Political News

మల్లారెడ్డి మాస్టర్ ప్లాన్ నిజమేనా ?!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డికి కష్టాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. 2014లో మల్కాజ్ గిరి ఎంపీగా టీడీపీ టికెట్ దక్కించుకుని రాజకీయ అరంగేట్రం చేసిన మల్లారెడ్డి ఆ తరువాతి పరిణామాలలో బీఆర్ఎస్ పార్టీలో చేరి 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు.

2014లో మల్కాజ్ గిరి టీడీపీ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించిన రేవంత్ రెడ్డి తనకు మల్లారెడ్డి అడ్డురావడంతో ఆయన విద్యాసంస్థల మీద అప్పట్లో టీడీపీలోనే ఉంటూ గవర్నర్ కు ఫిర్యాదు చేశాడు. దీంతో అప్పటి నుండే మల్లారెడ్డికి, రేవంత్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇక 2018 తర్వాత మంత్రిగా మల్లారెడ్డి ఉండగా, మల్కాజ్ గిరి ఎంపీగా రేవంత్ ఉన్నాడు. ఈ సమయంలో కూడా ఇద్దరి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు హాట్ హాట్ గా నడిచాయి.

ఇక గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడమే కాకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం మల్లారెడ్డికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. అధికారంలోకి వచ్చిన వెంటనే రేవంత్ మల్లారెడ్డి, అతని అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి విద్యా సంస్థలను టార్గెట్ చేసి అనుమతులు లేవని, దారి లేదని భవనాలను కూల్చడం, రహదారులను తవ్వడం చేశారు.

దీంతో కాంగ్రెస్ లో చేరేందుకు బెంగుళూరు వెళ్లి అక్కడి ఉప ముఖ్యమంత్రి డీకె శివకుమార్ ద్వారా చక్రం తిప్పి కాంగ్రెస్ అధిష్టానం ద్వారా గ్రీన్ సిగ్నల్ తీసుకుని పార్టీలో చేరాలని భావించినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఇక లాభం లేదు అనుకుని బీజేపీ వైపు చూశారు. అయితే అక్కడి నుండి కూడా ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో సైలెంట్ అయ్యారు.

అయితే ఇటీవల ఏపీలో చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావడం, ఇటీవల తెలంగాణ పర్యటనలో ఇక్కడ టీడీపీని బలోపేతం చేస్తామని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో మల్లారెడ్డి తాను రాజకీయ అరంగేట్రం చేసిన టీడీపీలో చేరడమే ప్రస్తుతానికి తనకు సేఫ్ అన్న ఆలోచనకు వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు, రేవంత్ రెడ్డిల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు అందరికీ తెలిసిందే. ఇక బీజేపీకి కేంద్రంలో ప్రభుత్వం కొనసాగాలంటే తెలుగుదేశం పార్టీ మద్దతు తప్పనిసరి. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలలో చేరికకు అవకాశాలు లేని నేపథ్యంలో టీడీపీలో చేరితే అటు కేంద్రం నుండి, ఇటు రాష్ట్రంలోని రేవంత్ ప్రభుత్వం నుండి ఇక్కట్లను తప్పించుకోవచ్చు అన్న ఆలోచన మల్లారెడ్డి చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి మల్లారెడ్డి మాస్టర్ ప్లాన్ ఫలిస్తుందా ? వికటిస్తుందా ? వేచిచూడాలి.

Satya

Recent Posts

‘వర్క్ ఆన్ బైక్’… ఇది టూ మచ్ గురు!

కరోనా మహమ్మారి పుణ్యమా అని వర్క్ ఫ్రమ్ హోమ్ మన జీవనయానంలో ఓ విదానం అయితే… ఆ తీరు ప్రభావం…

12 minutes ago

బాహుబలి ఎపిక్… ఇదేం విడ్డూరం

గత ఏడాది బాహుబలి రెండు భాగాలను సింగల్ పార్ట్ గా మార్చి బాహుబలి ది ఎపిక్ పేరుతో విడుదల చేసిన…

2 hours ago

వ‌డ్డే న‌వీన్ అంత ప‌వ‌ర్ ఫుల్లా?

90వ ద‌శ‌కంలో మ‌న‌సిచ్చి చూడు.. చాలాబాగుంది స‌హా ప‌లు ఫ్యామిలీ సినిమాల‌తో ఆక‌ట్టుకున్న న‌టుడు వ‌డ్డే నవీన్. జ‌గ‌ప‌తిబాబు, శ్రీకాంత్‌ల…

3 hours ago

రిస్కు చేయడమే విలువను పెంచుతోంది

టాలీవుడ్ లో ఉన్న చాలా అగ్ర నిర్మాణ సంస్థలు బిజినెస్ లెక్కల ఆధారంగానే సినిమాలు తీస్తున్న మాట వాస్తవం. హీరో…

4 hours ago

మల్లు అర్జున్ క్రేజ్ చెక్కు చెదరలేదు

మనం తమిళ హీరోలు రజనీకాంత్, విజయ్, సూర్య లాంటి వాళ్ళను నెత్తినబెట్టుకుని చూస్తాం కానీ మనోళ్ళను వాళ్ళు పిచ్చ లైట్…

4 hours ago

లెనిన్ మళ్ళీ మాట తప్పితే ఎలా

మొన్నటిదాకా జూన్ 26 రావడం పక్కాని పదే పదే ప్రమోషన్లలో ఊదరగొట్టిన లెనిన్ మళ్ళీ వాయిదా పడిందనే వార్త అభిమానుల్లో…

4 hours ago