Political News

ప‌వ‌న్‌.. చెత్త నుంచి సొమ్ము తెస్తున్నారు!

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ త‌న హ‌యాంలో చెత్త‌పై ప‌న్నులు వేసి సొమ్ములు చేసుకున్నారు. కానీ, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న ప‌వ‌న్‌.. అదే చెత్త‌ను వినియోగించి వేల కోట్ల రూపాయ‌ల సొమ్ములు సంపాయించుకునే మార్గం దిశ‌గా అడుగులు వేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యంపై ప్రధానంగా దృష్టి సారించామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాడేపల్లిలో ఈ రోజు ఆయన అధికారులతో సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఇళ్ళ నుంచి సేకరించే చెత్త నుంచి ఆదాయం పొందవచ్చన్నారు. ఏడాదికి 2 వేల 643 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందన్నారు.

రాష్ట్రంలో పంచాయతీల్లో నిధులు లేవని.. గత ప్రభుత్వం పంచాయతీలను, నిధులను దారి మ‌ళ్లించింద‌ని వివ‌రించారు. గ్రామీణ ప్రాంతాల్లో చెత్త నిర్వహణ విషయంలో బాధ్యత తీసుకుంటానని చెప్పారు. రోజుకు రెండుసార్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించి, ప్రాసెసింగ్ సెంటర్ కు పంపిస్తామ‌న్నారు.తద్వారా వ‌చ్చే సొమ్మును గ్రామీణ ప్రాంతాల‌కే ఖ‌ర్చు చేస్తామ‌న్నారు. ఇక‌, న‌దుల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. గోవుల‌ను ప‌రిరక్షించేందుకు, గో సంత‌తి పెంచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తామ‌న్నారు. కాలువలు, న‌దులు డంపింగ్‌ యార్డుల్లా మారిపోయాయ‌ని చెప్పారు. వీటిని ప్ర‌క్షాళ‌న చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మ‌రో సంచ‌లన ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణం పై ప్రత్యేక ఫోకస్ పెట్టిన ఆయ‌న ఓ చెట్టు గురించి మాట్లాడుతూ.. వాటిని త‌క్ష‌ణ‌మే న‌రికేయాల‌ని సూచించారు. అవి చాలా డేంజర్ అని వెంటనే తొలగించాల‌ని అధికారులకు సూచించారు. ‘కోనో కార్పస్ చెట్లను గతంలో తన ఫాంహౌస్‌లో పెంచానని పవన్ తెలిపారు. అయితే వాటితో ప్రమాదమ‌ని తెలిసి తొలగించిన‌ట్టు వెల్ల‌డించారు. కాకినాడలో మొత్తం 4,602 కానో కాన్ఫరస్ చెట్లు ఉన్నట్లు గుర్తించామ‌న్నారు. ఈ చెట్లను దశల వారీగా తొలగించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు.

ఏడాకుల చెట్టుగా పిలుచుకునే ఈ కోనో కార్పస్ ప్రజల ఆరోగ్యానికి మంచిది కాద‌ని పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడంతో అధికారులు వాటిని తొలగించే పనిలో పడ్డారు. దక్షిణ అమెరికాకు చెందిన కోనో కార్పస్ జాతి మొక్కల్ని సుందరీకరణ కోసం వాడుతున్నారు. వాటి వలన భూగర్భజలాలు తగ్గపోతాయని, ప్రజల ఆరోగ్యాలకు కూడా ప్రమాదమని ఓ అధ్యయనంలో తేలింది. దీంతో ప‌వ‌న్ వాటిని తొల‌గించాల‌ని ఆదేశించారు.

This post was last modified on July 12, 2024 2:28 pm

Share

Recent Posts

పార్టీ అధిష్టానానికే బోండా ఉమ సవాల్?

ముద్రగడ పద్మనాభం సంతాప సభకు హాజరైన అంశంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా…

38 minutes ago

పాతిక రోజుల్లో ఇరుముడి… ఏదీ సందడి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…

3 hours ago

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…

5 hours ago

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

5 hours ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

6 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

9 hours ago