Political News

సాయిరెడ్డికే జ‌గ‌న్ జై.. రీజ‌నేంటంటే!

వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ ఎవ‌రిని ఎక్కువ‌గా న‌మ్ముతారు? ఎవ‌రితో ఆయ‌న‌కు అనుబంధం ఎక్కువ‌? రాజ‌కీయంగాను, వ్య‌క్తిగ‌తంగాను జ‌గ‌న్‌.. ఎవ‌రికి ప్రాధాన్యం ఇస్తారు? అనే విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి ఒక్క‌రే క‌నిపిస్తారు. నిజానికి జ‌గ‌న్ చుట్టూ చాలా మంది నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ.. వ్య‌క్తిగ‌తంగా లేదా.. ఆంత‌రంగికంగా చ‌ర్య‌లు జ‌ర‌పాల్సి వ‌చ్చినా.. పార్టీలో కీల‌క విష‌యాలపై నిర్ణ‌యాలు తీసుకోవాల్సి వ‌చ్చినా.. కేంద్రంలో వ్యూహాత్మ‌కంగా చ‌క్రం తిప్పాల్సి వ‌చ్చినా.. జ‌గ‌న్ సంప్ర‌దించే అతి కొద్ది మంది వ్య‌క్తుల్లో.. సాయిరెడ్డి ఒక‌రు.

వాస్త‌వానికి జ‌గ‌న్‌తో అనేక మంది స్నేహం చేశారు. క‌లిసి తిరిగారు. కానీ, అతి కొద్ది మంది మాత్ర‌మే ఆయ‌నతో ఆది నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా క‌లిసి తిరుగుతున్నారు. ఇలాంటి వారిలోనూ సాయిరెడ్డి కీల‌కంగా ఉన్నారు. మ‌రి వీరి మ‌ధ్య బంధం ఎప్ప‌టిది? జ‌గ‌న్ ఎందుకు అంత‌గా ప్రాధాన్యం ఇస్తారు? అనే విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూస్తాయి. సాక్షి ప‌త్రిక పెట్ట‌డానికి ముందు.. జ‌గ‌న్ స్థాపించి వ్యాపార లావాదేవీల‌ను ప‌ర్య‌వేక్షించే ఆడిట‌ర్‌..గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన సాయిరెడ్డి అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సుమారుగా 20 ఏళ్లుగా జ‌గ‌న్‌కు న‌మ్మిన‌బంటుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అటు వ్యాపారంలోనే కాదు.. రాజ‌కీయంగా కూడా సాయిరెడ్డి వ్యూహాలు.. జ‌గ‌న్‌ను అధికారంలోకి తీసుకురావ‌డంతో కీల‌కంగా మారాయ‌ని అంటారు ప‌రిశీల‌కులు. ఇక‌, జ‌గ‌న్‌లో సాయిరెడ్డికి న‌చ్చిన విష‌యం మాట ప‌క్క‌న పెడితే.. సాయిరెడ్డిలో ఉన్న గ‌ట్స్‌, ఎక్క‌డైనా నిర్మొహ‌మాటంగా మాట్లాడే వ్య‌క్తిత్వం జ‌గ‌న్‌కు బాగా న‌చ్చింద‌ని చెబుతారు. నిజానికి ఇప్పుడు మూడు రాజ‌ధానుల విష‌యం ఇంకా కొలిక్కిరాలేదు. కానీ, తాజాగా పార్ల‌మెంటులో మాట్లాడిన సాయిరెడ్డి.. పాల‌నా రాజ‌ధానిగా ఏర్ప‌డుతున్న విశాఖ‌లో ట్రిపుల్ ఐటీ, క్యాట్ వంటి వి కావాల‌ని కోర‌డం సంచ‌ల‌నంగా మారింది.

నిజానికి మిగ‌తా ఎంపీలు ఎవ‌రూ కూడా మూడు రాజ‌ధానుల‌పై పార్ల‌మెంటులో ఎక్క‌డా గ‌ళం వినిపించ‌డం లేదు. కానీ, సాయిరెడ్డి మాత్రం రాజ్య‌స‌భ‌లో దీని ప్ర‌స్తావిస్తూ.. మాట్లాడారు. అదేవిధంగా ఎన్నిక‌ల‌కు ముందు కూడా .. చంద్ర‌బాబును న‌మ్మ‌డానికి వీల్లేద‌ని, ఆయ‌న వ్యూహానికి పై వ్యూహం వేయాల్సిందేనంటూ.. మాట్లాడిన ఆడియో ఒక‌టి హ‌ల్‌చ‌ల్ చేసింది.

ఇలా.. పార్టీలో ఏ విష‌యాన్ని ఎక్క‌డ ప్ర‌స్తావించి.. పార్టీ రేంజ్‌ను పెంచాలో తెలిసిన నాయ‌కుడిగా సాయిరెడ్డి గుర్తింపు పొందారు. ఇదే జ‌గ‌న్‌కు న‌చ్చిన ప‌రిణామం. వీరి మ‌ధ్య బంధానికి కూడా ఇరువురిలోనూ ఉన్న గ‌ట్సే కార‌ణం అంటారు ప‌రిశీల‌కులు. మొత్తానికి ఒక‌రిపై ఒక‌రికి న‌మ్మ‌కం..ఉండ‌డ‌మే వీరిమ‌ధ్య కీల‌క‌మైన బ‌లం!

This post was last modified on September 24, 2020 8:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

39 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago