ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ అధికారం అందుకోవడం కోసం ఎన్డీఎ పక్షాల మద్దతు అవసరం అయింది. సొంతంగా బీజేపీకి మెజారిటీ రాకపోవడంతో కేంద్రంలో ప్రస్తుతం టీడీపీ, జేడీయూ మద్దతు కీలకంగా మారింది. ఇదే సమయంలో రాజ్యసభలో ఎన్డీయే కూటమితో కలిపి కూడా బీజేపీకి తగినంత మంది సభ్యుల బలం లేకపోవడంతో ఎన్డీఏతర పక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.
రాజ్యసభలో మొత్తం 245 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం 20 స్థానాలు ఖాళీలు ఉన్నాయి. సభలో ప్రస్తుతం మేజిక్ ఫిగర్ 113. ఎన్డీయే కూటమికి ప్రస్తుతం 101 సభ్యుల మద్దతు ఉంది. ఈ లెక్కన మేజిక్ ఫిగర్ కు 12 మంది సభ్యులు తక్కువగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో రాజ్యసభలో ఏదైనా బిల్లు ఆమోదం పొందాలి అంటే బీజేపీ ఇతర పార్టీల మీద ఆధారపడాల్సి ఉంటుంది. రాజ్యసభలో వైసీపీకి 11 మంది, అన్నా డీఎంకేకు 3 సభ్యుల బలం ఉండగా, బీఆర్ఎస్ పార్టీకి 4, బీఎస్పీకి ఒక సభ్యుడు ఉన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలు జరిగినా ఎన్డీఏ కూటమి కేవలం 9 స్థానాలు మాత్రమే గెలిచే అవకాశం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి బీజేపీ ఎవరి సాయం కోరుతుంది ? ఎవరు సహకరిస్తారు ? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఎప్పుడో ఆరేళ్ళ క్రితం రిలీజైన సినిమా. ఓటిటిలో వచ్చేసి అక్కడా మిలియన్ల వ్యూస్ సాధించుకుంది. ఇప్పుడు కొత్తగా రీ రిలీజ్…
సెప్టెంబర్ నెల సగానికి పైనే అయిపోయింది. ఇకపై ఆకాశమే హద్దుగా గేమ్ ఛేంజర్ నాన్ స్టాప్ అప్డేట్స్ ఉంటాయని దిల్…
యూత్ హీరో సుహాస్ కొత్త సినిమా గొర్రె పురాణం ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. ట్రైలర్ కూడా వచ్చేసింది.…
జనసేన పార్టీ నాయకుడు, ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై పార్టీ వేటు వేసింది. ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా…
కొన్ని నెలల క్రితం లాల్ సలామ్ అనే సినిమా ఒకటొచ్చిందనే సంగతే చాలా మంది సగటు ప్రేక్షకులు మర్చిపోయి ఉంటారు.…
స్టార్ హీరోలు నటించిన సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చి భారీ వసూళ్లు సాధించడంలో ఆశ్చర్యం లేదు. కానీ చిన్న బడ్జెట్…