Political News

విచారణకు రెడీ కానీ స్టేషన్ కు రాలేను – డాక్టర్ రమేష్ బాబు

రమేష్ ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ పోతిన రమేష్ విచారణ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. నేరుగా తాను విచారణకు హాజరుకాలేనని చెప్పిన డాక్టర్ పోతిన రమేష్ కావాలంటే వీడియో విచారణకు హాజరవుతానంటూ పోలీసులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. విజయవాడలోని స్వర్ణాప్యాలెస్ కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదంలో 11మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి సంబంధించి బాధ్యులపై విచారణ జరిపేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఇందులో భాగంగా కొందరిని ఇప్పటికే విచారించగా ఆసుపత్రి ఛైర్మన్ పోతిన రమేష్ మాత్రం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.

ఇదే సమయంలో తనపై ఎటువంటి విచారణ జరగకుండా, చర్యలు తీసుకోకుండా హైకోర్టులో స్టే కూడా తెచ్చుకున్నారు. రమేష్ ఆచూకీ చెప్పినవారికి పోలీసులు లక్ష రూపాయల బహుమతి ప్రకటించినా కూడా డాక్టర్ ఆచూకి దొరకలేదు. అజ్ఞాతంలో ఉంటూనే కోర్టు నుండి స్టే తెచ్చుకున్న రమేష్ తీరుపై ప్రభుత్వం సుప్రింకోర్టుకెళ్ళింది. సుప్రిం విచారణలో రమేష్ ను విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అరెస్టు మాత్రం చేయద్దని స్పష్టంగా చెప్పింది. ఇదే సమయంలో విచారణలో పోలీసులకు సహకరించాలని రమేష్ ను కూడా ఆదేశించింది. సుప్రింకోర్టు తాజా ఆదేశాల ప్రకారం రమేష్ ను విచారణకు హాజరవ్వాలంటూ పోలీసులు నోటీసులిచ్చారు. దానికి రమేష్ ఇచ్చిన సమాధానం పోలీసులకు షాక్ కొట్టినట్లయ్యింది.

ఇంతకీ అందులో ఏముందంటే కరోనా వైరస్ కారణంగా తాను వ్యక్తిగతంగా విచారణకు హాజరుకాలేనంటూ డాక్టర్ చెప్పేశారు. తనకు వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. పోలీసుస్టేషన్ అంటే పబ్లిక్ ప్లేస్ కాబట్టి వచ్చేపోయే వారిలో ఎవరి ద్వారా అయినా తనకు కరోనా సోకే ప్రమాదం ఉందికాబట్టి తాను రాలేనంటూ సమాధానమిచ్చారు. అయితే విచారణను వీడియా కాన్ఫరెన్సు ద్వారా చేయాలని పోలీసులు అనుకుంటే హాజరవ్వటానికి తనకు అభ్యంతరం ఏమీ లేదంటూ చెప్పటమే విచిత్రంగా ఉంది. విచారణలో సహకరించాలని కోర్టు ఆదేశించినా పోలీసుల నుండి తప్పించుకుని తిరుగుతున్న డాక్టర్ విషయం ఎప్పటికి తేలుతుందో ఏమో చూడాలి.

This post was last modified on September 24, 2020 12:16 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

17 mins ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

2 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

2 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

2 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

4 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

4 hours ago