Political News

రాజ్యసభలో ఎన్డీఏకు చిక్కులే !

ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ అధికారం అందుకోవడం కోసం ఎన్డీఎ పక్షాల మద్దతు అవసరం అయింది. సొంతంగా బీజేపీకి మెజారిటీ రాకపోవడంతో కేంద్రంలో ప్రస్తుతం టీడీపీ, జేడీయూ మద్దతు కీలకంగా మారింది. ఇదే సమయంలో రాజ్యసభలో ఎన్డీయే కూటమితో కలిపి కూడా బీజేపీకి తగినంత మంది సభ్యుల బలం లేకపోవడంతో ఎన్డీఏతర పక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.

రాజ్యసభలో మొత్తం 245 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం 20 స్థానాలు ఖాళీలు ఉన్నాయి. సభలో ప్రస్తుతం మేజిక్ ఫిగర్ 113. ఎన్డీయే కూటమికి ప్రస్తుతం 101 సభ్యుల మద్దతు ఉంది. ఈ లెక్కన మేజిక్ ఫిగర్ కు 12 మంది సభ్యులు తక్కువగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో రాజ్యసభలో ఏదైనా బిల్లు ఆమోదం పొందాలి అంటే బీజేపీ ఇతర పార్టీల మీద ఆధారపడాల్సి ఉంటుంది. రాజ్యసభలో వైసీపీకి 11 మంది, అన్నా డీఎంకేకు 3 సభ్యుల బలం ఉండగా, బీఆర్ఎస్ పార్టీకి 4, బీఎస్పీకి ఒక సభ్యుడు ఉన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలు జరిగినా ఎన్డీఏ కూటమి కేవలం 9 స్థానాలు మాత్రమే గెలిచే అవకాశం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి బీజేపీ ఎవరి సాయం కోరుతుంది ? ఎవరు సహకరిస్తారు ? అన్నది ఆసక్తికరంగా మారింది.

Share
Show comments
Published by
Satya
Tags: rajyasabha

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

9 seconds ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

44 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago