ఆవేశపరుడైన మంత్రి కొడాలి నాని తప్పులో కాలేశాడా ? తాజాగా ఆయన మాటలు వింటే అవుననే సమాధానం వస్తుంది. చంద్రబాబునాయుడు అంటేనే కొడాలి ఒంటికాలిపై లేస్తారన్న విషయం ఇప్పటికే చాలాసార్లు నిరూపణైంది. జగన్మోహన్ రెడ్డి తిరుమలకు రావటం, బ్రహ్మోత్సవాల్లో పాల్గొనటం, స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించటం అనే విషయం రాజకీయంగా చాలా వివాదమైంది. శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించేముందే జగన్ డిక్లరేషన్ ఇచ్చేట్లుగా ఒత్తిడి పెట్టాలంటు చిత్తూరు జిల్లాలోని నేతలకు చంద్రబాబు అదేపనిగా ఆదేశించారు. ఈ క్రమంలో తొలుత చంద్రబాబుపై, తదుపరి ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు నాని. మోడీపై నాని చేసిన విమర్శ అబద్ధం అని ప్రచారం జరుగుతుండటంతో అతను ఇరుక్కుపోయినట్లు అర్థమవుతోంది.
శ్రీవారికి పట్ టువస్త్రాలు సమర్పించేటపుడు జగన్ సతీ సమేతంగా ఆలయంకు రావాలని పదే పదే చంద్రబాబు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని మంత్రి మాట్లాడుతూ మోడిని కూడా పిక్చర్లోకి లాగడమూ తెలిసిందే. ఆయోధ్యలో జరిగిన రామజన్మభూమి శంకుస్ధాపనలో భార్య లేకుండానే మోడి ఒక్కడే ఎలా పూజలో పాల్గొంటాడంటూ నిలదీశారు. మోడితో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ను కూడా వివాదంలోకి లాగేశారు లేండి.
అయితే ఇక్కడే మంత్రి పెద్ద పొరబాటు చేశారు. ఏదన్నా విషయాన్ని మాట్లాడేటప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుని మాట్లాడాలి. అయోధ్యలో పూజలు చేసింది మోడి కాదు. శంకుస్ధాపన కార్యక్రమంలో పూజ చేసింది సలిల్ సింఘాల్, మధు సింఘాల్ దంపతులు. సలీల్ సింఘాల్ ఎవరయ్యా అంటే రామజన్మభూమి అంశాన్ని మొదటినుండి భుజాన మోసిన విశ్వహిందు పరిషత్ చీఫ్ అశోక్ సింఘాల్ సోదరుడు. అశోక్ సింఘాల్ ఇపుడు లేరు కాబట్టి ఆయన మీద గౌరవంతో ఆయన సోదరుడితో పూజలు చేయించారు.
శంకుస్ధాపన కార్యక్రమంలో చాలాసేపు పూజలు జరిగినా అందరికీ తెలిసింది నరేంద్రమోడి, యోగి ఆదిత్యనాధే కాబట్టి అందరి దృష్టి వీళ్ళ మీదే ఉంది. సలీల్ దంపతులు ఎవరో చాలామందికి తెలీదు కాబట్టి వీళ్ళని ఎవరు పట్టించుకోలేదు. పూజ చేసింది ఈ దంపతులైతే మోడి, ఆదిత్యనాథ్ లు కేవలం పక్కన కూర్చున్నారంతే. ఈ విషయం తెలీకుండానే మంత్రి కొడాలి నాని అనవసరంగా మోడి, ఆదిత్య నాథ్ పై నోరు పారేసుకున్నాడు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నోరు పారేసుకున్న వాళ్ళే అందరిముందు పలుచనైపోతారు.
దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…