ఏపీలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు 16 మంది ఎంపీలతో కేంద్రంలో ఎన్డీఎ ప్రభుత్వానికి వెన్నెముకలా మారాడు. ఈ నేఫథ్యంలో ఈ ఐదేళ్లలో కేంద్రం నుండి వీలైనన్ని ఎక్కువ నిధులు, ఎక్కువ ప్రాజెక్టులు, ఎక్కువ పరిశ్రమలు సాధించి ఆంధ్రప్రదేశ్ ప్రగతిని పరుగులు పెట్టించాలని దృఢనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తుంది.
ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుండి కేంద్రానికి అనేక వినతులు వెళ్లడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అయితే అక్కడ ఢిల్లీలోని కేంద్ర కార్యాలయాలలో ఆ ఫైళ్లు ముందుకు సాగడం వాటిని ఆమోదింపచేసుకోవడమే అసలైన సమస్య. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు టీడీపీకి ఉన్న 16 మంది ఎంపీలను కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య రాయబారులుగా వాడుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు 16 మంధి ఎంపీలకు వివిధ శాఖలను అప్పగించి ఆయా శాఖల ఫైళ్లను క్లియర్ చేయించుకుని తీసుకురావాలని సూచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 22 నుండి పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఆ లోపే ఎంపీలకు శాఖలను అప్పజెప్పనున్నట్లు తెలుస్తుంది.
ఈ మేరకు పార్టీ ఎంపీలను తీసుకువెళ్లి కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు ఇప్పించి ఆ ఫైళ్లను క్లియరెన్స్ చేయించే బాధ్యతను పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న లావు శ్రీక్రిష్ణ దేవరాయలకు అప్పగించారు. కింజారపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా, రాజకీయ, పార్లమెంటరీ వ్యవహారలలో కీలక సభ్యుడిగా ఆయన అందరు మంత్రులతో సన్నిహితంగా ఉండి కీలక ఫైళ్లను క్లియర్ చేయించే బాధ్యత అప్పగించినట్లు తెలుస్తుంది.
ఎన్డీఎలో టీడీపీ ప్రస్తుతం కీలక భాగస్వామి. టీడీపీ తరపున గెలిచిన వారిలో అనేక మంది విద్యాధికులు ఉన్నారు. ఈ నేపథ్యంలో అనేక పార్లమెంటరీ కమిటీలలో టీడీపీకి చెందిన వారికి అవకాశాలు పుష్కలంగా లభించనున్నాయి. వీరంతా ఆ బాధ్యతలు చేపట్టాక ఆయా శాఖల ఉన్నతాధికారులు, మంత్రులతో సాన్నిహిత్యం పెంచుకుని ఏపీకి సంబంధించిన వాటిని సాధించుకుని రావాలని చంద్రబాబు చెబుతున్నట్లు తెలుస్తుంది.
ఏపీ రాజధాని అమరావతిలో పనుల నిర్మాణం వేగంగా జరుగుతోందని మంత్రి నారాయణ తెలిపారు. ఇక్కడ సంస్థలను ఏర్పాటు చేసేందుకు అనేక…
సంచలన తీర్పును వెలువరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. వేశ్యావృత్తికి సంబంధించి చట్టపరమైన స్థితిని.. సెక్స్ వర్కర్ల ప్రాథమిక హక్కులపై…
సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద బూతు అన్నట్లుగా కొందరు నాయకులు చేసే కామెంట్లు హిందువులకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తుంటాయి.…
వైసీపీ అధికారంలో ఉండగా.. ఆపార్టీకి చెందిన నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…
పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…