Political News

వైఎస్ పై ఉన్న అభిమానంతో ఓర్చుకున్నా

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి తాజాగా బాంబు పేల్చారు. గ‌త రెండు రోజులుగా ఆయ‌న మీడియా ముందుకు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా మంగ‌ళ‌వారం కూడా.. మీడియా ముందుకు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీలో తాను అనేక ఇబ్బందులు ప‌డ్డాన‌ని చెప్పారు. సొంత పార్టీ నాయ‌కులే.. త‌న‌ను, త‌న కుటుంబాన్ని కూడా టార్గెట్ చేశార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా త‌న కుటుంబంపై సోష‌ల్ మీడియాలో జ‌రిగిన దాడి అంతా ఇంతా కాద‌ని బాలినేని చెప్పారు. దివంగ‌త వైఎస్ పై ఉన్న అభిమానం.. ఆయ‌న ప‌ట్ల ఉన్న గౌర‌వంతోనే తాను అన్ని దాడుల‌ను ఓర్చుకు న్న‌ట్టు బాలినేని తెలిపారు. “నేను హవాలా చేశానని, భూకబ్జాలు చేశానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కోరుతున్నా” అని బాలినేని వ్యాఖ్యానించారు.

జ‌గ‌న్ స‌రిగా పాల‌న చేయ‌న‌ప్పుడు కూడా తాను ప్ర‌శ్నించాన‌ని, అందుకే సొంత పార్టీలోనూ ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వ‌చ్చింద‌న్నారు. తాను ఎవ‌రికీ లొంగి ఉండే ప్ర‌శ్నే లేద‌న్నారు. త‌న ఆస్తుల గురించి ప‌లు రూపాల్లో వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తున్నార‌ని.. కానీ, త‌మ‌కు 1973లోనే ఆస్తులు ఉన్నాయ‌ని చెప్పారు. త‌న‌కు ప్ర‌త్యేకంగా అప్ప‌ట్లోనే కారు ఉంద‌న్నారు. త‌మ కుటుంబం వివాదాల‌కు దూరంగా ఉంటుంద‌న్న బాలినేని.. అలాంటి త‌మ‌ను ఇబ్బంది పెడుతున్నార‌ని చెప్పారు.

పార్టీ ప‌రిస్థితి గురించి మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం ఒక సైలెంట్ పిరియ‌డ్‌లో ఉన్నామ‌న్నారు. ప్ర‌జ‌ల తీర్పును గౌర‌విస్తామ‌ని.. అయితే.. కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని.. అప్పుడు ప్ర‌జ‌ల్లోకి వ‌స్తామ‌ని బాలినేని చెప్పారు. ఈ నెల రోజుల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన అభివృద్ది ఏమీలేద‌ని విమ‌ర్శించారు. కేవ‌లం పింఛ‌న్లు ఇచ్చార‌ని.. అంత‌కు మించి ఏం చేశారో చెప్పాల‌ని టీడీపీని ప్ర‌శ్నించారు. దేశంలో అప్పులు చేయ‌కుండా ఏ ప్ర‌భుత్వ‌మూ న‌డిచే ప‌రిస్తితి లేకుండా పోయింద‌న్నారు.

This post was last modified on July 16, 2024 2:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

7 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

8 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

9 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

9 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

12 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

13 hours ago