ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాభవంతో ఢీలా పడ్డ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సమస్యలు తప్పడం లేదనే చెప్పాలి. ఎన్నికల్లో ఘోరా పరాజయం కారణంగా వైసీపీని వీడే నాయకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే కొంతమంది పార్టీకి గుడ్బై చెప్పగా.. ఇప్పుడు మరికొంతమంది నాయకులు కూడా పక్కచూపులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో కీలక నాయకుడు, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా త్వరలోనే వైసీపీనీ వీడబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత బుగ్గన బయటకు రావడం లేదు. ఆయన పత్తా లేకుండా పోయారు. పార్టీ కార్యకర్తలు, నాయకులతోనూ టచ్లో లేరని తెలిసింది. ఢిల్లీలోనే ఉంటూ బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అరెస్టు భయం, వ్యాపారాలు కాపాడుకోవడం కోసం బీజేపీలో చేరేందుకు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
జగన్ కేబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా బుగ్గన పని చేశారు. దీంతో నిధుల కోసం ఢిల్లీకి తరచూ వెళ్లడంతో బీజేపీ కేంద్ర పెద్దలతో కాస్త సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరోవైపు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వ విధ్వంసం, అవినీతిని సీఎం చంద్రబాబు బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఆర్థిక దోపిడీ జరిగిందన్నారు. దీనిపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం తనవరకూ వస్తుందేమోనని బుగ్గన టెన్షన్ పడుతున్నట్లు టాక్.
అలాగే తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలో ఆయనకు మైనింగ్, సిమెంట్ తదితర వ్యాపారాలున్నాయి. దీంతో భవిష్యత్లో ఇబ్బందులు తప్పవని ముందే గ్రహించి బీజేపీలోకి వెళ్లేందుకు తనకున్న పరిచయాలతో ప్రయత్నాలు మొదలెట్టినట్లు సమాచారం. అందుకే ఆయన ఢిల్లీలోనే మకాం వేశారని అంటున్నారు. మరి బుగ్గను రాకకు బీజేపీ అంగీకరిస్తుందా? చంద్రబాబు ఒప్పుకుంటారా? అన్నది చూడాలి.
This post was last modified on July 11, 2024 6:59 pm
కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…