ఆవేశపరుడైన మంత్రి కొడాలి నాని తప్పులో కాలేశాడా ? తాజాగా ఆయన మాటలు వింటే అవుననే సమాధానం వస్తుంది. చంద్రబాబునాయుడు అంటేనే కొడాలి ఒంటికాలిపై లేస్తారన్న విషయం ఇప్పటికే చాలాసార్లు నిరూపణైంది. జగన్మోహన్ రెడ్డి తిరుమలకు రావటం, బ్రహ్మోత్సవాల్లో పాల్గొనటం, స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించటం అనే విషయం రాజకీయంగా చాలా వివాదమైంది. శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించేముందే జగన్ డిక్లరేషన్ ఇచ్చేట్లుగా ఒత్తిడి పెట్టాలంటు చిత్తూరు జిల్లాలోని నేతలకు చంద్రబాబు అదేపనిగా ఆదేశించారు. ఈ క్రమంలో తొలుత చంద్రబాబుపై, తదుపరి ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు నాని. మోడీపై నాని చేసిన విమర్శ అబద్ధం అని ప్రచారం జరుగుతుండటంతో అతను ఇరుక్కుపోయినట్లు అర్థమవుతోంది.
శ్రీవారికి పట్ టువస్త్రాలు సమర్పించేటపుడు జగన్ సతీ సమేతంగా ఆలయంకు రావాలని పదే పదే చంద్రబాబు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని మంత్రి మాట్లాడుతూ మోడిని కూడా పిక్చర్లోకి లాగడమూ తెలిసిందే. ఆయోధ్యలో జరిగిన రామజన్మభూమి శంకుస్ధాపనలో భార్య లేకుండానే మోడి ఒక్కడే ఎలా పూజలో పాల్గొంటాడంటూ నిలదీశారు. మోడితో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ను కూడా వివాదంలోకి లాగేశారు లేండి.
అయితే ఇక్కడే మంత్రి పెద్ద పొరబాటు చేశారు. ఏదన్నా విషయాన్ని మాట్లాడేటప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుని మాట్లాడాలి. అయోధ్యలో పూజలు చేసింది మోడి కాదు. శంకుస్ధాపన కార్యక్రమంలో పూజ చేసింది సలిల్ సింఘాల్, మధు సింఘాల్ దంపతులు. సలీల్ సింఘాల్ ఎవరయ్యా అంటే రామజన్మభూమి అంశాన్ని మొదటినుండి భుజాన మోసిన విశ్వహిందు పరిషత్ చీఫ్ అశోక్ సింఘాల్ సోదరుడు. అశోక్ సింఘాల్ ఇపుడు లేరు కాబట్టి ఆయన మీద గౌరవంతో ఆయన సోదరుడితో పూజలు చేయించారు.
శంకుస్ధాపన కార్యక్రమంలో చాలాసేపు పూజలు జరిగినా అందరికీ తెలిసింది నరేంద్రమోడి, యోగి ఆదిత్యనాధే కాబట్టి అందరి దృష్టి వీళ్ళ మీదే ఉంది. సలీల్ దంపతులు ఎవరో చాలామందికి తెలీదు కాబట్టి వీళ్ళని ఎవరు పట్టించుకోలేదు. పూజ చేసింది ఈ దంపతులైతే మోడి, ఆదిత్యనాథ్ లు కేవలం పక్కన కూర్చున్నారంతే. ఈ విషయం తెలీకుండానే మంత్రి కొడాలి నాని అనవసరంగా మోడి, ఆదిత్య నాథ్ పై నోరు పారేసుకున్నాడు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నోరు పారేసుకున్న వాళ్ళే అందరిముందు పలుచనైపోతారు.
This post was last modified on September 24, 2020 9:50 am
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…