How are Rajya Sabha members elected
ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ అధికారం అందుకోవడం కోసం ఎన్డీఎ పక్షాల మద్దతు అవసరం అయింది. సొంతంగా బీజేపీకి మెజారిటీ రాకపోవడంతో కేంద్రంలో ప్రస్తుతం టీడీపీ, జేడీయూ మద్దతు కీలకంగా మారింది. ఇదే సమయంలో రాజ్యసభలో ఎన్డీయే కూటమితో కలిపి కూడా బీజేపీకి తగినంత మంది సభ్యుల బలం లేకపోవడంతో ఎన్డీఏతర పక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.
రాజ్యసభలో మొత్తం 245 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం 20 స్థానాలు ఖాళీలు ఉన్నాయి. సభలో ప్రస్తుతం మేజిక్ ఫిగర్ 113. ఎన్డీయే కూటమికి ప్రస్తుతం 101 సభ్యుల మద్దతు ఉంది. ఈ లెక్కన మేజిక్ ఫిగర్ కు 12 మంది సభ్యులు తక్కువగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో రాజ్యసభలో ఏదైనా బిల్లు ఆమోదం పొందాలి అంటే బీజేపీ ఇతర పార్టీల మీద ఆధారపడాల్సి ఉంటుంది. రాజ్యసభలో వైసీపీకి 11 మంది, అన్నా డీఎంకేకు 3 సభ్యుల బలం ఉండగా, బీఆర్ఎస్ పార్టీకి 4, బీఎస్పీకి ఒక సభ్యుడు ఉన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలు జరిగినా ఎన్డీఏ కూటమి కేవలం 9 స్థానాలు మాత్రమే గెలిచే అవకాశం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి బీజేపీ ఎవరి సాయం కోరుతుంది ? ఎవరు సహకరిస్తారు ? అన్నది ఆసక్తికరంగా మారింది.
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…