తిరుపతి ఎంపీ గురుమూర్తి ఖండించారు. ఎంపీకి రక్షణ కల్పించలేని ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకు ఏం రక్షణ కల్పిస్తుందని గురుమూర్తి ప్రశ్నించారు. ఎంపీపై, ఆయన వాహనంపై రాళ్ల దాడి జరుగుతుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులు చోద్యం చూస్తూ ఊరుకున్నారని ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతోంది అనేందుకు ఇది నిదర్శనమని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని సంస్కృతిని ఎన్డీఏ పాలనలో చూస్తున్నామని అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

This post was last modified on July 18, 2024 3:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్ర‌జ‌ల సంద‌ర్శ‌న‌కు వైసీపీ `విలాసం`?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని రుషికొండ‌పై దాదాపు 500 కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నం వ్య‌యంతో విలాస‌వంతంగా నిర్మించిన ప్యాలెస్‌ను ఏం చేయాల‌న్న…

2 minutes ago

విజ‌య‌న్ వ‌ర్సెస్ రేవంత్‌… ర‌చ్చ‌-ర‌చ్చ‌!

కేర‌ళం ఎన్నిక‌ల సంద‌ర్భంగా అక్క‌డ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున‌ ప్ర‌చారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.. సీనియ‌ర్…

48 minutes ago

ఇండస్ట్రీలో కొత్త ‘అల్లరోడు’

అన్ని రసాల్లోకి హాస్య రసం పండించడం చాలా కష్టమంటారు. అందులో అతిశయోక్తి ఏమీ కాదు. నవ్వించడం అన్నది అత్యంత కష్టమైన…

3 hours ago

ఏడాది తర్వాత… ఈ రోజు విధ్వంసమే

ఒకప్పుడు ఒక పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. చివరి దాకా దానికి కట్టుబడే ఉండేవారు. చెప్పిన డేటుకే…

5 hours ago

కమ్యూనిస్టుల మనసు దోచుకున్న కవిత

దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…

6 hours ago

శభాష్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నిజమేనండోయ్...కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన…

9 hours ago